logo

బహుజనులు రాజ్యాధికారం సాధించాలి

బీసీల రిజర్వేషన్ పితామహుడు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ స్పూర్తితో బహుజనులంతా రాజ్యాధికారం సాధించాలని సమాజ్‌వాదీ పార్టీ రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్ పాండురంగ యాదవ్, నంద్యాల జిల్లా అధ్యక్షుడు పెరుగు శివ కృష్ణయాదవ్ అన్నారు.

Published : 13 Apr 2024 19:09 IST

రైతునగరం(నంద్యాల): బీసీల రిజర్వేషన్ పితామహుడు బిందేశ్వర్ ప్రసాద్ మండల్ స్పూర్తితో బహుజనులంతా రాజ్యాధికారం సాధించాలని సమాజ్‌వాదీ పార్టీ రాయలసీమ జిల్లాల కోఆర్డినేటర్ పాండురంగ యాదవ్, నంద్యాల జిల్లా అధ్యక్షుడు పెరుగు శివ కృష్ణయాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా నాయకులు ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో సామాజిక న్యాయం అందరికీ అందాలంటే సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజేష్, షేక్ ఫరీదాబీ, సుబ్బరాయుడు, ధనుంజయ యాదవ్, శ్రీనివాసగౌడ్, మనోహరాచారి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని