Kurnool: బుగ్గన ఇలాకాలో.. అల్లరి మూకల కేకలు
ఆర్థిక మంత్రి ఇలాకా డోన్ పట్టణంలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు. యువకులు బృందాలుగా ఏర్పడి ప్రధాన ప్రాంతాల్లో తిరుగుతూ దాడులకు దిగుతున్నారు.
వరుస ఘటనలతో ప్రజల్లో ఆందోళన
గుంపులుగా చేరి గొడవలు
డోన్లో ప్రజలు స్వేచ్ఛగా ఉండాలనేదే ధ్యేయం. గత ప్రభుత్వంలో మాదిరి ప్రజలు భయపడే పరిస్థితులు లేవు. శాంతిభద్రతల పరిరక్షణకు అహర్నిశలు పోలీసులు కృషి చేస్తున్నారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తరచూ చెప్పిన మాటలివి!!
డోన్, న్యూస్టుడే: ఆర్థిక మంత్రి ఇలాకా డోన్ పట్టణంలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు. యువకులు బృందాలుగా ఏర్పడి ప్రధాన ప్రాంతాల్లో తిరుగుతూ దాడులకు దిగుతున్నారు. గతంలో ఓ సీఐ గట్టిగా హెచ్చరించడంతో కొన్నిరోజుల పాటు గొడవలు జరగలేదు. ఇటీవల కాలంలో ఆకతాయిల ఆగడాలు ఎక్కువయ్యాయి. డోన్ పట్టణంలో దాదాపు 80 వేలకు పైగా జనాభా ఉంటోంది. పట్టణ, గ్రామీణ పోలీస్స్టేషన్, డీఎస్పీ కార్యాలయాలు ఉన్నాయి. పట్టణ ఠాణా పరిధిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, నలుగురు ఏఎస్సైలు, ఎనిమిది మంది హెడ్ కానిస్టేబుళ్లు, 23 మంది కానిస్టేబుళ్లు, 18 మంది హోంగార్డులు ఉన్నారు. పట్టణం విస్తరిస్తున్న నేపథ్యంలో మరో 50 మంది కానిస్టేబుళ్లను కేటాయించాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు.
ఇటీవల పట్టణంలో పలు ప్రాంతాల్లో వందలాది మంది యువకులు ఘర్షణకు దిగారు. టీఆర్నగర్లో పట్టపగలే ఘర్షణలకు పాల్పడటంతో అసలేం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వారికి కొందరు నేతల అండదండలు ఉండటం వల్లే పోలీసులు కఠిన చర్యలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలు రేగుతున్నాయి. నాలుగు రోజుల కిందట డోన్ పట్టణంలోని రాఘవేంద్రస్వామి గుడి వీధిలో కత్తులు, కర్రలతో యువకులు పరస్పరం దాడులకు దిగారు. రణరంగాన్ని చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో నలుగురిపై కేసులు నమోదు పోలీసులు మమ అనిపంచారు. గట్టి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికు మండిపడుతున్నారు.
ఇటీవల కొన్ని ఘటనలు
- చిగురుమానుపేటలో ఈనెల 16న ఓ వ్యక్తిపై అదేకాలనీకి చెందిన కొందరు మద్యంమత్తులో విచక్షణారహితంగా దాడికి పాల్పడంతో తీవ్ర గాయాలపాలయ్యారు.
- కొండపేట ప్రాంతంలో కొందరు యువకుల మధ్య జరిగిన గొడవలో రెండుబైక్లు ధ్వంసమయ్యాయి.
- పేరంటాళ్లమ్మ గుడి వద్ద ఈనెల 8న యువకుల మధ్య జరిగిన ఘర్షణలో బీరుసీˆసాతో దాడి చేయడంతో తీవ్రంగా యువకుడు గాయపడ్డారు.
- కేఈమాదన్ననగర్లో ఆటోనగర్కు చెందిన యువకుడిపై పాతకక్షలతో కొందరు దాడికి పాల్పడటంతో స్థానిక మహిళలు గట్టిగా కేకలు వేయటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం
పట్టణంలో జరుగుతున్న ఘర్షణలపై యువతను స్టేషన్కు పిలిపించి మంత్రణం నిర్వహిస్తున్నాం. కొందరిపై కేసులు కూడా నమోదు చేస్తున్నాం. శాంతిభద్రతల పరిరక్షణకు గట్టిచర్యలు తీసుకుంటున్నాం. అల్లరిమూకల ఆట కట్టించేందుకు సిబ్బందితో గట్టి చర్యలు తీసుకుంటాం.
శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ, డోన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు