బైపాస్ భూ బాధితులకు న్యాయం చేస్తాం
రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే.. ఆదోనిలో బైపాస్ రహదారి భూ బాధితులకు న్యాయం చేస్తామని భాజపా ఆదోని అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ పార్థసారధి అన్నారు.
మాట్లాడుతున్న భాజపా అభ్యర్థి డాక్టర్ పార్థసారథి
ఆదోని మార్కెట్, న్యూస్టుడే: రాష్ట్రంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి రాగానే.. ఆదోనిలో బైపాస్ రహదారి భూ బాధితులకు న్యాయం చేస్తామని భాజపా ఆదోని అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ పార్థసారధి అన్నారు. స్థానిక ఎన్డీయే భాగస్వామ్య పక్షాల ఉమ్మడి కార్యాలయంలో శనివారం బైపాస్ రహదారి బాధితుల సమస్యలు విన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్జైన్, సావిత్రమ్మ శ్రీరాములు, దేశాయిచంద్రన్న, తదితరులు పాల్గొన్నారు.
భాజపాలో చేరిక: ఆదోని పాతపట్టణం, న్యూస్టుడే: భాజపా అభ్యర్థి డాక్టర్ పార్థసారథి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కునిగిరి నీలకంఠ సమక్షంలో మండలంలోని కుప్పగల్లు, బసాపురం గ్రామాలకు చెందిన వంద కుటుంబాల వారు భాజపాలో చేరారు. అన్నారు.
ఆలూరు రాత మార్చుదాం: దేవనకొండ, న్యూస్టుడే: కరవు కాటకాలతో అల్లాడిపోతున్న ఆలూరు నియోజకవర్గం రాత మార్చుదామని, అది తెదేపాతోనే సాధ్యమని ఆ పార్టీ అభ్యర్థి వీరభద్రగౌడు, జనసేన నియోజకవర్గ నాయకులు తెర్నేకల్ వెంకప్ప, జిల్లా ఇన్ఛార్జీ సురేషుబాబు, భాజాపా నాయకులు వెంకటరాముడు అన్నారు. దేవనకొండలో జనసేన ఆధ్వర్యంలో శనివారం ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అంతకు ముందు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు మాజీ బొజ్జమ్మ, బడిగించల రంగన్న, మల్లయ్య, బండ్లయ్య, రామచంద్రనాయుడు, సుధాకర్, జగదీశ్, నందు, బడేసాబ్, తదితరులు పాల్గొన్నారు.
వెల్దుర్తిలో డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి
వెల్దుర్తి, న్యూస్టుడే: తెదేపా అధికారం చేపట్టిన వెంటనే విద్యార్థుల ఉన్నత చదువుల కోసం వెల్దుర్తిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని పత్తికొండ తెదేపా అభ్యర్థి కేఈ.శ్యాంబాబు అన్నారు. స్థానిక తెదేపా కార్యాలయంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సుధాకర్తో పాటు మరికొందరు తెదేపాకు శనివారం సంఫీˆుబావం తెలిపారు. వెల్దుర్తికి చెందిన కొత్తఓటర్లు, మహిళలు మండల తెదేపా నాయకులు శివశంకరరెడ్డి, బలరాంగౌడ్, రమాకాంత్రెడ్డి ఆధ్వర్యంలో తెదేపాలో చేరారు. గోవర్ధనగిరిలో వైకాపాకు చెందిన శ్రీనివాసులు, లక్ష్మన్న కుటుంబాలు మండల తెదేపా నాయకులు సుబ్బరాయుడు, గ్రామ తెదేపా నాయకులు రామచంద్రుడు, గోపాల్ సమక్షంలో తెదేపాలో చేరాయి.
పత్తికొండ గ్రామీణం, న్యూస్టుడే: పత్తికొండ మండంలోని కోతిరాళ్ల, ఆర్.మండగిరి, జె.అగ్రహారం తదితర గ్రామాల్లో తెదేపా నాయకులు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. తెదేపా సీనియర్ నాయకుడు కె.సాంబశివారెడ్డి నేతృత్వంలో నాయకులు ప్రమోద్కుమార్రెడ్డి, బత్తిన లోక్నాథ్, చల్లారవి, ఈశ్వరప్ప, బీటీ గోవిందు, హనుమంతు, రమేశ్, నాగేశ్, శిరీష, ఉచ్చీరప్ప తదితరులు పాల్గొన్నారు.
జయహో బీసీ: తుగ్గలి, న్యూస్టుడే: తెదేపా బీసీ నాయకులు తుగ్గలి నాగేంద్ర, బత్తిన వెంకటరాముడు పగిడిరాయి గ్రామంలో శనివారం జరిగిన జయహో బీసీ సదస్సులో వారు మాట్లాడారు. మాజీ ఎంపీపీ వెంకటేష్, పార్టీ నాయకులు తిరుపాల్నాయుడు, ఈశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వెల్దుర్తి, న్యూస్టుడే: గోవర్ధనగిరి గ్రామంలో మండల తెదేపా అధ్యక్షుడు బలరాంగౌడ్ ఆధ్వర్యంలో జయహో బీసీˆ కార్యక్రమం శనివారం నిర్వహించారు. తెదేపా మండల నాయకుడు సుబ్బరాయుడు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?