logo

నా జీవితాన్ని నాశనం చేసింది నువ్వే.. వైకాపా ఎమ్మెల్యే భార్యను నిలదీసిన మహిళ

‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి సతీమణి, కౌన్సిలర్‌ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

Updated : 24 Apr 2024 09:29 IST

కారులో వెనుదిరిగి వెళుతున్న ఎమ్మెల్యే సతీమణి

నంద్యాల గాంధీచౌక్‌, న్యూస్‌టుడే : ‘నా జీవితం నాశనం కావడానికి కారణం నువ్వే. మీ కుటుంబం నాకు అన్యాయం చేసింది’ అంటూ ఓ మహిళ నంద్యాల వైకాపా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి సతీమణి, కౌన్సిలర్‌ నాగినిరెడ్డిని నిలదీయడం తీవ్ర చర్చనీయాంశమైంది. నంద్యాల పట్టణంలోని నూనెపల్లెలో పరిధిలో సోమవారం ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికీ వెళ్లి తన భర్త శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డిని గెలిపించాలని స్థానికులను కోరారు.

ఈ సందర్భంగా స్థానిక మహిళ ఒకరు శిల్పా కుటుంబం తనకు అన్యాయం చేసిందని ఆరోపించారు. తనకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఒక ఆడపిల్లకు సమాధానం చెప్పలేరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రచారానికి అడ్డొస్తోందని వైకాపా కార్యకర్తలు ఆమెను పక్కకు నెట్టేశారు. అయినా సరే ఆమె వెంబడిస్తుండటంతో నాగినిరెడ్డి ప్రచారాన్ని మధ్యలోనే ఆపేసి కారులో వెళ్లిపోయారు. బాధిత మహిళ కుటుంబ సమస్య విషయంలో ఎమ్మెల్యే, ఆయన భార్య పంచాయితీ చేసినట్లు సమాచారం. ఈ కారణంగానే తనకు అన్యాయం చేశారని బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పట్టణంలో చర్చ జరుగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని