పశ్చిమాన సాగునీరు పారిస్తాం
‘‘ఆలూరు దద్దరిల్లింది.. ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు.. ఎన్నికలకు సై అంటూ కర్నూలు కాలు దువ్వుతోంది.. వేదవతి ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తీసుకొంటా.. నీటి నిల్వను మూడు టీఎంసీలకు తగ్గించి ప్రాజెక్టు లక్ష్యాన్ని వైకాపా నాశనం చేసింది.
వేదవతి ప్రాజెక్టును పూర్తిచేస్తాం
ఆలూరులో తెదేపా అధినేత చంద్రబాబు
ఈనాడు, కర్నూలు, ఆలూరు గ్రామీణం, ఆలూరు, న్యూస్టుడే: ‘‘ఆలూరు దద్దరిల్లింది.. ఇంత ఉత్సాహం ఎప్పుడూ చూడలేదు.. ఎన్నికలకు సై అంటూ కర్నూలు కాలు దువ్వుతోంది.. వేదవతి ప్రాజెక్టు పూర్తిచేసే బాధ్యత తీసుకొంటా.. నీటి నిల్వను మూడు టీఎంసీలకు తగ్గించి ప్రాజెక్టు లక్ష్యాన్ని వైకాపా నాశనం చేసింది.. తెదేపా అధికారంలోకి రాగానే ఎనిమిది టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తాం.. దీంతో 80 వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది... పశ్చిమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది’’ అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆలూరు నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభకు భారీ ఎత్తున జనం తరలొచ్చారు. చంద్రబాబు ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. ఆలూరు తెదేపా అభ్యర్థి వీరభద్ర గౌడ్ సాధారణ కార్యకర్త, కర్నూలు ఎంపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు కురుబ సామాజిక వర్గానికి చెందిన సామాన్య వ్యక్తి.. వారిద్దరినీ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ‘కురబ కులస్థుడైన బస్తిపాటి నాగరాజు కర్నూలు నుంచి దిల్లీ పార్లమెంటుకు వెళ్లబోతున్నారని ఊహించారా? తెదేపాలో సామాన్య కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం ఇది. అందుకే వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించాన్న ఉద్దేశంతో జనసేన అధినేత పనన్ కల్యాణ్ పొత్తుపెట్టుకున్నారని.... జనసేన కార్యకర్తలు కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని. వైకాపాను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.
- ఆలూరు తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో చంద్రబాబు టికెట్ కేటాయించారు.. ఆ నమ్మకాన్ని వమ్ముచేయనన్నారు.
- కర్నూలు ఎంపీ అభ్యర్థి నాగరాజు మాట్లాడుతూ.. ఆలూరు అత్యంత వెనుకబడిన ప్రాంతం.. ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు.
- కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు తిక్కారెడ్డి మాట్లాడుతూ.. వైకాపా నేతలు మద్యం, మట్కా, పేకాట, ఇసుక అక్రమ రవాణా వంటి అక్రమాలు చేశారే తప్ప.. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేయలేదన్నారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం
పశ్చిమ ప్రాంతంలో నీళ్లు లేక పెళ్లిళ్లూ వాయిదా వేసుకోవాల్సి వస్తోంది.. అధికారంలోకి వచ్చిన వెంటనే సాగు నీటితోపాటు ఇంటింటికి కుళాయి ద్వారా మంచినీరు ఇచ్చే ఏర్పాటు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆదోని నియోజకవర్గాల నుంచి ఏటా వేలాది మంది వలస వెళ్తున్నారు. వారికి స్థానికంగా ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. టమాట రైతులను ఆదుకోవడానికి వీలుగా టమాట శుద్ధి (ప్రాసెసింగ్) పరిశ్రమ తీసుకొస్తాం.. మిరప రైతులకు ఆదోనిలో మార్కెట్ ఏర్పాటు చేస్తామన్నారు. నగరడోణా ప్రాజెక్టు, వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, బీసీ గురుకుల పాఠశాల కావాలని డిమాండు చేస్తున్నారని... వాటి ఏర్పాటుకు హామీ ఇస్తున్నానని ప్రకటించారు. ఆగిపోయిన జాతీయ రహదారి పనులు పూర్తి చేస్తామన్నారు. ‘జగన్రెడ్డి రాయలసీమలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు నిర్మించారా? సాగు, తాగునీరు ఇచ్చారా? ఒక్క ఉద్యోగం ఇచ్చారా? డీఎస్సీ నిర్వహించారా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మీ జీవితాలు బాగుపడ్డాయా? మీ ఆదాయం పెరిగిందా? మీ కష్టాలు తీరాయా? మిరప, పత్తి, టమాట రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తున్నాయా?’ అని చంద్రబాబు ప్రశ్నించారు. సభకు హాజరైన ప్రజలు ఆయా ప్రశ్నలకు ‘లేదు... లేదు...’ అంటూ సమాధానం ఇచ్చారు.
ఎండను సైతం లెక్కచేయకుండా..
ప్రజాగళం సభకు జనం భారీగా హాజరయ్యారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, పలు ప్రాంతాల నుంచి వచ్చిన జనం అడుగడుగునా నీరాజనం పలికారు. మహిళలు ఎండను సైతం లెక్కచేయక చంద్రబాబు రాక కోసం ఎదురుచూశారు. చిన్నారులు సైతం పార్టీ జెండాలు చేతపట్టి ఉత్సాహంగా పాల్గొన్నారు. జనసేన, భాజపా నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో జనం ఈలలు వేస్తూ.. చప్పట్లు కొడుతూ ఉత్సాహం కనబరిచారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నమ్ముకున్న నేతలకు న్యాయం చేస్తాం
- ‘వైకుంఠం కుటుంబం తెదేపాకు అండగా ఉండే కుటుంబం. ఎప్పుడు ఆలూరుకు వచ్చినా వైకుంఠం శ్రీరాములు గుర్తుకొస్తారు.. శివప్రసాద్, ఆయన భార్య జ్యోతి ఎప్పుడూ తెదేపాకే పనిచేశారు. కొందరు స్వార్థంతో వెళ్లిపోయినా శివప్రసాద్, జ్యోతి తెదేపాలోనే ఉన్నారు. వారిని పార్టీ అన్ని విధాలా ఆదుకుంటుందని చంద్రబాబు చెప్పారు. అదేవిధంగా కప్పటాళ్ల బొజ్జమ్మకూ న్యాయం చేస్తామన్నారు.
- కోట్ల సుజాతమ్మకు కొన్ని కారణాలతో టికెట్ ఇవ్వలేకపోయాం. ఆమె సీటును త్యాగం చేయాల్సి వచ్చింది. ఆమెకు న్యాయం చేస్తాం.. ఆమె అభిమానులందరూ తెదేపా విజయానికి సహకరించాలి’ అని తెదేపాలోని కీలక నాయకులందరినీ ఏకతాటిపైకి తెచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వారికి తగిన న్యాయం చేస్తామని బహిరంగంగా ప్రజలందరి ముందూ ప్రకటించి వారిలో విశ్వాసం నింపడంతో పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.
- ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆదోని అసెంబ్లీ స్థానం భాజపాకు కేటాయించామని, తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే నీకు న్యాయం చేస్తానని ఆదోని మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడుకు తెదేపా అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు