నామపత్రాల సందడి
ఆదోని నియోజకవర్గ భాజపా భాజపా అభ్యర్థిగా డాక్టరు పార్థసారథి శుక్రవారం నామపత్రం దాఖలు చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారి శివ్నారయణశర్మకు తన నామపత్రాన్ని అందజేశారు.
ఆదోని గ్రామీణం, ఎస్కేడీ కాలనీ, న్యూస్టుడే: ఆదోని నియోజకవర్గ భాజపా భాజపా అభ్యర్థిగా డాక్టరు పార్థసారథి శుక్రవారం నామపత్రం దాఖలు చేశారు. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలోని నామినేషన్ కేంద్రంలో ఎన్నికల అధికారి శివ్నారయణశర్మకు తన నామపత్రాన్ని అందజేశారు. మధ్యాహ్నం 12.15 గంటలకు అభ్యర్థి పార్థసారథి, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, భాజపా రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడు చంద్రమౌళి, తెదేపా సీనియర్ నాయకులు భాస్కర్రెడ్డి, గుడిసె కృష్ణమ్మ, శ్రీకాంత్రెడ్డి, రామచంద్ర, అప్సర్బాషాతో కలిసి నామినేషన్ కేంద్రానికి హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదాగా చేరుకున్నారు. నామినేషన్ కేంద్రంలోకి ఐదుగురే వెళ్లాలని పోలీసులు నిబంధన విధించారు. దీంతో భాజపా పొలిట్బ్యూరో సభ్యుడు చంద్రమౌళి, తెదేపా నాయకుడు శ్రీకాంత్రెడ్డిని లోపలికి వెళ్లకుండా తాలుకా ఎస్సై ఎర్రిస్వామి అడ్డుకున్నారు. కొద్దిసేపటికి లోపలికి పంపడంతో సమస్య సద్దుమణిగింది. ఆ తర్వాత ఎన్నికల నిబంధనల మేరకు కేవలం నామినేషన్ దాఖలుకు ఐదుగురు మాత్రమే ఉండాలని ఎన్నికల అధికారి చెప్పడంతో అభ్యర్థితో పాటు మీనాక్షినాయుడు, అప్సర్బాషా, న్యాయవాదులు శ్రీరాములు, వై.ఆర్.మల్లికార్జున మినహా మిగిలిన వారు బయటకు వచ్చేశారు.
పత్తికొండ గ్రామీణం, న్యూస్టుడే: పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కేఈ శ్యాంబాబు ఎన్నికల అధికారి నీలాపు రామలక్ష్మికి నామపత్రాలు దాఖలు చేశారు.
పత్తికొండ, పత్తికొండ గ్రామీణం, న్యూస్టుడే: పత్తికొండ వైకాపా అభ్యర్థిగా కంగాటి శ్రీదేవి నామినేషన్ వేశారు. శుక్రవారం తరలివచ్చిన కార్యకర్తలతో కలిసి ఆమె స్థానిక రహదారులు భవనాల శాఖ అతిథి గృహం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లారు. కర్నూలు పార్లమెంటు నియోజవకర్గ వైకాపా అభ్యర్థి బీవై రామయ్య, పత్తికొండ మాజీ ఎంపీపీ నాగరత్నమ్మ, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్కుమార్రెడ్డి, తదితరులతో కలిసి ఆమె ఎన్నికల రిటర్నింగ్ అధికారి రామలక్ష్మికి నామినేషన్ పత్రాలు అందజేశారు. శ్రీదేవి తన నామినేషన్ పత్రం దాఖలు చేసేందుకు ముందు సెంటిమెంట్గా.. స్వగ్రామమైన చెరుకులపాడుకు వెళ్లి, తన భర్త దివంగత నారాయణరెడ్డి సమాధి వద్ద నివాళి అర్పించి పత్తికొండకు బయల్దేరి వెళ్లారు.
ఆలూరు గ్రామీణ, న్యూస్టుడే: ఆలూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా విరూపాక్షి శుక్రవారం నామపత్రాలను దాఖలు చేశారు. కొంతమంది అనుచరులతో కలిసి వెళ్లి సాదాసీదాగా నామినేషన్ వేశారు. ఈ నెల 23న మరోసారి నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు. వైకాపా నాయకులు శశికళ, ఆలూరు జడ్పీటీసీ సభ్యుడు చంద్రశేఖర్, న్యాయవాదులు లక్ష్మీకాంత్, ఆనంద్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు