వైకాపాను సాగనంపేందుకు సిద్ధం
వైకాపాను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆదోని పట్టణం స్థానిక అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు.
జగన్ హామీలు మద్యం దుకాణాల్లోనే
ఆదోని సభలో వైఎస్ షర్మిల
ఆదోని ఎస్కేడీ కాలనీ, న్యూస్టుడే: వైకాపాను సాగనంపేందుకు జనం సిద్ధంగా ఉన్నారని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఏపీ న్యాయయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఆదోని పట్టణం స్థానిక అంబేడ్కర్ కూడలిలో నిర్వహించిన బహిరంగసభలో ఆమె మాట్లాడారు. వైకాపా కార్యకర్తలు కొందరు సిద్ధం జెండాలు పట్టుకొని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.. సమీపంలోని ఓ మేడపై నుంచి వైకాపా సిద్ధం జెండాలు చూపుతూ కేరింతలు కొట్టారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. మిమ్మల్ని పంపేందుకు మేము సిద్ధమన్నారు. పోలీసులు మేడపైకి వెళ్లి వైకాపా వారిని అక్కడి నుంచి తరిమివేశారు. వైకాపా అధికారం చేపట్టిన వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని జగన్మోహన్రెడ్డి చెప్పారు.. ఐదేళ్లుగా గడిచినా ఆ మాటే మరిచారు.. ఖాళీలు భర్తీ చేయకుండా ఐదేళ్లు ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. జగన్ ఇచ్చిన హామీలు మద్యం దుకాణాల్లోనే ఉండిపోయాయని ఎద్దేవా చేశారు. ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోవడం లేదన్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా భాజపాకు గులాంగిరీ చేస్తున్నారన్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న కేంద్ర ప్రభుత్వం.. గుండు సున్నా ఇచ్చిందన్నారు. ఆదోని ఎమ్మెల్యే పేకాటరాయుడు అంటకదా.. ఇలాంటి దోపిడీదారులకా ఓట్లు వేసేది? అని ప్రశ్నించారు. ఆదోని కాంగ్రెస్ అభ్యర్థిగా రమేశ్యాదవ్, కర్నూలు ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్యయాదవ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఇండియా కూటమి నాయకులు నీలకంఠప్ప, దేవిశెట్టి ప్రకాశ్, దిలీప్దోకా, అజయ్బాబు, లింగన్న, సాయినాథ్, వీరేశ్, ఉమ్మి యూసుఫ్, నూర్ పాల్గొన్నారు.
చేనేతను విస్మరించారు
ఎమ్మిగనూరు గ్రామీణం, న్యూస్టుడే: చేనేతలకు టెక్స్టైల్ పార్కు నిర్మిస్తానని, రుణమాఫీ చేస్తానని, ఇళ్లు నిర్మిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏమీ చేయలేదని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. కాంగ్రెస్ న్యాయ యాత్రలో భాగంగా శుక్రవారం ఆమె ఎమ్మిగనూరు గాంధీ కూడలిలో మాట్లాడారు. ముఖ్యమంత్రి సంపూర్ణ మద్యనిషేధం చేస్తానని ఐదేళ్ల కిందట చెప్పారు..చేయకపోతే ఎన్నికల్లో ఓట్లే అడగనన్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, డీఎస్సీ, రాజధాని ఇలా పలు వాగ్దానాలన్నీ ముఖ్యమంత్రి మద్యం దుకాణాల్లో పెట్టుకున్నారని విమర్శించారు. సొంత చిన్నాన్నను చంపినవారిని సీఎం పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట