జగనన్న ఏలుబడిలో రుచి తప్పిన భోజనం
‘‘మన ఇంట్లో మనం తినే భోజనం ఎంత శుచిగా ఉండాలని అనుకుంటామో.. స్కూళ్లలో వండే ఆహారమూ అంతే నాణ్యంగా ఉండాలి’’ అంటూ సీఎం జగన్ పదే పదే చెబుతుంటారు..
ఇంటి నుంచే తెచ్చుకుంటున్న విద్యార్థులు
సరిగా లేదని పారబోస్తున్న పిల్లలు
కర్నూలు, నంద్యాల విద్య
‘‘మన ఇంట్లో మనం తినే భోజనం ఎంత శుచిగా ఉండాలని అనుకుంటామో.. స్కూళ్లలో వండే ఆహారమూ అంతే నాణ్యంగా ఉండాలి’’ అంటూ సీఎం జగన్ పదే పదే చెబుతుంటారు.. కానీ తన ఏలుబడిలో ఆహార పదార్థాలు బాగా లేకపోవడంతో పిల్లలు తినడానికి ఇష్టపడటం లేదు. రుచికరంగా రోజుకో మెనూ.. ప్రతి చిన్నారికి పౌష్టికాహారం అందిస్తున్నామంటూ ప్రతి సభలోనూ ఊదరగొట్టే జగన్ జమానాలో మధ్యాహ్న భోజనం ‘ఘోర’ముద్దలా తయారైంది.
కర్నూలు జిల్లాలో 1,433 పాఠశాలల్లో 2,56,416 మంది, నంద్యాలలో 1,369 పాఠశాలల్లో 1,49,973 మంది చదువుతుండగా... మధ్యాహ్న భోజన వంట సహాయకులు కర్నూలులో 3,399 మంది, నంద్యాలలో 2,540 మంది పని చేస్తున్నారు. వీరికి నెలకు రూ.3 వేల గౌరవ వేతనానికి గానూ మూడు నెలలుగా చెల్లించడం లేదు.
నాణ్యత లేని చిక్కీలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని విద్యార్థులకు వారంలో మూడు రోజులు చిక్కీలు ఇవ్వాలి. రెండు జిల్లాలకు చిక్కీలు సరఫరా చేస్తున్న ఏజెన్సీకి రెండు నెలలుగా సుమారు రూ.3 కోట్ల వరకు బిల్లులు ఇవ్వాలి. నాణ్యత లేనివి సరఫరా చేస్తున్నారని ప్రధానోపాధ్యాయులు ఎంఈవోల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేవు.
గుడ్లు తేలేస్తున్నారు
నెల్లూరు వాసికి చెందిన ఓ ప్రైవేటు ఏజెన్సీ గుడ్లను వారానికి ఒకసారి సరఫరా చేస్తుంది. ఎండాకాలం కావడంతో గుడ్లు నిల్వ ఉండటం లేదని, పాడవుతున్నాయని హెచ్ఎంలు జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఉమ్మడి జిల్లాలో పరిధిలో సుమారు రూ.4.5 కోట్ల బిల్లులు చెల్లించాలి.
నీటిశుద్ధి ఏది
కర్నూలులో మొదటి విడత కింద 567 పాఠశాలల్లో రూ.24.47 కోట్లు, నంద్యాలలో 444 బడుల్లో 12.53 కోట్లు వెచ్చించి నాడు.. నేడు కింద నీటి శుద్ధి యంత్రాలు పెట్టారు. రెండో విడత కింద కర్నూలులో 714 బడుల్లో రూ.23.38 కోట్లు, నంద్యాలలో 672 పాఠశాలల్లో రూ.14.99 కోట్లు వెచ్చించారు. వాటి నిర్వహణ సక్రమంగా లేక మూలకు చేరాయి.
మధ్యాహ్నభోజనం అంతంతే
కర్నూలు నగరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్ పాఠశాలలో 1 నుంచి 9వ తరగతి వరకు 1,641 మంది విద్యార్థులు చదువుతుండగా...1,260 మంది విద్యార్థులు మాత్రమే సోమవారం హాజరయ్యారు. ఇందులో 655 మంది మాత్రమే మధ్యాహ్న భోజనం తిన్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు. మిగతా వారు ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనాన్ని తిన్నారు.
కార్మికుల గుండెల్లో ధరదడ
కూరగాయలు, గ్యాస్, కందిపప్పు, చింతపండు, ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇందుకనుగుణంగా మధ్యాహ్న భోజనం ఛార్జీలను ప్రభుత్వం పెంచడం లేదు. 1-8 తరగతులకు కేంద్రం 60%, రాష్ట్రం 40% వ్యయాన్ని భరిస్తున్నాయి. ప్రస్తుత మెనూ ప్రకారం ఒక్కో విద్యార్థికి భోజనం అందించేందుకు రూ.20 ఇవ్వాలని వంట ఏజెన్సీలు డిమాండు చేస్తున్నాయి. సర్కారు పట్టించుకోవడం లేదని కార్మికులు వాపోతున్నారు.
టమాటా చారు తయారీలో... ఈ గుడ్లే విద్యార్థులకు ఇచ్చారు.
బనగానపల్లి గ్రామీణం: బనగానపల్లి పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో దాదాపుగా 830 మంది విద్యార్థులకు గాను 763 మంది హాజరయ్యారు. దాదాపు 50 మందికి పైగా విద్యార్థులు ఇళ్లకు వెళ్లి మధ్యాహ్నం భోజనం చేశారు.
ఆళ్లగడ్డ గ్రామీణం: ఆళ్లగడ్డ మండలంలోని ఓబులంపల్లె ప్రాథమిక, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో కొందరికే గుడ్లు ఇచ్చారు. ప్రాథమిక పాఠశాలలో 127 మందికి గానూ 46 మందికి, జడ్పీ ఉన్నత పాఠశాలలోనూ 146 మందికి 135 మందికి మాత్రమే గుడ్లు ఇచ్చారు. గుడ్లు సరఫరాలో లోటు ఉందని చెబుతున్నారు.
ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరులోని నీలకంఠేశ్వర జడ్పీ ఉన్నత పాఠశాలలో 1,080 మందికి గాను 434 మంది భోజనం చేశారు.
మంత్రాలయం గ్రామీణం: కౌతాళం మండలంలోని హాల్వి జడ్పీ ఉన్నత పాఠశాలలో హాజరైన 476 మందిలో 456 మంది మాత్రమే భోజనం తిన్నారు. మరో 20 మంది ఇంటి నుంచి తెచ్చుకున్న భోజనం తిన్నారు.
కర్నూలు నగరంలోని టౌన్ మోడల్ పాఠశాలలో మొత్తం 1004 మందికి 683 మంది హాజరయ్యారు. 240 మంది మాత్రమే భోజనం చేయగా, మిగిలిన వారు ఇళ్లకు వెళ్లి భోజనం చేశారు.
నంద్యాల జిల్లా కేంద్రంలోని నూనెపల్లె పురపాలక ఉన్నత పాఠశాలలో 414 మందికి గానూ 330 మంది భోజనం చేశారు. వారికి రోజువారీ ఖర్చు రూ.4,290 కాగా, నిర్వాహకులకు ప్రభుత్వం ఇస్తున్నది మాత్రం రూ.2,828 మాత్రమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల