గడప చేరని బియ్యం
పేదలకు నెలవారీగా అందాల్సిన గుప్పెడు బియ్యంపై సార్వత్రిక ఎన్నికల ప్రభావం పడింది. ఈనెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారాలతో చాలా మంది గడపకు చేరలేదు.
రేషన్ సరకుల పంపిణీకి నేడే ఆఖరు
గడువు పెంచాలని పేదల వినతి
కర్నూలు మార్కెట్, న్యూస్టుడే : పేదలకు నెలవారీగా అందాల్సిన గుప్పెడు బియ్యంపై సార్వత్రిక ఎన్నికల ప్రభావం పడింది. ఈనెల 1 నుంచి ఎండీయూ వాహనాల ద్వారా సరకుల పంపిణీ చేపట్టినప్పటికీ అధిక ఉష్ణోగ్రతలు, ఎన్నికల ప్రచారాలతో చాలా మంది గడపకు చేరలేదు. కొందరు ఎండీయూ ఆపరేటర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములవడం.. పౌరసరఫరాల అధికారులు పట్టించుకోకపోవడంతో సరకుల పంపిణీ అధ్వానంగా సాగింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 760 ఎండీయూ వాహనాలు ఉండగా వివిధ కారణాలతో కొందరు ఆపరేటర్లు విధుల నుంచి తప్పుకున్నారు. వీరి బాధ్యతలను మరొకరికి అప్పగించారు. ఇలాంటి చోట్ల పంపిణీ మందగించింది. ఈనెల 13న ఎన్నికల పోలింగ్ రోజున పంపిణీ ఆపేశారు. 17వ తేదీతో సరకుల పంపిణీ గడువు ముగియనుండటంతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు.
1,60,368 మందికి అందని సరకులు
- కర్నూలు అర్బన్తోపాటు 25 మండలాల పరిధిలో 6.76 లక్షల మంది కార్డుదారులకు బియ్యం, పంచదార, గోధుమపిండి విడుదల చేశారు. 16వ తేదీ నాటికి 5,92,944 మంది కార్డుదారులకు మాత్రమే సరకులు అందజేశారు. ఇంకనూ 83,265 మందికి సరకులు అందాల్సి ఉంది.
- నంద్యాల జిల్లాలో 5.41 లక్షల మంది కార్డుదారులు ఉండగా 4,64,701 మందికి మాత్రమే ఇచ్చారు. ఇంకనూ 77,103 మంది కార్డుదారులకు సరకులు ఇవ్వాల్సి ఉంది.
- ఉమ్మడి జిల్లాలో 12.18 లక్షల మంది కార్డుదారులు ఉండగా వీరిలో 10.57 లక్షల మందికి మాత్రమే సరకులు ఇచ్చారు.. 1.60 లక్షల మంది కార్డుదారులకు ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరకులు అందలేదు.
కొరవడిన పర్యవేక్షణ
- అధికారులు ఎన్నికల విధుల్లో ఉండటంతో చాలామంది ఎండీయూ ఆపరేటర్లు సక్రమంగా సరకులు పంపిణీ చేయలేదు. ఉదయం 7 గంటల నుంచి వాహనాలతో ఇంటింటా సరకులు పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ చాలాచోట్ల పది గంటల వరకు ప్రారంభించలేదు. మధ్యాహ్నం ఎండల తీవ్రత కారణంగా సరకుల పంపిణీకి సమస్యలు ఏర్పడ్డాయి. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సరకులు ఇవ్వాల్సి ఉన్నా కొందరు ఆపరేటర్లు వాహనాలను అందుబాటులో ఉంచలేదు.
- ఈనెల 11, 12 తేదీల్లో సర్వర్ మొరాయించడంతో సరకుల పంపిణీకి ఆటంకం ఏర్పడింది. దీనికితోడు జిల్లాలో పౌరసరఫరాల గోదాముల నుంచి చౌక దుకాణాలకు సరకులు సకాలంలో చేరలేదు.
- ఒకసారి ఒక వీధికి వచ్చిన ఎండీయూ వాహనం మళ్లీ అక్కడికి వెళ్లకపోవడంతో చాలామంది సరకుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి. పోర్టబులిటీ విధానం అమలుకు కొన్నిచోట్ల ఆపరేటర్లు మోకాలడ్డటంతో పట్టణ ప్రాంతాల్లో పేదలు సరకులు కోల్పోవాల్సి వచ్చింది.
ఇంటింటికి ఎగనామం
- ఇంటింటికి రేషన్ పంపిణీ కాదు కదా.. వీధిల్లోకి ఎండీయూ వాహనాలు రాలేదు. రహదారులపై ఒకచోట వాహనాలు ఆపి కార్డుదారులకు రేషన్ సరకులు పంపిణీ చేశారు. ఫలితంగా జనాలకు ఎండలో ఇబ్బందులు తప్పలేదు.
- పౌరసరఫరాల అధికారులు ఎన్నికల ప్రక్రియలో ఉండగా.. సగం మంది ఎండీయూ ఆపరేటర్లు అధికార పార్టీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
- కొన్నిచోట్ల ఎండీయూ ఆపరేటర్లు, చౌక దుకాణాల డీలర్లు కుమ్మక్కై చౌక దుకాణాల దగ్గరే రేషన్ పంపిణీ చేశారు. పౌరసరాఫరాల అధికారులు పర్యవేక్షించాల్సి ఉండగా.. తమకేమీ పట్టనట్లు వ్యవహరించారు. ఈ నేపథ్యంలో రేషన్ సరకుల పంపిణీ గడువు పెంచాలని కార్డుదారులు విన్నవిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం