జగన్తత్వం కుతంత్రం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్ 32, మైనర్ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
పంచాయతీలకు మరణ శాసనం రాసిన వైకాపా
పల్లె ప్రథమ పౌరులను అప్పుల్లో ముంచిన సర్కారు
నంద్యాల పట్టణం, న్యూస్టుడే
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్ 32, మైనర్ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆర్థిక సంఘం, సాధారణ, సీనరేజీ నిధులు పంచాయతీలకు ప్రధాన ఆదాయం. జగన్ గద్దెనెక్కిన తర్వాత పంచాయతీ నిధులు దారి మళ్లిస్తున్నారు. మురుగు కాల్వలను శుభ్రం చేసేందుకు సొమ్ముల్లేవు.. మంచినీటి పైప్లైన్ల మరమ్మతులకు పైసల్లేవు.. ఆఖరికి బ్లీచింగ్, ఫాగింగులకూ డబ్బు వెతుక్కోవాల్సిన దుస్థితిని కల్పించారు. ఏ పని చేయడానికి కూడా సర్పంచుల దగ్గర సరిపడా సొమ్ము లేకుండా చేశారు జగన్. ఏదీ చేయలేక గ్రామస్థులకు సమాధానం చెప్పుకోలేకపోతున్నామని సర్పంచులు నెత్తీనోరూ కొట్టుకున్నా జగన్ వినిపించుకోలేదు.
‘ప్రాధాన్యం’ మరిచి.. ఉపాధి నిధులు ధారబోసి
అంతకు ముందు ఉపాధి హామీ నిధులతో పల్లెల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసేవారు. జగన్ వచ్చాక వాటికీ టెండర్ పెట్టారు. ప్రతి పంచాయతీలో సచివాలయం, ఆరోగ్య, ఆర్బీకే, పాలకేంద్రం, డిజిటల్ గ్రంథాలయాలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటికి ప్రాధాన్య భవనాలుగా నామకరణం చేసింది.. అన్నీ కలిపి ఉమ్మడి జిల్లాలో 1,452 నిర్మించాలని నిర్ణయించింది. ఉపాధి హామీ పథకంలో 60 శాతం కూలీలకు, 40 శాతం సామగ్రి విభాగం కింద ఖర్చు చేయాలనేది నిబంధన పెట్టారు. ప్రభుత్వం ఒత్తిడి చేసి స్థానిక నేతలకు పనులు అప్పగించింది. చాలా మంది సొంత డబ్బులు వెచ్చించారు. ఇంకా రూ.26 కోట్ల వరకు బిల్లులు రావాల్సి ఉంది. పల్లెల అవసరాలను పట్టించుకోకుండా సొంత ప్రాధాన్య కార్యక్రమాలకు ‘ఉపాధి’ నిధులు ధారపోశారు.
ఆర్థిక సంఘం నిధులు హాంఫట్
కొన్ని మేజర్ పంచాయతీలకు తప్ప మిగిలిన వాటికి సొంత ఆదాయ వనరులు ఉండవు. ప్రత్యేకంగా నిధులు కేటాయించి పల్లెలను ప్రగతి బాట పట్టించాలి. జగన్ ఆ పని చేయకపోగా వచ్చిన కేంద్ర ఆర్థిక సంఘం నిధులనూ ‘హాంఫట్’ అనిపించేశారు. రాష్ట్రం సాధారణ నిధులనూ వెనక్కి తీసుకోవడం గమనార్హం. 2021-22, 2022-23 సంవత్సరాల్లో కలిపి దాదాపు రూ.180 కోట్ల వరకు విద్యుత్తు బిల్లుల బకాయిలకు మళ్లించారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత రూ.59 కోట్లు మంజూరయ్యాయి. వాటినీ మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని పల్లె పాలకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఫైనాన్స్ కమిషన్ నిధుల్లో పది శాతాన్నే పరిపాలన అవసరాలకు వెచ్చించాలి. ఆ సొమ్ములోంచే విద్యుత్తు బకాయిలను చెల్లించాలి. కానీ, జగన్ సర్కారు మాత్రం సగటున 24 శాతం నుంచి 90 శాతం వరకు ఆర్థిక సంఘం నిధులను పంచాయతీల ఖాతాల నుంచి ఖాళీ చేసింది.
ప్రజల కష్టాలు గుర్తించని నీరో చక్రవర్తి
ఉమ్మడి జిల్లాలో 672 గ్రామాల్లో 4.75 లక్షల మందికి సగటున నిత్యం 50 లీటర్ల నీటిని అందించే ఉద్దేశంతో జల్జీవన్ పథకానికి కేంద్రం శ్రీకారం చుట్టింది. రెండు జిల్లాల్లో రూ.201 కోట్లతో చేపట్టే 1,008 పనులను ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నాలుగు విడతల్లో టెండర్లు పిలించారు. కేంద్రం తన వాటా నిధులు అందించినా.. రాష్ట్రం నిధులు జమ చేయలేదు. దీంతో పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. నంద్యాలలో రూ.58 కోట్ల పనులు జరగ్గా 20 శాతం కూడా బిల్లులు చెల్లించలేదు. కర్నూలులో ఇప్పటివరకు కేవలం రూ.30 కోట్ల పనులే జరిగాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 594 గ్రామాల్లో జలఘంటికలు మోగుతున్నాయి.
గనుల వాటా గయాబ్
- గనుల ఆదాయంలో గ్రామాల వాటాకు ప్రభుత్వం ఎగనామం పెడుతోంది. సీనరేజీ నిధులు వసూలు చేస్తున్నా గ్రామాల ఖాతాల్లో కన్పించడం లేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో గనులు లీజుకు ఇవ్వడంతో ఏటా రూ.80 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. లీజుదారుల నుంచి మైనింగ్ శాఖ అధికారులు పన్ను వసూలు చేస్తారు. వాటిని డీపీవో ఖాతాలకు బదిలీ చేస్తారు. ప్రభుత్వ ఆమోదం మేరకు డీపీవోలు పంచాయతీలకు బదిలీ చేస్తారు.
- నిబంధనల మేరకు ఆదాయంలో 25 శాతం పంచాయతీలకు, 50 శాతం మండల పరిషత్తులకు, 25 శాతం జడ్పీలకు కేటాయించాలి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొలిమిగుండ్ల, అవుకు, బేతంచెర్ల, డోన్ మండలల నుంచే రూ.8 కోట్లు సీనరేజీ కింద ప్రభుత్వానికి సమకూరింది. కానీ పంచాయతీలకు ఈ నిధులు బదిలీ చేయలేదు.
ప్రగతి దీపాలు కొండెక్కించారు
సంప్రదాయ వీధి దీపాల వ్యవస్థ స్థానంలో గత తెదేపా ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటు చేశారు. ఇంధన సామర్థ్య సేవల సంస్థ (ఈఈఎస్ఎల్), నూతన పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్థ (ఎన్ఆర్ఈడీసీ)లకు వీటి ఏర్పాటుతోపాటు నిర్వహణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో అప్పగించింది. వైకాపా వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్వహణ సంస్థలకు నిధులు సరిగా చెల్లించలేదు. 2021 మార్చి నుంచి వీధి దీపాల నిర్వహణను పంచాయతీలకు అప్పగిస్తూ ఉత్తర్వులిచ్చింది. పంచాయతీల వద్ద నిధుల్లేక వీధి దీపాలు వెలగడం లేదు.
- పల్లెల్లో చెత్తను సేకరించి సంపదగా మార్చుతామని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. ఉమ్మడి జిల్లాలో గ్రామాల్లో 25 లక్షల జనాభా ఉంది. ఒక్కో పంచాయతీ నుంచి 400 కిలోల చెత్తను సేకరిస్తున్నారనుకున్నా...రోజుకు 400 టన్నుల చెత్త, 60 శాతం ఎరువు వస్తుంది. దీన్ని కిలో రూ.5 చొప్పున విక్రయించినా రోజుకు రూ.1.25 లక్షలు వస్తుంది. కానీ జిల్లా వ్యాప్తంగా ఎక్కడా ఆదాయం లేదు.
నీటి ఎద్దటి నివారణకు రూ.22.75 కోట్లు అవసరమని అంచనా వేశారు. గత నెలలో ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్