జగన్ మాటలు.. ఉత్తి చేతలు
ఐదేళ్లు.. వారందరికీ కన్నీళ్లే. వైకాపా పాలనలో ఎసీˆ్స కార్పొషన్ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది. కనీసం పథకాలు కూడా ఎసీˆ్సలకు గుర్తులేని పరిస్థితి నెలకొంది.
ఎసీˆ్స కార్పొరేషన్ నిర్వీర్యం
దరిచేరని పథకాలు
ఐదేళ్లు.. వారందరికీ కన్నీళ్లే. వైకాపా పాలనలో ఎసీˆ్స కార్పొషన్ ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది. కనీసం పథకాలు కూడా ఎసీˆ్సలకు గుర్తులేని పరిస్థితి నెలకొంది. ఎంతో మంది యువత నిరుద్యోగులుగా ఉన్నా.. ఎలాంటి భరోసా కల్పించలేని పరిస్థితి. బృందాలకు సైతం రుణాలు ఇప్పించలేకపోవడంతో.. ఉపాధి వేటలో ఊరు వదిలి వెళ్తున్నారు యువతీ యువకులు. ట్యాక్సీలు కొనుగోలు చేసి ఉపాధి పొందేవారు. ప్రస్తుతం ఎక్కడా యువతకు అలాంటి సదుపాయం కల్పించడం లేదు. వైకాపా పాలనలో అత్యధికంగా దగాపడిన వారి జాబితాలో ఎసీˆ్సలు ముందు వరసలో ఉన్నారు. వారి అవస్థలు, ఆవేదనలు ఇలా పంచుకున్నారు.
రుణం వస్తుందని ట్రాక్టర్ కొన్నా..
సంజీవ, ట్రాక్టర్ యజమాని, ఆస్పరి
ఆస్పరి, న్యూస్టుడే: ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణం మంజూరు చేస్తుందన్న ఆశతో 2022-21లో దరఖాస్తు చేసుకున్నా. ట్రాక్టర్ ధర రూ7.35లక్షలు కాగా అందులో రూ.1.95 లక్షలు అప్పులు చేసి చెల్లించా. మిగతా రూ.5.50 లక్షలు నెలల అప్పులు చేసి ట్రాక్టర్ కంతులు చెల్లిస్తున్నాం. ఓ వైపు ట్రాక్టర్ కొనుగోలు చేసిన అప్పు, మరో వైపు కంతుల భారంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాô. ఎస్సీ కార్పొరేషన్తో మాకు నిధులు మంజూరు అయివుంటే సుమారు రూ.3.95లక్షలు రాయితీ కింద తగ్గేది. ట్రాక్టర్ అమ్ముకోలేక, స్థానికంగా పనులు లేక, కంతులు చెల్లించలేక.. అప్పులపాలవుతున్నా.
ఎస్సీలకు న్యాయం జరగలేదు
స్వామినాథ్, విరుపాపురం (ఆదోని)
ఆదోని గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం ఎస్సీల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఎస్సీ కార్పొరేషన్లు ఉనికి లేకుండా పోయింది. తెదేపా ప్రభుత్వంలో ఎస్సీ యువతకు వాహనాలు తీసుకొనేందుకు రుణ సాయం చేశారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లేక అవస్థలు పడుతోంది. గతంలో ఎస్సీ, ఎస్టీ వీధులకు సైతం ప్రత్యేక నిధులు కేటాయించేవారు. ప్రస్తుతం అది జరగడం లేదు. వైకాపా ప్రభుత్వంలో ఎస్సీలకు న్యాయం జరగలేదు.
శ్మశానానికి స్థలమేదీ
కృష్ణ, అల్లుగుండు (వెల్దుర్తి)
వెల్దుర్తి, న్యూస్టుడే: మూడేళ్లుగా మా గ్రామానికి శ్మశానవాటికకు స్థలం కేటాయించాలని అధికారులకు, నాయకులకు విన్నవిస్తున్నాం. ఏ ఒక్కరూ పట్టించుకోవడంలేదు. ప్రస్తుతం ఉన్న కొద్ది స్థలంలోనే గ్రామంలో ఎవరు మృతిచెందినా.. అక్కడే ఖననం చేస్తారు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. కొన్ని సందర్భాల్లో అస్తిపంజరాలు బయటపడుతుంటాయి. ఇది ఆవేదనకు గురిచేసే అంశం. ఎస్సీలకు ప్రత్యేక శ్మశానవాటిక కేటాయించి స్థలం మంజూరు చేయాలని కోరుతున్నా.. పట్టించుకునే వారే లేకపోయారు. మండల అధికారులతో పాటు, జిల్లా కార్యాలయంలో నిర్వహించే స్పందనలో విన్నవించిన పట్టించుకోవడం లేదు.
రుణాల ఊసే లేదు
ఇజ్రాయిల్, ఆదోని పట్టణం
ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్టుడే: కొన్నేళ్లుగా ఆటో నడుపుకొంటూ జీవనం సాగిస్తున్నా. రోజుకు ఆటో బాడుగ రూ.250 చెల్లించి, డీజిల్ డబ్బులు పోనూ మిగిలిన దాంట్లో కుటుంబాన్ని పోషించుకోవాలి. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఆటోల కొనుగోలుకు రుణాలు ఇచ్చేవారు. ఆపై రాయితీతో భారం తగ్గించే వారు. వైకాపా ప్రభుత్వం అలాంటి పథకాలు ఏవీ అమలు చేయడం లేదు. మాలాంటి నిరుద్యోగ యువతకు కార్పొరేషన్ ద్వారా రుణం ఇవ్వకపోవడం బాధాకరం.
వ్యవస్థను నిర్వీర్యం
రాజు, ఆలూరు
ఆలూరు గ్రామీణ, న్యూస్టుడే: ఎస్సీ కార్పొరేషన్తో యువకులు రుణాలు తీసుకుని ఉపాధి అవకాశాలు పొందే వారు. వైకాపా పాలనలో ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు. ఐదేళ్లలో రుణాలు, ప్రోత్సాహం అందించిన దాఖలాలు లేవు. గతంలో తెదేపా హయాంలో కార్పొరేషన్ ద్వారా రుణాలతో పాటు, ఉపాధి కోసం వాహనాలు మంజూరు చేశారు. స్థానికంగా పరిశ్రమలు కూడా రాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల