logo

వైకాపాకు రోజులు దగ్గరపడ్డాయి

వైకాపా ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని.. ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరుచరితారెడ్డి పేర్కొన్నారు.

Published : 14 Apr 2024 03:07 IST

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి

కల్లూరు గ్రామీణ, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని.. ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే, పాణ్యం నియోజకవర్గ తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి గౌరుచరితారెడ్డి పేర్కొన్నారు. కల్లూరు మండలంలోని పెద్దకొట్టాల, చిన్నకొట్టాల, రేమడూరు, పుసులూరు, బొల్లవరం గ్రామాల్లో శనివారం పర్యటించారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేస్తారన్నారు..వైకాపా హయాంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నకొట్టాలకు చెందిన పలువురు వైకాపా నాయకులు ఆమె సమక్షంలో తెదేపాలో చేరారు. జనసేన ఉమ్మడి జిల్లా సమన్వయకర్త చింతా సురేష్‌బాబు, కల్లూరు మండల తెదేపా అధ్యక్షుడు రామాంజనేయులు, మాజీ ఎంపీపీ మాధవి, తడకనపల్లె సర్పంచి సహెరాబీ, ప్రభాకర్‌రెడ్డి, మురళీరెడ్డి, రంగారెడ్డి,  పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని