వైకాపా అభ్యర్థులు.. నీళ్లునములుతున్నారు
నీళ్లు లేవు.. రోడ్లు వేయరు.. ఉద్యోగాలు భర్తీ చేయరు వంటి సమస్యలపై వైకాపా అభ్యర్థులను జనం ప్రశ్నిస్తోంది.. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పల్లె బాట పడుతున్నారు.
ఆస్పరి: ‘‘ ప్రతి సారి ఓట్లు వేయించుకుంటారు వెళ్తారు. తిరిగి మా గ్రామాలవైపు కన్నెత్తి చూడరు.. మా గ్రామ సమస్యలు ఎవరూ పట్టించుకోరని ఆలూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విరూపాక్షిని మహిళలు నిలదీశారు. ఆస్పరి మండలం ములుగుందంలో శనివారం పర్యటించిన ఆయనపై మహిళలు ప్రశ్నల వర్షం కురిపించారు. నీటి సమస్య ఉందని, సీసీ రహదార్లు లేక అవస్థలు పడుతున్నామన్నారు.
ఈనాడు, కర్నూలు : నీళ్లు లేవు.. రోడ్లు వేయరు.. ఉద్యోగాలు భర్తీ చేయరు వంటి సమస్యలపై వైకాపా అభ్యర్థులను జనం ప్రశ్నిస్తోంది.. సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో పల్లె బాట పడుతున్నారు. జనం ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఐదేళ్లపాటు ఎక్కడికెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నీటి సమస్యను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏటా వేసవిలో వందలాది గ్రామాల్లో తాగునీటి సమస్య వేధిస్తున్నా అధికార పార్టీ నాయకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బస్సు యాత్రలో భాగంగా కోడుమూరు నియోజకవర్గానికి వచ్చినప్పుడు కొత్తూరు గ్రామంలో పలువురు మహిళలు ఖాళీ బిందెలు చూపి నిరసన తెలిపారు. తుగ్గలి మండలం జొన్నగిరిలోనూ మహిళలు ముఖ్యమంత్రిని నిలదీశారు. ప్రస్తుతం ప్రచారానికి వెళ్తున్న వైకాపా అభ్యర్థులను మహిళలు చుట్టుముడుతున్నారు.
జనం ప్రశ్నల వర్షంతో ఉక్కిరిబిక్కిరి
- సి.బెళగల్ మండలం పలుకుదొడ్డికి ప్రచారానికి వెళ్లిన కుడా ఛైర్మన్ కోట్ల హర్షవర్ధన్రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సతీశ్ను నీళ్లేవని గ్రామస్థులు నిలదీశారు. గత ఎన్నికల సమయంలోనూ గ్రామానికి వచ్చి ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారని... దానికి అతీగతీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా మళ్లీ ఇంకో అభ్యర్థిని తీసుకొచ్చారని కోట్ల హర్షవర్ధన్రెడ్డిని నిలదీశారు. పెద్ద సంఖ్యలో గ్రామస్థులు అడ్డుపడి ప్రశ్నించడంతో ఏమి సమాధానం చెప్పాలో వారికి అర్థం కాని పరిస్థితి. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
- మెగా డీఎస్సీ ఇస్తామని చెప్పి వైకాపా ప్రభుత్వం మోసం చేసిందంటూ ఓ నిరుద్యోగి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి బుట్టా రేణుకను నిలదీయడం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. రహదారులు సరిగా వేయలేదని, నీళ్లు సరిగా రావడం లేదని పలువురు ఆమెను నిలదీస్తున్నారు.
- ఆదోని ఎమ్మెల్యే సాయిప్రసాద్రెడ్డి కుమార్తె గౌతమీరెడ్డి ప్రచారం కోసం వెళ్లినప్పుడు రహదారి సమస్య గురించి పలువురు ఆమెను ప్రశ్నించారు. కాలువ పొంగి రోడ్డంతా మురికిమయంగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
- ఆదోని మండలం బైచిగేరికి రెండురోజుల కిందట ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని జనం నిలదీశారు. పింఛన్లు, తాగునీరు, మురుగు కాల్వలు, విద్యుత్తు స్తంభాలు తదితర సమస్యలు పరిష్కరించాలని పల్లెవాసులు ప్రశ్నించారు.
- వెల్దుర్తి మండలం బుక్కాపురంలో ఇంటి బిల్లులు రాలేదని ఒకరు, ఉపాధి హామీ పనులు చూపడం లేదని మరికొందరు ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవిని నిలదీశారు. రత్నపల్లి, గువ్వలకుంట్ల గ్రామాలో మంచి నీటి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు అడ్డుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలి
[ 27-07-2024]
ఎస్పీ జి.బిందు మాధవ్ ఆర్టీసి, ట్రాన్స్కో, నేషనల్ హైవే అథారిటీ, మున్సిపల్, పోలీసు, ఇతర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. -
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి
[ 27-07-2024]
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత