అమరావతి ఆశ.. రమణబాబు దురాశ
కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్లో అపహరణకు గురైన 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదు కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు.
తొమ్మిది నెలల కిందటనే స్టేషన్లో సొత్తు మాయం
81.52 కిలోల వెండి, రూ.10 లక్షల నగదు స్వాధీనం
ఇప్పటి వరకు నలుగురి అరెస్టు
పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదు, వెండి
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే : కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్లో అపహరణకు గురైన 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదు కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి కర్నూలు బుధవారపేటకు చెందిన అమరావతి( కౌతాళం హెడ్ కానిస్టేబుల్), ఆత్మకూరు పట్టణం నేతాజీ నగర్కు చెందిన రమణబాబు(కోడుమూరు కానిస్టేబుల్), అమరావతి భర్త విజయ్భాస్కర్ (బుధవారపేట), ఆమె మరిది భరత్సింహా(ప్రకాశ్నగర్)ను నిందితులుగా గుర్తించి అరెస్టు చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో అదనపు ఎస్పీ ప్రసాద్, సిబ్బందితో కలిసి ఎస్పీ సిద్ధార్థ కౌశల్ శనివారం వివరాలు వెల్లడించారు.
105 కిలోల వెండి.. రూ.2.05 లక్షల నగదు
* 2021 జనవరి 27న కర్నూలు మండలం పంచలింగాల చెక్పోస్టు వద్ద సెబ్ అధికారులు తనిఖీలు చేస్తుండగా హైదరాబాద్ నుంచి కారులో వస్తున్న తమిళనాడు రాష్ట్రం సేలం వ్యాపారి సందన్ భారతిగోవిందరాజ్ వద్ద 105 కిలోల వెండి, రూ.2.05 లక్షల నగదు దొరికింది. సరైన ఆధార పత్రాలు లేకపోవటంతో అక్రమ రవాణాగా పరిగణిస్తూ సీజ్ చేసి కర్నూలు తాలుకా అర్బన్ పోలీసుస్టేషన్లో సీఐ విక్రమ్సంహాకు అప్పగించారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లటంతో రూ.35 లక్షల జరిమానా విధించారు.
వ్యాపారి రారని నిర్ధారించుకుని
* బాధితులు జరిమానా చెల్లించకపోవటంతో సొత్తు స్టేషన్లో ఉంచారు. అప్పట్లో స్టేషన్ రైటర్గా ఉన్న కానిస్టేబుల్ రమణబాబు ఠాణాలోని ప్రాపర్టీ గదిలో వెండిని భద్రపరిచి రూ.2.05 లక్షలు వాడుకున్నారు. కొన్నాళ్లకు సీఐ విక్రమ్సింహా బదిలీ కావడంతో ఆయన స్థానంలో శేషయ్య వచ్చారు. ఇదే సమయంలో రమణబాబు బదిలీ కావడంతో తను వాడుకున్న రూ.2.05 లక్షలు స్టేషన్ రైటర్, హెడ్ కానిస్టేబుల్ అమరావతికి తిరిగి ఇచ్చేశారు.
* వెండి తీసుకెళ్లేందుకు తమిళనాడు వ్యాపారి ఆసక్తి చూపటం లేదన్న విషయాన్ని పసిగట్టిన అమరావతికి కాజేయాలన్న దుర్భుద్ధి పుట్టింది. వ్యాపారికి అమరావతి పలుమార్లు వాట్సాప్ కాల్ చేశారు.. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఇక వారు రారని నిర్ధారించుకున్నారు. వెండి అపహరించే ఆలోచనను కానిస్టేబుల్ రమణబాబుకు చెప్పి అతడిని భాగస్వామిగా చేసుకుంది.
భర్తను రప్పించి.. బ్యాగులు బయటకు తోసి
వెండిని కాజేయాలన్న ఆలోచనలో ఉన్న అమరావతి అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. సీజ్ చేసి స్టేషన్లో ఉంచిన మద్యాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం మే 24న చేపట్టారు. సిబ్బంది హడావుడిగా ఉన్న సమయంలో అమరావతి స్టేషన్ మొదటి అంతస్తులో ఉన్న వెండిని కిందికి తీసుకొచ్చి సీఐ గదికి మార్చింది. అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో తన భర్తతో స్టేషన్కు వచ్చింది. సీఐ గదిలో కిటికీకి గ్రిల్ లేకపోవటంతో రెండు బ్యాగుల వెండిని బయటకు తోశారు. వాటిని తీసుకొని విజయ్భాస్కర్ అక్కడి నుంచి ఉడాయించారు. తర్వాత విజయ్భాస్కర్ తన తమ్ముడు భరత్సింహా ద్వారా 23 కిలోల వెండి విక్రయించారు.
వీటికి సమాధానాలేవీ
వెండి చోరీ ఉదంతంలో పలు విషయాలు మిస్టరీగా మారాయి. రికవరీ విషయంలో స్పష్టత కొరవడింది. వెండి విక్రయించిన తర్వాత హెడ్ కానిస్టేబుల్ అమరావతితో చేతులు కలిపిన కానిస్టేబుల్ రమణబాబు వాటా లెక్క చెప్పలేదు. 23 కిలోల వెండి విక్రయించి నగదుగా మార్చుకున్నట్లు చెప్పిన ఉన్నతాధికారులు ఆ డబ్బుతో ఏమి కొనుగోలు చేశారో చెప్పలేదు. కొత్త కారులో పారిపోతున్నట్లు చెప్పినా.. ఆ కారు ఎవరిది.. ఎప్పుడు కొనుగోలు చేశారో వివరాలు వెల్లడించలేదు.
వ్యాపారి రావడంతో వెలుగులోకి
వెండి ధర పెరిగేసరికి ఇటీవల తమిళనాడు వ్యాపారి వెండికి పన్ను చెల్లించి విడుదల ఉత్తర్వు పొందారు. వెండి తీసుకెళ్లేందుకు కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్కు రావటంతో వెండి, నగదు మాయమైనట్లు బయటపడింది. ఈ ఉదంతం కాస్త వివాదాస్పదంగా మారటంతో కేసు నమోదుకు ఎస్పీ ఆదేశించారు. చర్యలు తీసుకుంటారని గ్రహించిన నిందితులు ముందస్తు బెయిల్ పొందేందుకు కారులో కర్ణాటక రాష్ట్రానికి పారిపోతుండగా పట్టుకున్నామని, 81.52 కిలోల వెండి, రూ.10 లక్షల నగదు వారి నుంచి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. జరిగిన ఘటన బాధాకరమని ఎస్పీ విచారం వ్యక్తం చేస్తూ మరోసారి ఇలాంటివి పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో విచారణ జరిపించి లోపాలు గుర్తిస్తామని, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ