రేపటి నుంచే నామినేషన్ల ప్రక్రియ
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ప్రారంభంకానుంది. ఎన్నికలకు సంబంధించి నాలుగో విడతలో భాగంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి.
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టం ప్రారంభంకానుంది. ఎన్నికలకు సంబంధించి నాలుగో విడతలో భాగంగా రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఈనెల 18న ప్రకటన విడుదల కానుంది. అదే రోజు ఉదయం 11 గంటల నుంచి పలు ప్రాంతాల్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 25వ తేదీ వరకు నామపత్రాలు సమర్పించేందుకు గడువు ఉంది. ప్రభుత్వ కార్యాలయ పనివేళల్లో ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలలోపు అభ్యర్థులు తమ నామపత్రాలను నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించాల్సి ఉంది. ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లో నామినేషన్లు స్వీకరించరు.
ఆన్లైన్లోనూ స్వీకరణ
ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆన్లైన్లోనూ నామినేషన్లు సమర్పించే వెసులుబాటును ఎన్నికల కమిషన్ కల్పించింది. సువిధ పోర్టల్లో ఈ.అఫిడవిట్ ద్వారా నామినేషన్లు, ఆన్లైన్లోనే డిపాజిట్ మొత్తం చెల్లించేలా వీలు కల్పించారు. ఆన్లైన్లో నామపత్రాలు సమర్పించినప్పటికీ ఆ పత్రాలను ఫిజికల్గా ఆర్వోకు అందజేయాల్సి ఉంటుంది.
25 తర్వాత తుది ఓటరు జాబితా ప్రకటన
ఓటరు నమోదు ప్రక్రియ సోమవారంతో ముగిసిన నేపథ్యంలో ఈనెల 25 తర్వాత తుది ఓటరు జాబితాల ప్రచురించనున్నారు. తుది ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారందరూ ఓటు హక్కు వినియోగించుకుంటారు.
2,204 పోలింగ్ కేంద్రాలు
సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు అధికారులు సిద్ధమవుతున్నారు.. ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.. ఈ నెల 18న జిల్లా రిటర్నింగ్ అధికారి ప్రకటన జారీ చేయనున్నారు. కర్నూలు జిల్లాలో గతేడాది జనవరి 5వ తేదీ నాటికి 8 నియోజకవర్గాల్లో 2,186 పోలింగ్ కేంద్రాలుండగా.. అదనంగా పాణ్యంలో 17, ఎమ్మిగనూరులో ఒకటి కలిపి మరో 18 కేంద్రాలు పెరిగాయి. ప్రస్తుతం వాటి సంఖ్య 2,204కు చేరింది. కర్నూలులో 258, పాణ్యం 357, పత్తికొండ 255, కోడుమూరు 275, ఎమ్మిగనూరు 272, మంత్రాలయం 237, ఆదోని 256, ఆలూరులో 294 పోలింగ్ కేంద్రాలున్నాయి.
విధుల్లో 15,869 మంది సిబ్బంది
ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 8 నియోజకవర్గాలకు 213 మంది సెక్టోరల్ అధికారులను నియమించారు. అన్ని నియోజకవర్గాలకు కలిపి ఎంసీసీ బృందాలు 35, ఫ్లయింగ్ స్క్వాడ్ (ఎఫ్ఎస్టీ) బృందాలు 64, స్టాటస్టికల్ సర్వేలెన్స్ (ఎస్ఎస్టీ) బృందాలు 78, వీఎస్టీ బృందాలు 11, వీడియో వీవింగ్ బృందాలు 10, అకౌంటింగ్ బృందాలు 09, సహాయ ఎన్నికల వ్యయ అబ్జర్వర్లు 12 మంది విధులు నిర్వర్తించనున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి పీవో, ఏపీవో, నలుగురు ఓపీవోలు కలిపి ఆరుగురు అవసరం కాగా.. జిల్లాలోని మొత్తం పోలింగ్ కేంద్రాలకు 13,224 మంది సిబ్బంది అవసరం. 20 శాతం రిజర్వులో కలిపి మొత్తం 15,869 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు కేటాయించారు.
వృద్ధ ఓటర్లు 10,005 మంది
- 85 ఏళ్లకు పైబడిన వృద్ధ ఓటర్లలో పురుషులు 3,632, మహిళలు 6,373 మంది కలిపి మొత్తం 10,005 మంది ఉన్నారు. ఆదోనిలో అత్యధికంగా 2,307 మంది ఉండగా ఆలూరు 1,478, కోడుమూరు 1,407, పాణ్యం 1,385, కర్నూలు 978, పత్తికొండ 955, మంత్రాలయంలో 662 మంది ఓటర్లుగా ఉన్నారు. 80-85 ఏళ్లలోపు 14,356 మంది ఓటర్లకు ఇంటి వద్దే ఓటేసేందుకు అవకాశం కల్పించేందుకు అధికార యంత్రాంగానికి భారమవుతుందనే ఉద్దేశంతో 85 ఏళ్లకు పైబడినవారు మాత్రమే ఇంటి దగ్గరే ఓటేసేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేయనుంది.
- శారీరక దివ్యాంగులు, వయో వృద్ధ ఓటర్లు ఇంటి నుంచి ఓటేయడంపై ఇప్పటికే బీఎల్వోలు సర్వే చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాలకు రాలేని వారిని గుర్తించి వారికి ఫారం-12 దరఖాస్తులు అందించనున్నారు.
- హోమ్ ఓటింగ్కు సంబంధించి ఏప్రిల్ 18 నుంచి 21వ తేదీ వరకు బీఎల్వోల ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. హోమ్ ఓటింగ్కు అవసరమైన వారిని నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి (ఆర్వో) గుర్తిస్తారు. హోమ్ ఓటింగ్కు గుర్తించిన వారికి తమ ఇంటి వద్దే ఓటేసే సదుపాయం అధికారులు కల్పించనున్నారు.
23,827 మంది దివ్యాంగ ఓటర్లు
జిల్లాలో 23,827 మంది దివ్యాంగ ఓటర్లు ఉన్నారు. కర్నూలులో 2,227, పాణ్యం 3,392, పత్తికొండ 2,528 కోడుమూరు 3,509, ఎమ్మిగనూరు 3,182, మంత్రాలయం 2,944, ఆదోని 2,430, ఆలూరులో 3,615 మంది ఉన్నారు. వీరిలో శారీరక వికలత్వంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేయలేని వారికి ఇంటి వద్దే ఓటేసే అవకాశాన్ని జిల్లా యంత్రాంగం కల్పించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్