logo

కార్యకర్తలకు తెదేపా అండగా ఉంటుంది

కౌతాళం మండలం కాత్రికి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త అనారోగ్య కారణాలతో మృతి చెందాడు.

Published : 13 Apr 2024 16:34 IST

కౌతాళం: కౌతాళం మండలం కాత్రికి గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. మంత్రాలయం కూటమి అభ్యర్థి సోదరుడు రామకృష్ణ రెడ్డి, తెదేపా సీనియర్‌ నేత చూడి ఉలిగయ్య మృతుడి గ్రామానికి వెళ్ళి మృత దేహానికి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని విధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురేష్ నాయుడు, చంద్రన్న, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని