అవాస్తవాలు.. దుష్ప్రచారాలు చేస్తే కటకటాలే
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ అభ్యర్థుల విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. బనగానపల్లి ఎమ్మెల్యే కుమారుడు మాజీ ఎమ్మెల్యేపై చేసిన ఘాటు విమర్శల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
చట్టపరమైన చర్యలు
న్యూస్టుడే, కర్నూలు నేరవిభాగం, నంద్యాల నేరవిభాగం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో పార్టీ అభ్యర్థుల విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. బనగానపల్లి ఎమ్మెల్యే కుమారుడు మాజీ ఎమ్మెల్యేపై చేసిన ఘాటు విమర్శల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వివాదాస్పదంగా మారటంతో ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. కర్నూలు వైకాపా కార్పొరేటర్ చిన్నాన్న అదే పార్టీలో కొనసాగుతున్నప్పటికీ ప్రతిపక్ష పార్టీ నుంచి వచ్చి చేరినట్లు వైకాపా నేతలు ఆయనకు కండువా వేయటం.. చేరికల డ్రామా అంటూ సదరు పోస్టు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. నందికొట్కూరులో ఓ వైకాపా నాయకుడు ఓ ముస్లిం మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఉద్రిక్తంగా మారిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. కొందరు నాయకులు పార్టీ మారే అలోచనలు లేనప్పటికీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వెలిసిన పోస్టులు వైరల్ మారటంతో సదరు నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. విమర్శల పోస్టులు, అవాస్తవ వార్తలకు సంబంధించి నంద్యాల ఎన్నికల అధికారులు 14 మందికి నోటీసులు జారీ చేశారు.
విద్వేషపూరిత ప్రసంగం, తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేశారు. ఏఏ సెక్షన్లు వర్తిస్తాయి.. వాటి పరిణామాలు ఎలా ఉంటాయో వివరించి అవగాహన కల్పించారు. సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచేందుకు కలెక్టర్ ఛైర్పర్సన్గా వ్యవహరించే ప్రత్యేక కమిటీలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి.
1.త్వరలో జరిగే ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో.. ఏ పార్టీకి ఎంత శాతం ఓట్లు పడతాయో తదితర వివరాలతో ఇంటలిజెన్స్ బ్యూరో ఇచ్చిన నివేదిక అంటూ సామాజిక మాధ్యమాలు, పలు ఛానళ్లలో ఓ పోస్టు వైరలైంది. అవి తప్పుడు పోస్టులంటూ ఆయా ఛానళ్లు ప్రజలకు వివరించాయి.
2.ముస్లిం సోదరుల్లారా.. తస్మాత్ జాగ్రత్త అంటూ ముస్లిం మేధావుల సంఘం పేరుతో తెదేపా, జనసేన, జనసేన కూటమికి వ్యతిరేకంగా అవాస్తవాలతో కూడిన కరపత్రాలను జిల్లాలో మైనార్టీలు అధికంగా ఉండే ప్రాంతాల్లో పలువురు పంపిణీ చేశారు. సదరు కరపత్రాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ కుట్ర వెనుక అధికార పార్టీ నాయకులు ఉన్నట్లు తెలిసింది.
3.అధికార పార్టీకి చెందిన ఓ కర్నూలు ప్రజాప్రతినిధి విజయవాడ నుంచి పార్టీ ఫండ్ తీసుకొచ్చి పంచకుండా స్వాహా చేసినట్లు అదే పార్టీకి చెందిన మరో నాయకుడు సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టి తొలగించటం వివాదాస్పదంగా మారింది. సదరు ప్రజాప్రతినిధి అనుచరులు అతడిని ఇంటి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లి కొట్టడంతో ఆయన పోలీసుస్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. చివరికి సదరు నాయకుడు అదేరోజు రాత్రి మళ్లీ పోలీసుస్టేషన్కు వెళ్లి తన ఫిర్యాదు పత్రాన్ని వెనక్కు తీసుకున్నారు.
ఐపీసీ సెక్షన్ 505: ఇతర వర్గాలను ప్రేరేపించే ఉద్దేశంతో వారికి వ్యతిరేకంగా తప్పుడు ప్రకటనలు, సందేశాలను ప్రచారం చేసి శాంతికి భంగం కల్గించే చర్యలకు పాల్పడితే బాధ్యులపై ఈ సెక్షన్ కింద చర్యలు తీసుకుంటారు. మూడేళ్ల జైలుశిక్ష లేదా జరిమానా.. లేదా రెండూ అమలవుతాయి.
సెక్షన్ 125, ప్రజాప్రతినిధుల చట్టం 1951..: ఎన్నికలకు సంబంధించి వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని పోత్సహించే చర్యలకు పాల్పడితే ఈ చట్టం అమలు చేస్తారు.
ఐపీసీ 153ఏ: మతం, జాతి, జన్మస్థలం, నివాసం, భాష తదితర అంశాలపై సమూహాల మధ్య శతృత్వాన్ని పెంపొందించటం, సామరస్య పరిరక్షణకు హాని కలిగించే చర్యలకు పాల్పడితే చర్యలు తీసుకుంటారు.
ఐపీసీ 153 బీ : జాతీయ సమగ్రతకు విఘాతం కలిగించే ఆరోపణలు, వాదనలు చేస్తే కేసులు నమోదు చేస్తారు.
ఐపీసీ 295 ఏ : ఉద్దేశపూర్వక, హానికరమైన చర్యలకు పాల్పడటం, సామాజిక వర్గాలు, మత విశ్వాసాలను అవమానపరచడం వంటి చర్యలకు పాల్పడితే ఈ చట్టం వర్తిస్తుంది.
ఐపీసీ 298 : మతపరమైనభావాలు గాయపరిచే చర్యలకు పాల్పడితే ఈ చట్టం వర్తిస్తుంది.
సెక్షన్ 123(3ఏ) ప్రజాప్రతినిధుల చట్టం, 1951 : కులం, మతం, జాతి, భాష ప్రాతిపదికన అభ్యర్థి లేదా అతని ఏజెంటు లేదా ఇతర వ్యక్తుల ద్వారా వివిధ తరగతుల మధ్య శత్రుత్వం లేదా ద్వేషభావాలు ప్రోత్సహించేందుకు యత్నిస్తే చర్యలు తీసుకుంటారు.
సెక్షన్ 94, ప్రజాప్రతినిధుల చట్టం 1951 : ఓటింగ్ గోప్యత ఉల్లంఘిస్తే ఈ చట్టం వర్తిస్తుంది.
ఐపీసీ 171 సి : స్వేచ్ఛగా ఓటేసే అవకాశం ఉన్నచోట ఓటర్లను ఒత్తిడికి గురిచేసినా, బెదిరించినా, ఇతర పద్ధతుల్లో ప్రభావాలకు గురిచేస్తే ఈ చట్టం ద్వారా చర్యలు తీసుకుంటారు.
ఐపీసీ 171 జి : అభ్యర్థులు ఓటర్లను ప్రభావితం చేసే తప్పుడు ప్రకటనలు, ప్రచారాలు చేస్తే కేసులు నమోదు చేస్తారు.
సెక్షన్ 126 ఏ, ప్రజాప్రతినిధుల చట్టం 1951 : నిర్ణీత వ్యవధిలో ఎగ్జిట్పోల్స్ నిర్వహించటం, వాటి ఫలితాలు ప్రచారం చేయటం నిషేధం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ