మాటకారి మామయ్యా.. ‘దీవెన’లేవయ్య
తల్లిదండ్రులు మీ పిల్లల్ని పాఠశాలలు, కళాశాలలకు పంపండి.. వారిని చదివించే బాధ్యత నేనే తీసుకుంటా’’ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నాం.
విద్యా సంవత్సరం ముగుస్తున్నా పత్తాలేని నిధులు
చెల్లించాలని విద్యార్థులపై యాజమాన్యాల ఒత్తిడి
కర్నూలు సంక్షేమం, న్యూస్టుడే
తల్లిదండ్రులు మీ పిల్లల్ని పాఠశాలలు, కళాశాలలకు పంపండి.. వారిని చదివించే బాధ్యత నేనే తీసుకుంటా’’ ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి పథకం కింద ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నాం. ఆపై తరగతుల విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం.!!
- ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 2017 నవంబరు 21న నంద్యాల జిల్లా బేతంచెర్లకు వచ్చిన జగన్ కళాశాల విద్యార్థులతో సమావేశమై చేసిన వాగ్దానమిది!!
అధికార గద్దెనెక్కిన తర్వాత ‘విద్యా దీవెన’ పథకాన్ని తీసుకొచ్చారు. నమ్మిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపులు, క్రైస్తవ వర్గాలకు చెందిన వేలాది మంది పేద విద్యార్థులు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో చేరారు. ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్న హామీని మడత పెట్టేశారు. కొర్రీలు పెట్టి పథకానికి తూట్లు పొడిచారు. పేద విద్యార్థులను పెద్ద చదువులకు దూరం చేశారు.
గ్రేడ్లుగా విభజించి.. సాయం తగ్గించి
ఉమ్మడి జిల్లాలో 76,975 మంది విద్యార్థులు ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో వివిధ కోర్సులు అభ్యసిస్తున్నారు. వీరంతా విద్యా దీవెనకు అర్హత సాధించారు. కళాశాలలను గ్రేడ్లుగా విభజించి ఏ-గ్రేడ్ కళాశాలలో చదివే వారికి ఏడాదికి రూ.18,400, బీ-గ్రేడ్ కళాశాలకు రూ.15,300 చొప్పున, కనిష్ఠంగా రూ.13,200 చొప్పున విడుదల చేస్తున్నారు. ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.20 వేలు ఇవ్వకపోగా.. ఇచ్చే మొత్తాన్ని నాలుగు విడతల్లో జమ చేస్తున్నారు. కర్నూలుకు రూ.23.95 కోట్లు, నంద్యాలకు రూ.20.78 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి జమ కావాల్సి ఉంది. తెదేపా హయాంలో ఉన్నత విద్య చదువుకునే వారికి ఫీజు రీఎంబర్స్మెంట్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ పథకాలను అమలు చేశారు. వైకాపా ప్రభుత్వం మాత్రం డిగ్రీ విద్యార్థులకు మాత్రమే విద్యా దీవెన అమలు చేస్తోంది.
బటన్ నొక్కారు.. సాయం మరిచారు
2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగు విడతలుగా చెల్లించాల్సిన విద్యా దీవెన సొమ్ములో ఒక విడత మాత్రమే విడుదల చేశారు. ఎన్నికల ప్రకటన వస్తుందని గత నెల 1న సీఎం జగన్మోహన్రెడ్డి హడావుడిగా బటన్ నొక్కారు. ఇప్పటికీ 30 శాతం మంది తల్లుల ఖాతాలకు సొమ్ములు జమ కాలేదు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా మూడు విడతల సొమ్ము బకాయిలున్నాయి. ఉమ్మడి జిల్లాలో విద్యా దీవెన పథకానికి అర్హులైన వివిధ వర్గాల విద్యార్థులు 76,975 మంది ఉన్నారు. వీరికి ఏటా ఫీజు రీఎంబర్స్మెంట్ అందాలి. ఇప్పటి వరకు గతేడాదికి సంబంధించి ఒక విడత మాత్రమే నిధులు విడుదల చేశారు. అవి కూడా చాలా మందికి రాలేదు.
కరోనా కాలం ఆపేశారు
అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ), పోస్టుగ్రాడ్యుయేట్ (పీజీ) విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన రుసుము చెల్లించబోమని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కరోనా సమయంలో తరగతులు నిర్వహించనందున ఈ మొత్తం ఇవ్వడం లేదని పేర్కొంది. కానీ, కరోనా సమయంలో కళాశాలలు ఆన్లైన్, ఆఫ్లైన్ విధానంలో బోధించాయి. పరీక్షలూ నిర్వహించాయి. దీంతో విద్యార్థుల నుంచి ఫీజులను వసూలు చేసుకున్నాయి. ప్రభుత్వం మాత్రం అసలు తరగతులే జరగలేదని ఫీజులను ఎగ్గొట్టి.. పేద కుటుంబాలపై భారం మోపింది.
సర్కారు రాజకీయ ఆట
తెదేపా ప్రభుత్వ హయాంలో అయిదేళ్లపాటు ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులను నేరుగా కళాశాలలకే విడుదల చేసేవారు. వైకాపా వచ్చిన తర్వాత ఫీజుల చెల్లింపు ప్రక్రియను జగన్ సర్కారు రాజకీయంగా వాడుకోవాలనుకుంది. కళాశాలల ఖాతాల్లో జమ చేసే విధానానికి స్వస్తి చెప్పి తల్లుల ఖాతాల్లో వేయడం ప్రారంభించింది. విద్యార్థుల ఓట్ల కోసం విద్యార్థి, తల్లి సంయుక్త ఖాతాలో జమ చేసే విధానాన్ని తీసుకొచ్చింది. రీఎంబర్స్మెంట్ డబ్బులను ప్రభుత్వమే నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నందున వాటితో తమకు సంబంధం లేదంటూ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఫీజు కట్టాల్సిందేనని స్పష్టం చేస్తున్నాయి.
పీజీకి తాళం వేశారు
తెదేపా ప్రభుత్వం పీజీ విద్యార్థులకు ఏడాదికి రూ.20 వేల ఫీజు రీఎంబర్స్మెంట్ ఇచ్చేది. జగన్ ప్రభుత్వం దీన్ని ఆపేసింది. దీంతో పీజీ చదివే విద్యార్థులు సంఖ్య తగ్గిపోయింది. ఈ ప్రభావంతో నంద్యాలలో మూడు ప్రైవేటు పీజీ కళాశాలలు మూతపడ్డాయి. నందికొట్కూరు, ఆత్మకూరు, ఆళ్లగడ్డ, కోవెలకుంట్లలో ఒక్కో కళాశాల మూతపడ్డాయి. కర్నూలులో ఐదు, ఎమ్మిగనూరు, ఆదోనిలో మరో రెండు కళాశాలలు మూతపడ్డాయి. ఉమ్మడి జిల్లాలోని పలు కళాశాలలు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో చేరే వారే కరవయ్యారు. బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, ఎమ్మెస్సీ గణితం, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎంకాం వంటి కోర్సుల బోధనను ఆపేశాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే