logo

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు.

Published : 12 Apr 2024 10:22 IST

నంద్యాల గాంధీ చౌక్ :  ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. శనివారం పట్టణంలోని పురపాలక కార్యాలయం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 13న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలన్నారు. ఈ  కార్యక్రమంలో పురపాలక కమిషనర్ నిరంజన్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి , ఎంహెచ్ఓ అంకిరెడ్డి, డీఈ శ్రీనివాసరెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి నరసింహమూర్తి, మెప్మా అధికారి విజయభాస్కర్ రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌  లక్ష్మీనారాయణ శర్మ, శివప్రసాద్ రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని