దళిత సంక్షేమంపై జగన్ కుట్ర
కృష్ణానగర్కు చెందిన ఆంజనేయులు ఐటీఐ (సివిల్) చదివారు.. సర్వే చేసేందుకు ప్రత్యేక పరికరాల కోసం ఎన్ఎస్ఎఫ్డీసీ కింద 2017-18లో రూ.10 లక్షలు రుణం తీసుకొన్నారు. ఇందులో సుమారు రూ.4 లక్షల రాయితీ రాగా మిగతా రూ.6 లక్షలను 2022లో తీర్చేశారు.
పథకాలన్నింటికీ సర్కారు గండి
ఉపాధికి దూరం చేసే ప్రయత్నం
పెచ్చులూడి బయటకు తేలిన ఇనుప చువ్వలు
కృష్ణానగర్కు చెందిన ఆంజనేయులు ఐటీఐ (సివిల్) చదివారు.. సర్వే చేసేందుకు ప్రత్యేక పరికరాల కోసం ఎన్ఎస్ఎఫ్డీసీ కింద 2017-18లో రూ.10 లక్షలు రుణం తీసుకొన్నారు. ఇందులో సుమారు రూ.4 లక్షల రాయితీ రాగా మిగతా రూ.6 లక్షలను 2022లో తీర్చేశారు. ఇప్పుడు ఒక కార్యాలయం ఏర్పాటు చేసి నలుగురు ఉద్యోగులను నియమించుకొని ప్రైవేటు సర్వే చేస్తూ తాను సంపాదిస్తూ నలుగురికి ఉపాధి కల్పిస్తున్నారు.
‘‘ నా ఎస్సీలు.. నా ఎస్టీలు అంటూ ఎక్కడికక్కడ ఊదరగొట్టే జగన్.. దళిత సం‘క్షేమం’పై కుట్ర పన్నారు. పేదల పక్షపాతిగా పైకి చెప్పుకొనే జగన్ అధికారంలోకి రాగానే ఒక్క కలంపోటుతో కుల కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారు. అట్టడుగు వర్గాలు స్వయంగా ఎదగకుండా... తన దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడి బతికేలా దురాలోచనను అమలు చేస్తున్నారు. గత తెదేపా ప్రభుత్వ హయాంలో అమలైన సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేశారు. నత్తగుల్లలాంటి నవరత్న పథకాలకు నిధులు బదిలీ చేస్తూ అంకెల గారడీతో ఎస్సీలను వంచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2 లక్షల కుటుంబాలకుపైగా ఎస్సీ, ఎస్టీలున్నారు. ఉపాధిని దెబ్బతీయడం ఒక్కటే కాదు... వారికి అందుతున్న నాణ్యమైన విద్య, ఏళ్లుగా అమలవుతున్న ప్రత్యేక పథకాలు, ప్రత్యేక చట్టాల ద్వారా అందుతున్న సాయం... ఇలా అన్నింటికీ జగన్ ప్రభుత్వం పాతరేసింది. సొంతంగా ఎదిగే అవకాశాల్లేకుండా జీవితాలను ఛిద్రం చేశారు.’’
కర్నూలు సంక్షేమం, సచివాలయం, గాయత్రి ఎస్టేట్ న్యూస్టుడే: ఉప ప్రణాళిక కింద మూడేళ్లలో కేవలం 3,412 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చారు. చాలా దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.
నగరంలోని రాజ్విహార్ సమీపంలోని అంబేడ్కర్ భవన్ శిథిలావస్థకు చేరింది. పెచులూడి ఇనుప చువ్వలు బయటకు తేలి ప్రమాదకరంగా మారాయి
నిర్వీర్యం చేసి.. నిరుద్యోగులుగా మార్చి
తెదేపా హయాంలో ఏటా ఎస్సీ సంక్షేమ (కార్పొరేషన్) శాఖ ద్వారా సుమారు 4 వేల మందికి రూ.60 కోట్ల వరకు రుణాలిచ్చేవారు. ఏటా నాలుగు నుంచి ఐదు వేల మంది రాయితీ రుణాలు తీసుకునేవారు. ఆ డబ్బులతో స్వయం ఉపాధి పొందేవారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి తాళం వేసింది. ఒక్కరికీ రుణం ఇవ్వలేదు. జగనన్న చేదోడు కింద ఎస్సీ లబ్ధిదారులకు ఏడాదికి రూ.18,500 చొప్పున ఇస్తున్నామని వైకాపా గొప్పలు చెబుతోంది. నిరుద్యోగ యువత ఒక్కొక్కరికి రూ.2 లక్షల వరకు రుణం ఇవ్వాల్సి ఉండగా.. దానిని పది మందికి పంచి ఎక్కువ మంది లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు ఇచ్చినట్లు గొప్పలు చెబుతోంది. ఎస్సీ నిరుద్యోగులకు ఉపాధి చూపింది శూన్యమే. బటన్ నొక్కడం వల్ల స్వయం ఉపాధి లేకుండా పోయిందని యువకులు పేర్కొంటున్నారు.
బెస్టు పథకాన్ని మడతపెట్టేశారు
ప్రతిభావంతులైన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకాన్ని నిర్వీర్యం చేశారు. గత 25 ఏళ్లుగా అమలవుతున్న దీన్ని జగన్రెడ్డి అటకెక్కించారు. ఈ పథకానికి సంబంధించి (2020-21, 2021-22 విద్యా సంవత్సరం) 2,301 మంది విద్యార్థుల ఫీజు రూ.6.24 కోట్లు చెల్లించాల్సి ఉంది. పెండింగ్ పెట్టిన వైకాపా 2022-23లో విడుదల చేసింది. బిల్లులు ఆర్బీఐలో పెండింగ్లో ఉన్నాయి. ఎవరూ పట్టించుకోవడం లేదు.
సమస్యల గృహాలు
నాడు-నేడు రెండో దశలో కర్నూలు జిల్లాలో 28 సాంఘిక సంక్షేమ ప్రీ-మెట్రిక్ వసతి గృహాలు, నాలుగు సాంఘిక సంక్షేమ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జగన్ ఒక్క రూపాయి విడుదల చేయలేదు. నంద్యాల జిల్లాలో ఒక సాంఘిక సంక్షేమ ప్రీ మెట్రిక్ వసతి గృహం, ఆరు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాలు ప్రైవేటు (అద్దె) భవనాల్లో కొనసాగుతున్నాయి. వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలు విద్యార్థుల చదువుకు ఆటంకంగా మారాయి.
దళితులపై దౌర్జన్యకాండ
కర్నూలు నేర విభాగం: రాష్ట్రంలో ‘రాజా’రెడ్డి రాజ్యాంగం అమలవుతున్న జగన్ జమానాలో దళితులపై దౌర్జన్యకాండ కొనసాగుతోంది. పెత్తందారు పాలనలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గీయులపై అత్యాచారాలు, హత్యలు, దాడులు, దౌర్జన్యాల పర్వం పెరిగింది. గత ఐదేళ్లలో వారి భద్రత గాలిలో దీపంలా మారింది. 2022లో ఆరుగురు దళితులు హత్యకు గురయ్యారు. 19 మందిపై హత్యాయత్నం జరిగింది. ఎనిమిది మంది ఎస్సీ, ఎస్టీ మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. 2020 అక్టోబరులో నంద్యాల పరిధిలోని పొన్నాపురంలో దళిత న్యాయవాది సుబ్బరాయుడు దారుణ హత్యకు గురవడం సంచలనంగా మారింది. 2021 ఆగస్టులో నంద్యాల పట్టణంలో విలేకరి చెన్నకేశవులు అదే ప్రాంతానికి చెందిన కానిస్టేబుల్ చేతిలో హత్యకు గురయ్యారు. హొళగుంద మండలం పెద్దగోనెహల్లో స్థలం విషయంలో దళితులపై అదే గ్రామానికి చెందిన మరో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేశారు.
సెంటు పొలం ఇవ్వక.. ఉన్నది ఆక్రమణ
తెదేపా హయాంలో (2014 నుంచి 2019) ఎస్సీ కార్పొరేషన్ నిధులు వెచ్చించి భూ కొనుగోలు పథకం, ఎన్ఎస్ఎఫ్డీసీ, ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకాల కింద 18,454 మందికి రూ.318.65 కోట్ల రుణాలు ఇచ్చారు. వైకాపా వచ్చిన తర్వాత సెంటు పొలం ఇవ్వలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4,120 మంది లబ్ధిదారులకు 5,510.57 ఎకరాలపై సంపూర్ణ హక్కులు కల్పించినట్లు వైకాపా ప్రచారం చేసుకుంటోంది. ముందస్తుగా విషయం తెలుసుకొన్న అధికార పార్టీ నేతలు పలుచోట్ల భూములు ఆక్రమించుకుని సంపూర్ణ హక్కులు పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి.
నిరుద్యోగులకు శిక్ష
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్టడీ సర్కిళ్ల నిర్వహణ ఊసేలేకపోయింది. గత ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకుపైగా ఖర్చు పెట్టి సివిల్ సర్వీసెస్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇప్పించేందుకు ఉద్దేశించిన విద్యోన్నతి పథకాన్ని జగన్ ఆపేశారు. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యేందుకు ఉచితంగా శిక్షణ ఇవ్వకుండా ప్రిలిమ్స్, మెయిన్స్కు అర్హత సాధించిన వారికి ఆర్థిక సాయం అందిస్తామనే పథకాన్ని తెచ్చారు. ఈ ప్రోత్సాహక పథకం ఉమ్మడి జిల్లాలో ఐదారు మందికి కూడా ఆసరా కాలేదు.
విదేశీ చదువును ఆపేశారు
విదేశాలకు వెళ్లి చదువుకునేవారి కోసం తెదేపా హయాంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విదేశీ విద్యా పథకం కొనసాగింది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి మూడేళ్లు పట్టించుకోలేదు. బాధితులు కొందరు కోర్టుకు వెళ్తేగానీ మేల్కోలేదు. ఏకంగా అంబేడ్కర్ పేరు తొలగించి 2022-23లో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకంగా మార్చారు. ఎక్కడా లేని నిబంధనలు పెట్టి చాలా మందిని అర్హతకు నోచుకోకుండా చేశారు. 2022-23లో కర్నూలు జిల్లా నుంచి ఒక్క విద్యార్థిని మాత్రమే ఎంపిక చేశారు. ప్రైవేటు కళాశాలల్లో పీజీ చదివే ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేశారు.
పేదింట అంధకారం
‘‘ తాము అధికారంలోకి వస్తే పేదలకు 200 యూనిట్లలోపు కరెంట్ ఉచితంగా ఇస్తామని’’ ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా 2017 నవంబరు 27న ఎర్రగుడిలో జగన్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మడత పెట్టేశారు. ఉచిత విద్యుత్తు పథకం లబ్ధిదారులను ఆరంచెల పద్ధతిలో వడబోసి కొందరికే ప్రయోజనం కల్పించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్