logo

నీళ్లు లేవు

ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డిని జనం నిలదీశారు. ఆదోని మండలం బైచిగేరిలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.

Published : 13 Apr 2024 02:32 IST

ఆదోని ఎమ్మెల్యేను నిలదీసిన జనం

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే సాయిప్రసాద్‌ రెడ్డిని జనం నిలదీశారు. ఆదోని మండలం బైచిగేరిలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పింఛన్లు, తాగునీరు, మురుగు కాల్వలు, విద్యుత్తు స్తంభాలు తదితర సమస్యలు పరిష్కరించాలని పల్లెవాసులు ప్రశ్నించారు. తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నాం.. ఎపుడు సరఫరా చేస్తారో తెలియని పరిస్థితి ఉందని గ్రామస్థులు ముక్తకంఠంతో అడిగారు. స్థానికంగా చర్చికి వెళ్లడంతో.. అక్కడ ఉన్నవారంతా పలు సమస్యలను ప్రస్తావించారు. స్థానిక నాయకులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. మీరు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజల సమస్యల పరిష్కరానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ మధుసూదన్‌, మార్కెట్‌యార్డు వైఎస్‌ ఛైర్మన్‌ తిమ్మప్ప పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని