టిడ్కో గృహం.. జగన్ గ్రహణం
పేదల ప్రభుత్వమని గొప్పలు చెబుతారు.. వారి ఇళ్లను పూర్తి చేయాలంటే మనసొప్పదు.. కట్టినవి పూర్తి చేయరు.. కొత్త వాటికి పునాది వేయరు.. పేదలకు అన్ని వసతులతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలని గత తెదేపా ప్రభుత్వం సంకల్పించింది..
తాళాలిచ్చారు.. తలుపులు మూశారు
దరఖాస్తుదారులకు తప్పని అద్దె నివాసం
జగన్నాథగట్టు ప్రాంతంలో
ఆదోని పురపాలకం, న్యూస్టుడే: పేదల ప్రభుత్వమని గొప్పలు చెబుతారు.. వారి ఇళ్లను పూర్తి చేయాలంటే మనసొప్పదు.. కట్టినవి పూర్తి చేయరు.. కొత్త వాటికి పునాది వేయరు.. పేదలకు అన్ని వసతులతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలని గత తెదేపా ప్రభుత్వం సంకల్పించింది.. బడుగులకు అన్ని వసతులతో ఇళ్లు దక్కడం జగన్కు రుచించనట్టుంది. ఐదేళ్లుగా లబ్ధిదారులకు ఇవ్వకుండా నాన్చుతున్నారు. ఇళ్లు పూర్తిచేసి పేదలకు ఇవ్వాల్సిన చోట.. వైకాపా రంగులు వేసుకుని నాయకులు సొంత డాబు కొట్టే ప్రయత్నం చేసింది. రంగుల కోసం ఒక్కో పురపాలికల్లో రూ.10-15 కోట్ల వరకు సమర్పించారు... మౌలిక వసతులు కల్పించకుండా తాళాలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. అక్కడికి వెళ్లి నివాసం ఉండలేక పేదలు ఇబ్బంది పడుతున్నారు.
ఎక్కడ ఎలా ఉందంటే
నంద్యాల: పట్టణ సమీపంలో పదివేల ఇళ్లు నిర్మించారు. ఇప్పటి వరకు 700 మందికి తాళాలిచ్చారు. ప్రస్తుతం 32 మంది వరకు నివాసం ఉంటున్నారు. ఇళ్లు కేటాయించలేదు కాబట్టి డబ్బులు తిరిగి చెల్లించాలని 48 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి రూ.20 లక్షల వరకు రావాల్సి ఉంది.
ఆదోని: పట్టణ శివారులో 4,208 ఇళ్లు నిర్మించగా.. 1600 మందికి తాళాలిచ్చారు. ఒక్క కుటుంబ కూడా నివాసం ఉండటం లేదు. ఇంటికి ముందస్తుగా చెల్లించిన డబ్బులివ్వాలని కోరుతూ 60 మంది వరకు అర్జి పెట్టుకున్నారు.. సుమారు రూ.అర కోటి వరకు చెల్లింపులు జరగాల్సి ఉంది.
ఎమ్మిగనూరు: 4,272 ఇళ్లు నిర్మించగా.. 935 మందికి ఇంటి తాళాలిచ్చారు. ఇక్కడా 176 మంది డబ్బు తిరిగి ఇవ్వాలని కోరుతున్నారు. వీరికి రూ.కోటి దాకా చెల్లించాల్సి వస్తుంది.
కర్నూలు: నగర శివారులో పదివేల గృహాల నిర్మాణం పూర్తి చేశారు. రెండు వేల మందికి తాళాలిచ్చారు. ఒక్క కుటుంబం కూడా నివాసం ఉండటం లేదు. 581 మంది లబ్ధిదారులు ( 365 చ.అ, 430 చ.అ) తాము చెల్లించిన సొమ్ము (మొత్తం రూ.2.70 కోట్లు) తిరిగివ్వాలని దరఖాస్తు పెట్టుకున్నారు.
ఆళ్లగడ్డ: ఒక్కో ఇల్లు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా 1,394 ఇళ్లు నిర్మించారు. వీటికి లబ్ధిదారులు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సినవసరం లేదు. వెయ్యి మందికి తాళాలు ఇచ్చారు.. ఏడు వందల మంది గృహ ప్రవేశాలు చేశారు. సరైన మౌలిక వసతుల్లేక లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారు.
డోన్: ఒక్కో ఇల్లు 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా 244 ఇళ్లు నిర్మించారు. కొందరు న్యాయస్థానానికి వెళ్లడంతో తాళాలు ఇవ్వలేదు.
అసెంబ్లీ మాట.. నీటి మూట
‘‘ 365 చ.అ. విస్తీర్ణం ఉన్న ఇళ్ల లబ్ధిదారులు తమ వాటాగా రూ.50 వేలు కట్టాలి. దాన్ని రూ.25 వేలకు తగ్గిస్తాం. 430 చ.అ. విస్తీర్ణం ఉన్న ఇళ్ల లబ్ధిదారులు రూ.లక్ష చెల్లించాలి. దాన్ని రూ.50 వేలకు కుదిస్తాం. ప్రభుత్వమే ఆ భారాన్ని భరిస్తుందని’’ 2020 డిసెంబరులో అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. ముఖ్యమంత్రి మాట నీటిమూటే అయింది. యాభై శాతం రాయితీ కోసం లబ్ధిదారులు ఏళ్ల తరబడిగా నిరీక్షిస్తున్నారు.
- ఎక్కడ: కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, ఆళ్లగడ్డ, డోన్
- నిర్మించాల్సిన ఇళ్లు: 30,630
- ప్రాజెక్టు విలువ: రూ.2,318 కోట్లు
- ఇప్పటి వరకు తాళాలు ఇచ్చింది: 5,547
ఐదేళ్ల అద్దె భారం రూ.695.4 కోట్లు
నాడు ఉమ్మడి జిల్లాలోని నాలుగు పురపాలికల్లో ఇళ్ల కోసం వేలల్లో దరఖాస్తులు వచ్చాయి. ఇందులో మొదటి విడత కింద 28 వేల ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. పట్టణవాసులై ఉండి, సొంతిల్లు ఉండరాదు, బీపీఎల్ పరిధిలో ఉండాలి. వచ్చిన దరఖాస్తులను పురపాలక అధికారులు బృందాలుగా విచారించి, లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరంతా పేద, మధ్య తరగతికి చెందిన వారు, అద్దె ఇళ్లలో ఉంటున్న వారే. ఈ లెక్కన ఒక్కో ఇంటికి సరాసరి రూ.4వేలు అద్దె ప్రకారం నెలకు రూ.11.59 కోట్లు ఏడాదికి రూ.139.08 కోట్లు, ఐదేళ్లకు లెక్కిస్తే రూ.695.4 కోట్లు అద్దె భారం వైకాపా ప్రభుత్వం తీరుతో పేదలపై పడింది. టిడ్కో ఇళ్లకు జనం డబ్బులు చెల్లించారు. వాటినీ నాటి తెదేపా ప్రభుత్వం ఆమోదం తెలిపినా.. అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం రద్దు చేసింది.
ఆరు పట్టణాలు.. 30,630 ఇళ్లు
పేదలకు అన్ని వసతులతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లను నిర్మించి ఇవ్వాలని గత తెదేపా ప్రభుత్వం సంకల్పించింది. ఇళ్ల నిర్మాణాన్ని టిడ్కో(టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్) చేపట్టింది. మొదటి రకం (300 చదరపు అడుగులు) నివాసాలు ఉచితంగా ఇస్తారు. కేంద్ర, రాష్ట్ర వాటా రాయితీ రూ.3 లక్షలు చెల్లిస్తుంది. రెండో రకం ( 365 చ.అ) నివాసానికి లబ్ధిదారి వాటా రూ.50 వేలు. మూడో రకం (430 చ.అ) నివాసానికి లబ్ధిదారు వాటా రూ.లక్ష (నాలుగు విడతల్లో) చెల్లించాలి. రెండో రకానికి రూ.3.15 లక్షలు, మూడోరకం ఇంటికి రూ.3.65 లక్షలు బ్యాంకు రుణం అందిస్తారు.
రుణం.. లబ్ధిదారులకు నరకం
ఇళ్ల కోసం లబ్ధిదారులకు బ్యాంకులు రూ.279 కోట్ల రుణం చెల్లించాల్సి ఉండగా రూ.141.50 కోట్లు చెల్లించారు. వాయిదాలు చెల్లించాలని, ఆయా బ్యాంకులు తాఖీదులు జారీ చేయడం, వారి ఖాతాల నుంచి వడ్డీ పేరుతో భారం మోపారు. దీంతో ఎన్పీలుగా మారిపోవడంతో వారి వ్యక్తిగత అవసరాలకు సైతం బ్యాంకు సేవలు అందకుండా చేసింది వైకాపా ప్రభుత్వం. టిడ్కో ఇళ్లకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడం లేదని గ్రహించిన బ్యాంకులు అటు వైపు చూడటమే మానేశాయి. దీంతో ఇళ్లు కావాల్సిన లబ్ధిదారులు ఏకమొత్తంలో సొంతంగా రుణ మొత్తాలు చెల్లిస్తే ఇళ్లను అప్పగిస్తామంటూ పురపాలికల ద్వారా నోటీసులు పంపడం విడ్డూరంగా మారింది.
మౌలిక వసతులు మమ
టిడ్కో గృహ సముదాయాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు, ఆటస్థలం, సేదదీరేందుకు ఉద్యానవనం, నడకకు ప్రత్యేక మార్గం ఏర్పాటు చేయాలని, వాణిజ్య అవసరాల కోసం బ్యాంకు, షాపింగ్ కాంప్లెక్స్ తదితర సముదాయాలు నిర్మించి లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమాత్రం పట్టించుకోలేదు. మంచినీరు, మురుగు నీరు పారే వ్యవస్థ, విద్యుత్తు సౌకర్యాలు కల్పించడమే కొండంత భారంగా భావించింది. ఉద్యానవనం, నడక మార్గం, షాపింగ్ కాంప్లెక్స్ తదితర వాటిని పురపాలక సంఘాలకే వదిలేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ