స్థిరాస్తి వ్యాపారి బరితెగింపు
ధన దాహంతో రగిలిపోతున్న ఓ స్థిరాస్తి వ్యాపారికి.. నంద్యాల ప్రజల పాలిట కల్పతరువుగా మారిన చెక్డ్యాం కంట్లో నలుసుగా మారింది.
ప్ర‘జల’ అవసరాలు తీరుస్తున్న చెక్డ్యాంపై పగ
ప్రజాప్రతినిధుల అండతో రూ.1.30 కోట్ల కట్టడం ధ్వంసం
చెక్డ్యాంను పగులగొట్టిన అక్రమార్కులు, కనిపించని నీటి జాడ
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : ధన దాహంతో రగిలిపోతున్న ఓ స్థిరాస్తి వ్యాపారికి.. నంద్యాల ప్రజల పాలిట కల్పతరువుగా మారిన చెక్డ్యాం కంట్లో నలుసుగా మారింది. చెక్డ్యాంలో నీరు నిల్వ ఉంటే తన వెంచర్లో నిర్మాణాలకు సమస్యలు ఎదురవుతున్నాయని భావించి దాని అడ్డు తొలగించుకునేందుకు కుట్రలు పన్నారు. అధికార పార్టీ అండ ఉంది.. తనను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో రాత్రికి రాత్రే చెక్డ్యాంను ధ్వంసం చేశారు. దీంతో నంద్యాల పట్టణం ఎన్జీవోకాలనీ వాసులను మళ్లీ తాగునీటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
ఖర్చులు పెరుగుతున్నాయని కసి
ఈ చెక్డ్యాంను అనుకునే ఒక బడా స్థిరాస్తి వ్యాపారి కొన్నేళ్ల కిందట ఒక వెంచర్ వేశారు. ఈ వెంచర్లో గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. నిర్మాణ సమయంలో పునాదులు తీస్తుంటే ఊట ఎక్కువగా వస్తోంది. మోటార్లు పెట్టి తోడుతున్నా ఊట ఆగడం లేదు. నిర్మాణ ఖర్చులు భారీగా పెరుగుతున్నాయి. ఊట ప్రభావంతో గతేడాది వెంచర్ చుట్టూ నిర్మించిన ప్రహరీ కూడా కూలింది. దీంతో స్థిరాస్తి వ్యాపారి చెక్డ్యాంపై పగ పెంచుకున్నారు. కొన్ని రోజుల కిందట గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళ్లలో దీన్ని పగులకొట్టించారు. పటిష్టంగా నిర్మించిన కట్టడాన్ని యంత్రాలతో ధ్వంసం చేశారు. భూమి లోపల నుంచి సుమారు ఆరు అడుగుల ఎత్తులో నిర్మించిన కట్టడాన్ని మధ్యలో పగులగొట్టించి నీళ్లు నిల్వకుండా చేశారు. దీంతో చెక్డ్యాంలోని నీరంతా కిందికి వెళ్లిపోయింది.
నీటి కష్టాలకు చెక్డ్యాం
నంద్యాలలోని ఎన్జీవో కాలనీలో తాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండేందుకు రూ.1.30 కోట్ల వ్యయంతో అప్పటి తెదేపా ప్రభుత్వం 2015లో ఈ చెక్డ్యాంను నిర్మించింది. నల్లమల అడవుల్లో భారీ వర్షాలు కురిసిన సమయంలో మహానంది మండలంలోని వివిధ ప్రాంతాల నుంచి పాలేరు వాగు ద్వారా వర్షంనీరు నంద్యాల పట్టణంలోని చామకాల్వలోకి వస్తాయి. పాలేరు వాగు నుంచి చామకాల్వకు వరద నీరు చేరే సమయంలో నంద్యాల పట్టణంలోని ఎన్జీవో కాలనీ- ఎస్బీఐకాలనీ మధ్య ప్రవాహం ఉద్ధృతి ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నీటికి అడ్డుకట్ట వేస్తే ఎన్జీవో కాలనీలో భూగర్భ జల మట్టం పెరుగుతుందనే సదుద్దేశంతో తొమ్మిదేళ్ల కిందట పాములేటి స్వామి ఆశ్రమం సమీపంలో ఆనకట్ట కట్టారు. దివంగత ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి చొరవతో అప్పట్లో కేసీ కెనాల్ అధికారులు దీనిని నిర్మించారు. చెక్డ్యాం నిర్మాణంతో ఈ ప్రాంతంలో నీటి సమస్యలు పరిష్కారమయ్యాయి. ఎన్జీవో కాలనీలో భూగర్భజల మట్టం పెరిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు