రూ.కోట్లకు బీటలు.. రోగులతో జగన్ ఆటలు
ఆదోని జిల్లా సర్వజన వైద్యశాలలో వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే రోగులు స్థల భావ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ పరిధిలో 10-15 మండలాలకు ఈ ఆస్పత్రి ప్రధాన ఆధారం.
పూర్తికాని రూ.10.48 కోట్ల భవనం
రోజు వారీ ఓపీ: 400-450, ఐపీ: 40
రెఫర్ చేస్తున్న రోగుల సంఖ్య : 10]
మాటలు.. ప్రకటనలకే
ఆదోని పాతపట్టణం, న్యూస్టుడే: రూ.కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ ఆస్పత్రులను అభివృద్ధి చేస్తున్నామని పలు సభల్లో ఊదరగొడుతున్న వైకాపా మాటలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. ఆదోని జిల్లా సర్వజన ఆస్పత్రిలో వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే రోగులు నేలపైనే కూర్చొని ఓపీ కోసం నిరీక్షించాల్సి వస్తోంది. కనీసం రోగులు కూర్చునేందుకు కుర్చీలు వేయకపోవడం విడ్డూరంగా ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదోని మార్కెట్, న్యూస్టుడే : ఆదోని జిల్లా సర్వజన వైద్యశాలలో వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి వచ్చే రోగులు స్థల భావ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ పరిధిలో 10-15 మండలాలకు ఈ ఆస్పత్రి ప్రధాన ఆధారం. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇక్కడి ఆస్పత్రిలో రూ.10.48 కోట్ల వ్యయంతో భవిష్యత్తు అవసరాల కోసం జీ ప్లస్త్రీ విస్తరణ భవన నిర్మాణం చేపట్టారు. పనులు ప్రారంభించి ఐదేళ్లవుతున్నా ఇంతవరకు పూర్తి కాలేదు. దీంతో రోగులకు గదులు.. మంచాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నారు. గత తెదేపా ప్రభుత్వం రోగులకు స్థల భావ సమస్య ఉండరాదనే ఆలోచనతో నాబార్డు సాయంతో అదనపు భవన నిర్మాణం ప్రారంభించగా... ప్రభుత్వం మారిపోవడంతో అధికారం చేపట్టిన వైకాపా ప్రభుత్వం పనులు పట్టాలెక్కే మొదలు పూర్తి చేసే వరకు నాలుగు సార్లు గడువు పొడిగించారు. అయినా నేటికి పూర్తి చేయకపోవడం గమనార్హం.
ఒకే మంచంపై ఇద్దరికి వైద్యసేవలు
ప్రస్తుతం ఉన్న పాత భవనంలో డయాలసిస్ కేంద్రం నడుస్తోంది. ఆస్పత్రి ఆవరణలోనే టీబీ యూనిట్, యునానీ కేంద్రం ఉంది. అంతేకాక పాత భవనం పెచ్చులూడి పడుతుండటంతో రోగులు ఆందోళన చెందుతున్నారు. శౌచాలయాలు సైతం శిథిలావస్థకు చేరాయి. వీటికి మరమ్మతులు చేయాలనే పేరుతో రోగులను ఏడాది పాటు ఆస్పత్రి వరండాలో మంచాలు వేసి సేవలందించారు. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో వరండాలోని మంచాలను గదుల్లోకి మార్చి.. ఒక్కో మంచంపై ఇద్దరేసి రోగులకు సేవలందిస్తున్నారు. ఒకే మంచంపై ఇద్దరేసి రోగులకు సేవలందించడంతో ఉన్న రోగం నయమవడం దేవుడెరుగు.. లేని రోగాలు వచ్చేలా ఉన్నాయని వాపోతున్నారు.
ఎప్పుడు బాగు పడుతుందో
నా పేరు నీలకంఠ కడుపు నొప్పితో ఆదోని జిల్లా సర్వజన ఆస్పత్రిలో చేరా. ఒకే మంచంపై ఇద్దరు రోగులను పడుకోబెట్టారు. దీంతో పక్కకు కదలలేని పరిస్థితి ఉంది. ఒక పక్కకే పడుకోవాల్సి వస్తోంది. రెండు రోజులుగా ఇలాగే ఉంటున్నా. రోగం నయంకావడం కోసం ఉండక తప్పడం లేదు. ఇంత పెద్ద ఆస్పత్రిలో ఇలాంటి పరిస్థితి ఉండటం దారుణం. ఆస్పత్రి ఎప్పుడు బాగు పడుతుందో దేవుడికే తెలియాలి.
గదుల కొరత..
నా పేరు నరసయ్య, మాది పల్లెపాడు గ్రామం. అనారోగ్యంతో ఆదోని జిల్లా ఆస్పత్రిలో చేరి ఒకరోజు అయింది. రోగుల గదిలో ఉండాలంటే ఇబ్బందిగా ఉంది. ఒకే మంచంపై ఇద్దరు రోగులను ఉంచారు. వేసవి కాలం.. ఆపై ఎండలు.. పైగా ఇరుకు మంచాలు ఎలా పడుకోవాలి? ఇక్కడ ప్రధానంగా మంచాలు, గదుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పేదలు డబ్బులు లేక ప్రభుత్వ ఆస్పత్రికి వస్తున్నాం. ఇలాగైతే ఉన్న రోగాలు పోవడం కాదు.. లేని రోగాలు వచ్చేలా ఉన్నాయి.
ఆసుపత్రిలో వసతులు లేక ఇబ్బందులు
వెల్దుర్తి, న్యూస్టుడే : వెల్దుర్తి సీహెచ్సీ ఆసుపత్రిలో రోగులకు అవసరమైన బెంచీలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. వైద్యసేవల కోసం నిల్చొని ఉండాల్సి వస్తోంది. వీటితోపాటు ఆసుపత్రిలో రోగులకు అవసరమైన మంచాలు లేవు. రాత్రి వేళల్లో వైద్యులు సక్రమంగా ఉండటం లేదు. ఆసుపత్రికి అవసరమైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలి.
సేవలపై తాత్సారం
నా పేరు లక్ష్మి, చిన్నపెండేకల్లు గ్రామం. ఆదోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఒకే మంచంపై ఇద్దరికి సేవలందించడం ఎక్కడా చూడలేదు. ఇంత పెద్ద ఆస్పత్రిలో రోగులకు ఎలాంటి సమస్య లేకుండా చూడాలి. అత్యాధునిక వైద్య సేవలందించి, పేదలకు భరోసా కల్పించాలి. కొత్త భ¡వనం పూర్తి చేయడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం