ట్యాబు జగన్ డాబు
‘ట్యాబ్ల కారణంగా పిల్లలకు చదువులకు ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఉపాధ్యాయులు చెప్పే అంశాలు బాగా అర్థమవుతాయి.
ఈనాడు, నంద్యాల, నంద్యాల విద్య, న్యూస్టుడే
‘ట్యాబ్ల కారణంగా పిల్లలకు చదువులకు ఎంతో మేలు జరుగుతుంది. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులువుగా పాఠాలు అర్థమయ్యేలా చెప్పొచ్చు. ఉపాధ్యాయులు చెప్పే అంశాలు బాగా అర్థమవుతాయి. సాంకేతిక పరిజ్ఞానం కారణంగా పిల్లలకు చెడు జరగకూడదు. పిల్లలకు నష్టం జరిగే అంశాలు చూసే అవకాశం లేకుండా మీ మేనమామ ఆయా అంశాలకు కత్తెర వేశాడు.’
-ట్యాబ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమత్రి జగన్మోహన్రెడ్డి అన్న వ్యాఖ్యలు.
విద్యార్థులకు రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన ట్యాబ్లు యథేచ్ఛగా దుర్వినియోగ మవుతున్నాయి. ఇప్పటికే వంద మందికి పైగా విద్యార్థులు ట్యాబ్లను దుర్వినియోగం చేసినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. అనధికారికంగా వందలాది మంది విద్యార్థులు వాటిని యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సినిమాలు, నచ్చిన యాప్లు, ఆన్లైన్ గేమ్లు లోడ్ చేయించుకుంటున్నా ఉపాధ్యాయుల దృష్టికి రావడం లేదు. ట్యాబ్లలో ‘సెక్యూర్డ్ మొబైల్ డివైజ్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్’ లోడ్ చేశామని, పిల్లలకు నష్టం జరిగే అంశాలకు కోత పెట్టామని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చెప్పిన మాటలు అవాస్తవాలని తేలుతోంది. విద్యార్థులకు ఇచ్చిన ట్యాబ్లలో ప్రభుత్వం అనుమతించిన యాప్లుకాక ఇతర సమాచారాన్ని నిక్షిప్తం చేసే అవకాశం ఉండదు. అందుకు భిన్నంగా పలువురు విద్యార్థులు తమకు నచ్చిన సమాచారాన్ని ట్యాబ్లలో ఉంచి ఇతరులకు కనపడకుండా ఉండేలా (‘హైడ్’ మోడ్) దాచి మరీ చూస్తున్నట్లు సమాచారం.
సాంకేతిక సమస్యలు
విద్యార్థుల ట్యాబ్లను ఉపాధ్యాయులు ర్యాండమ్ తనిఖీలో భాగంగా పరిశీలించినప్పుడు మాత్రమే వాటిలో ఏముందున్న విషయాలు వెలుగుచూస్తున్నాయి. విద్యార్థులు తాము డౌన్లోడ్ చేసిన సమాచారం కనపడకుండా ఉంచుతుండడంతో వాటిని గుర్తించడం ఉపాధ్యాయులకు కష్టంగా మారుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో సుమారు 99,463 ట్యాబ్లు పంపిణీ చేశారు. విద్యార్థులు ఉపయోగిస్తున్న 90 వేలకుపైగా ట్యాబ్లను పర్యవేక్షించే అవకాశం అసాధ్యమని పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
పలువురు విద్యార్థులు ట్యాబ్లలో తమకు నచ్చిన సమాచారం నిక్షిప్తం చేసుకునేందుకుగాను కొందరు నిపుణులకు ఇస్తున్నారు. ట్యాబ్ను తమకు నచ్చినట్లుగా మార్చుకునే క్రమంలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఇతర సమాచారం నిక్షిప్తం చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ట్యాబ్లు దెబ్బతింటున్నాయి.
అంతా అస్తవ్యస్తం
కర్నూలు జిల్లాలో 3,226 మంది, నంద్యాల జిల్లాలో 2,730 మంది ఉపాధ్యాయులకు ట్యాబ్లు ఇచ్చారు. పదోన్నతులు పొందిన కర్నూలు జిల్లాకు చెందిన సుమారు 1,100 మంది, నంద్యాల జిల్లాకు చెందిన వెయ్యి మంది ఉపాధ్యాయులకు నేటికీ ఇవ్వలేదు.
- విద్యార్థులు తమ ట్యాబ్లలో ఏమైనా అవాంఛనీయ సమాచారాన్ని నిక్షిప్తం చేస్తే దానిని ఆటోమేటిక్గా గుర్తించే వ్యవస్థ లేకపోవడంతో ట్యాబ్లను దుర్వినియోగం చేస్తున్నవారికి బాగా కలిసివస్తోంది. 2022-23 సంవత్సరంలో పంపిణీ చేసిన ట్యాబ్లలో భద్రతాపరమైన అంశాలు చాలా బలహీనంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
- ఎనిమిదో తరగతి వారికి ఇచ్చిన ట్యాబ్లను ప్రభుత్వం విద్యా సంవత్సరం చివర్లో ఇవ్వడం గమనార్హం. నంద్యాల జిల్లాలో గతేడాది డిసెంబరులో 22వ తేదీ నుంచి పంపిణీ చేయగా.... కర్నూలు జిల్లాలో జనవరి నెలలో ఇచ్చారు. నేరుగా తొమ్మిదో తరగతిలో చేరిన వారిలో కొంతమందికి ట్యాబ్లు రాలేదన్న ఆరోపణలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు