తప్పిన పాఠం.. దక్కని ఫలితం
ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. పలు కళాశాలల్లో సగం మంది విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల నాడు- నేడు పనులు సాగుతుండటంతో పాఠ్యాంశాల బోధనకు ఆటంకంగా మారింది.
ఇంటర్లో వెనుకబాటు
కళాశాలలపై దృష్టిసారించని ప్రభుత్వం
ఇంటర్ ఫలితాలు నిరాశపరిచాయి. పలు కళాశాలల్లో సగం మంది విద్యార్థులు కూడా ఉత్తీర్ణత సాధించని పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల నాడు- నేడు పనులు సాగుతుండటంతో పాఠ్యాంశాల బోధనకు ఆటంకంగా మారింది. అధ్యాపకుల కొరతా వేధిస్తోంది. ప్రభుత్వం జూనియర్ కళాశాలలపై దృష్టిసారించకపోవడంతో ఫలితాలు తప్పాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఒప్పంద అధ్యాపకులతోనే బోధన
ఆదోని విద్య, న్యూస్టుడే: ఆదోని పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో అధికంగా ఒప్పంద అధ్యాపకులతోనే చదువులు కొనసాగిస్తున్నారు. ఈ కళాశాలలో ఇంటర్మీడియేట్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ఈ కళాశాలలో మొదటి సంవత్సరంలో 296 మంది, ద్వితీయ సంవత్సరంలో 171 మంది విద్యార్థినులు చదువులు కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ఇంటర్మీడియేట్ పరీక్ష ఫలితాల్లో 58 శాతం విద్యార్థినులు ఉత్తీర్ణత సాధించారు.
- ఆదోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఒప్పంద అధ్యాపకులే అధికంగా ఉన్నారు. ఈ కళాశాలలో ముగ్గురు రెగ్యూలర్ అధ్యాపకులు ఉండగా.. పది మంది ఒప్పంద అధ్యాపకులు, ఒకరు గెస్ట్ ఫ్యాకల్టీ, ఒకరు వ్యాయమ అధ్యాపకుడు, ఒకరు గ్రంథాలయ అధికారి ఉన్నారు. కళాశాలలో రెగ్యూలర్ అధ్యాపకులను నియమించాల్సిన అవసరం ఉంది.
- రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు పథకం కింద కళాశాలలో పనులు చేపట్టింది. గత ఏడాది ప్రారంభమైన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పథకం కింద కళాశాలలో 20 మరుగుదొడ్ల నిర్మాణం, విద్యుదీకరణ, మరమ్మతులు, భవనంపై రూపింగ్ తదితర పనులు చేపట్టారు.
అంతంత మాత్రమే..
ఆలూరు గ్రామీణ, న్యూస్టుడే: ఆలూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 163 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 90 మంది ఉత్తీర్ణుత సాధించారు. కళాశాలలో అన్ని పాఠ్యాంశాలకు అధ్యాపకులు ఉన్నా.. ఫలితాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఆంగ్ల అధ్యాపకుడికి ఇన్ఛార్జి ప్రిన్సిపల్ బాధ్యతలు అప్పగించారు. ఆయన తన పాఠ్యాంశం బోధనతో పాటు ప్రిన్సిపల్ విధులు నిర్వర్తించాలి. పరీక్షల అనంతరం ఆయన పదోన్నతిపై వెళ్లినట్లు వారు చెప్పారు. కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ప్రిన్సిపల్ రమాదేవి తెలిపారు.
వేధిస్తున్న అధ్యాపకుల కొరత..
మద్దికెర, న్యూస్టుడే: మద్దికెర ఆదర్శ పాఠశాలలో ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం పూర్తిగా పడిపోయింది. అధ్యాపకుల కొరత కారణంగా గణనీయంగా తగ్గింది. మొదటి సంవత్సరంలో 49 మంది పరీక్షలు రాయగా 12 మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరం 60 మందికి గాను 10 మందే ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపల్ సవిత తెలిపారు. పాఠ్యాంశాలు బోధించే అధ్యాపకులు లేక ఉత్తీర్ణత తగ్గిపోయిందని ఆమె చెప్పారు.
చిప్పగిరి చిట్టచివరన
చిప్పగిరి, న్యూస్టుడే: చిప్పగిరి జూనియర్ కళాశాల ఇంటర్ ఫలితాల్లో చిట్టచివరన నిలిచింది. రెండేళ్లుగా కళాశాల ఉత్తీర్ణత మరీ దారుణంగా మారింది. రెండు శాతం ఫలితం వచ్చింది. ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 67 మంది పరీక్షలు రాయగా ఒకరు మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ ఇంటర్లో 58 మందికి గాను నలుగురు ఉత్తీర్ణులయ్యారు. ఆర్డీటీ, స్థానికుల సాయంతో రూ.66లక్షలతో కళాశాల భవనం నిర్మించారు. సిబ్బందీ ఉన్నా.. ఉత్తీర్ణత మాత్రం సాధించకపోవడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి