బీమా.. జగన్ డ్రామా
తెదేపా హయాంలో చంద్రన్న బీమా పథకం అమలు చేశారు. సాధారణ మరణం అయితే యాబై ఏళ్ల వయస్సు ఉన్నవారికి రూ.2 లక్షలు, 50 ఏళ్లకు పైబడి 59 ఏళ్ల వయస్సు వారికి రూ.30 వేల బీమా పరిహారం అందించారు.
మృతులు వేలల్లో.. పరిహారం వందల్లో
వైకాపా ప్రభుత్వం విచిత్ర నిబంధనలు
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే
చంద్రన్న ఉదారత..
తెదేపా హయాంలో చంద్రన్న బీమా పథకం అమలు చేశారు. సాధారణ మరణం అయితే యాబై ఏళ్ల వయస్సు ఉన్నవారికి రూ.2 లక్షలు, 50 ఏళ్లకు పైబడి 59 ఏళ్ల వయస్సు వారికి రూ.30 వేల బీమా పరిహారం అందించారు. కుటుంబంలో ఎవరు చనిపోయినా పరిహారం ఇచ్చేవారు. ప్రమాద బీమా కింద రూ.5 లక్షలు ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్సుతో సంబంధం లేకుండా వర్తింపజేశారు. రెండు నెలల్లోపే పరిహారం పంపిణీ చేశారు.
జగనన్న కక్కుర్తి
వైఎస్సార్ బీమా కింద మూడేళ్లలో ఉమ్మడి జిల్లాలో 30.63 లక్షల మంది పాలసీదారులను నమోదు చేశారు. 18-50 ఏళ్లు ఉండి సంపాదించే వ్యక్తి సహజ మరణం చెందితే ఆ కుటుంబానికి రూ.లక్ష, 18-70 ఏళ్ల మధ్య ఉండి సంపాదించే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందితే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించాలి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 42 లక్షల వరకు జనాభా ఉంది. కుటుంబ యజమాని చనిపోతేనే వైఎస్సార్ బీమా వర్తిస్తుంది. ఆ కుటుంబంలో భార్య, పిల్లలు చనిపోతే బీమా పరిధిలోకి రారు. కుటుంబ యజమానికి 50 ఏళ్లకు పైబడి ఉండి సాధారణ మరణమైతే బీమా వర్తించదు.
గొప్పలు చెప్పారు
కేంద్రం ఇచ్చే 50 శాతం వాటా ఇప్పుడు లేనప్పటికీ దేశంలో ఎక్కడా లేనివిధంగా పూర్తి ఖర్చు రాష్ట్రమే భరిస్తూ ఉచిత బీమా అమలు చేస్తోంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయి నిస్సహాయ స్థితిలోని నిరుపేద కుటుంబాలకు ఆలంబనగా జగనన్న ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణ వైఎస్సార్ బీమా.!!
ముఖ్యమంత్రి జగన్ ప్రగల్భాలు!
వేదన మిగిల్చారు
తెదేపా ప్రభుత్వ హయాంలో కార్డులో ఉన్నవారందరికీ బీమా వర్తించేది. వైకాపా అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత 2021-22 నుంచి వైఎస్సార్ బీమా పథకాన్ని తీసుకొచ్చింది. ఒక కార్డుకు ఒక్కరికే పరిమితం చేసింది. సాధారణంగా 18-70 ఏళ్ల మధ్య వయస్సు వారికి బీమా వర్తింపజేయాలి. 50-70 ఏళ్ల మధ్య వయస్సువారు ఎక్కువగా చనిపోతుంటారని భావించిన ప్రభుత్వం బీమా పథకం వర్తింపజేయడంలో కక్కుర్తి పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. గత మూడేళ్లలో 37,500 మృతి చెందితే 7,386 మందికే బీమా కల్పించారు.
కొర్రీలు పెట్టి.. కోత విధించి
- కర్నూలు జిల్లాలో మూడేళ్లలో 4,281 మంది వైఎస్సార్ బీమా పాలసీదారులు మరణిస్తే అందులో 3,895 మంది బాధిత కుటుంబాలకే బీమా వర్తింపజేశారు. వివిధ కారణాలతో 386 మందికి బీమాలో కోత విధించారు. ప్రమాద మరణాలు చాలా తక్కువగా చూపుతున్నారు. మూడేళ్లలో కేవలం 360 మంది ప్రమాద మృతులను చూపారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో నెలకు 10 ప్రమాద మరణాలు జరిగినట్లు.. అవి బీమా కింద నమోదైనట్లు చూపడం గమనార్హం.
- అధికారుల లెక్కల ప్రకారం నంద్యాల జిల్లాలో మూడేళ్లలో 3,602 పాలసీదారులు మరణించగా ఏటా 1,163 మంది చొప్పున మూడేళ్లకు 3,491 మంది బాధిత కుటుంబాలకు వైఎస్సార్ బీమా పరిహారం చెల్లించారు. వివిధ కారణాలతో వందకుపైగా క్లెయిమ్లకు అందలేదు.
మట్టి ఖర్చులూ ఇవ్వడం లేదు
- బాధితులు మృతి చెందిన రోజునే మట్టి ఖర్చుల కింద రూ.10 వేలు చెల్లించాల్సి ఉంది. నెలలు గడిచినా ఇవ్వడం లేదు. ప్రమాద మరణాలకు సంబంధించి ఎఫ్ఐఆర్, మరణ ధ్రువీకరణ పత్రం, శవ పరీక్ష నివేదిక (పోస్టుమార్టం) ఉంటేనే పరిహారం వస్తుందని అధికారులు చెబుతున్నారు. రహదారి ప్రమాదాల్లో చనిపోతే డ్రైవింగ్ లైసెన్స్ నిబంధన కచ్చితం చేశారు. ఈ కారణంతో ఏటా వేలాది మందికి బీమా అందడం లేదు.
- ఉమ్మడి కర్నూలు జిల్లాలో నెలకు 205 మంది బాధిత కుటుంబాలకు బీమా పరిహారం పంపిణీ అందజేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఓ వ్యక్తి సాధారణ మరణమైతే ఆ కుటుంబానికి రూ.లక్ష సాయమందించాలి. దరఖాస్తు చేసుకున్న బాధిత కుటుంబానికి మొదట రూ.10 వేలు ఇస్తున్నారు. మిగిలిన సొమ్ముకు బాధిత కుటుంబాలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాయి.
ఆందోళన చేసినా ఆలకించరు
2021 నుంచి ఉమ్మడి జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మరణించిన 236 మంది బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల ప్రమాద బీమా పరిహారం మంజూరు చేయలేదు. దీంతో బాధిత కుటుంబాలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నాయి. యూనివర్సల్ సోం బీమా కంపెనీ బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల చేయడం లేదు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల మరణాలు రెండు వేల వరకు ఉన్నాయి. సాధారణ మరణాలు ఉమ్మడి జిల్లాలో 10 వేలకుపైగా ఉన్నాయి. ఆ బాధిత కుటుంబాలు బీమా పరిహారం కోసం ఎదురుచూసి చివరికి మరిచిపోయే పరిస్థితి నెలకొంది.
7,386 మందికే పరిహారం
ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏటా సాధారణ, ప్రమాదవశాత్తుగా 7,500 మంది చనిపోతుండగా.. అందులో 1,200 వరకు ప్రమాద మరణాలే ఉన్నాయి. మరో 5 వేలకుపైగా ఇళ్ల దగ్గర చనిపోతున్నవారున్నారు. ఈ లెక్కన సాధారణ, ప్రమాద మరణాలు ఏటా 12,500 సంభవిస్తున్నాయి. మూడేళ్లలో 37,500 మరణాలు సంభవిస్తే.. వైఎస్సార్ బీమా కింద మూడేళ్లలో కేవలం 7,386 క్లెయిమ్లకే బీమా వర్తింపజేశారు. వివిధ కారణాలతో 497 క్లెయిమ్లకు దక్కలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్