ఎక్కడికక్కడ నిలదీతలు
సార్వత్రిక ఎన్నికల సమయం ప్రారంభమైంది. బరిలో దిగిన అభ్యర్థులు ప్రచారాలు చేస్తున్నారు. మరోవైపు ప్రజలు అధికార వైకాపా నాయకులను ఎక్కడికక్కడ కడిగేస్తున్నారు.
అయోమయంలో వైకాపా నేతలు
ఈనాడు, నంద్యాల : సార్వత్రిక ఎన్నికల సమయం ప్రారంభమైంది. బరిలో దిగిన అభ్యర్థులు ప్రచారాలు చేస్తున్నారు. మరోవైపు ప్రజలు అధికార వైకాపా నాయకులను ఎక్కడికక్కడ కడిగేస్తున్నారు. ఐదేళ్లపాటు ఎక్కడికెళ్లారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రచారం కోసం వచ్చిన ముఖ్యమంత్రినే జనం నిలదీయడం సంచలనంగా మారింది. తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదంటూ నేతలను నిర్మొహమాటంగా ప్రశ్నిస్తుండడంతో ఏమి సమాధానం చెప్పాలో పాలకులకు పాలుపోవడంలేదు. వారిని సముదాయించేందుకు వైకాపా అభ్యర్థులు నానా తంటాలు పడాల్సి వస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏటా వేసవిలో వందలాది గ్రామాల్లో తాగునీటి సమస్య వేధిస్తున్నా అధికార పార్టీ నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బస్సు యాత్రలో భాగంగా కోడుమూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు కొత్తూరు గ్రామంలో పలువురు మహిళలు ఖాళీ బిందెలు చూపి నిరసన తెలిపారు. తుగ్గలి మండలం జొన్నగిరిలోనూ మహిళలు ముఖ్యమంత్రిని నిలదీశారు.
గడపగడపకు పేరు చెప్పి
ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యేలను ఇంటింటికి తిప్పారు. ప్రజలు ఇచ్చిన విజ్ఞప్తులు తీసుకుని వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి వార్డు/గ్రామ సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున కేటాయిస్తామని ప్రభుత్వ ప్రకటించింది. ప్రజల నుంచి వచ్చిన డిమాండ్లను పరిశీలించి చేయాలని సూచించింది. క్షేత్రస్థాయిలో జరిగింది అరకొరే. ఫలితంగా పలువురు ఎమ్మెల్యేలు ప్రచారానికి వెళ్లేందుకు కూడా జంకాల్సిన దుస్థితి నెలకొంది.
గుక్కెడు నీటికి అల్లాడుతున్నాం
ప్యాపిలి మండలం జలదుర్గం గ్రామంలో నీటి సమస్యపై మంత్రి బుగ్గన కుమారుడు అర్జున్రెడ్డిని పలువురు మహిళలు నిలదీశారు. గ్రామంలో సుమారు 200 కుటుంబాలకు తాగేందుకు గుక్కెడు నీళ్లు రావడంలేదని... ఇదేనా అభివృద్ధి? అని ప్రశ్నించడంతో బుగ్గన కుమారుడు నివ్వెరపోయారు. ట్యాంకర్లు మొక్కుబడిగా పంపుతున్నారని.. నీరు సరిపోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఉదంతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
జనం ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి
మెగా డీఎస్సీపై ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకను, రహదారి సమస్యపై ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి కుమార్తె గౌతమీరెడ్డిని, నీటి సమస్యపై సి.బెళగల్ మండలం పలుకుదొడ్డిలో ఎమ్మెల్యే సుధాకర్, కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీశ్ను మూడు రోజుల కిందట నిలదీశారు. వెల్దుర్తి మండలం బుక్కాపురంలో ఇంటి బిల్లులు రాలేదని ఒకరు, ఉపాధి హామీ పనులు చూపడం లేదని మరికొందరు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిని నిలదీశారు. ఆస్పరి మండలం ములుగుందం గ్రామ ఎస్సీ కాలనీలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షిని కాలనీ మహిళలు చుట్టుముట్టారు. కౌతాళంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమార్తె ప్రియాంకను పలువురు మహిళలు నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్