భూసార పరీక్షలనేలచూపులు
పంట దిగుబడి, నాణ్యతకు భూసారమే కీలకం. నేల లక్షణాలు.. ఇందులో లోపించిన సూక్ష్మధాతువుల వివరాలు తెలుసుకుని.. అందుకు అనుగుణంగా ఎరువులు వినియోగిస్తే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి.
దృష్టి సారించని అధికారులు
ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు
పంట దిగుబడి, నాణ్యతకు భూసారమే కీలకం. నేల లక్షణాలు.. ఇందులో లోపించిన సూక్ష్మధాతువుల వివరాలు తెలుసుకుని.. అందుకు అనుగుణంగా ఎరువులు వినియోగిస్తే అధిక దిగుబడులు సాధ్యమవుతాయి. ఇది తెలియాలంటే భూసార పరీక్షలు తప్పనిసరి. ఇందుకోసం ఏటా మే మొదటి వారం నుంచే మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఆ ఊసేలేదు.
ఆత్మకూరు, న్యూస్టుడే
ముందే పలకరించిన తొలకరి
కర్నూలు జిల్లాలో 5.39 లక్షలు, నంద్యాల జిల్లాలో 3.67 లక్షల హెక్టార్ల సాగు భూమి ఉంది. జూన్ ప్రారంభం నుంచి ఖరీఫ్ సీజన్ పనులు మొదలవుతాయి. నిన్నటి వరకు ఎన్నికల పనుల్లో నిమగ్నమైన అధికారులు మే నెలలో మట్టి నమూనాల సేకరణపై దృష్టిపెట్టలేదు. మొన్నటి దాకా వేసవి ఎండలు మండిపోయాయి. ప్రస్తుతం అడపాదడపా కురుస్తున్న వర్షాలతో రైతులు పొలం బాట పట్టారు. ఇప్పటికే దుక్కులు దున్నిన రైతన్నలు పొలాల్లో భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు, నవధాన్యాలు చల్లేందుకు సిద్ధమవుతున్నారు. వ్యవసాయ అధికారులు రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు.
బిగించని పరికరాలు
ఐదేళ్లుగా నిలిచిపోయాయి
ఉమ్మడి జిల్లాలో గత ఐదేళ్లుగా భూసార పరీక్షలు నిలిచిపోయాయి. గత ప్రభుత్వంలో ఏటా పరీక్షలు నిర్వహించి రైతులకు భూసార పరీక్ష పత్రాలు అందజేసేవారు. 2023- 24లో భూసార పరీక్షల లక్ష్యాలు నిర్దేశించినా బడ్జెట్ మాత్రం కేటాయించలేదు. 2023- 24లో సెంట్రల్ స్కీం ద్వారా ఉమ్మడి జిల్లాల్లో 1729 నమూనాలు మాత్రమే సేకరించి పరీక్షించారు. వికసిత్ భారత్ కార్యక్రమాల్లో భాగంగా కొందరు రైతులకు పత్రాలు పంపిణీ చేశారు. తర్వాత వాటిని కూడా తిరిగి తీసేసుకున్నారని రైతులు వాపోతున్నారు.
ఎమ్మిగనూరు సమీపంలో ముగతి ఫారంలో భూసార పరీక్ష కేంద్రం ఉన్నా ఏడాదికిపైగా విద్యుత్తు బిల్లులు చెల్లించకపోవడంతో కరెంటు సరఫరా నిలిపివేశారు. ప్రయోగశాలలో రూ.లక్షలు విలువైన ఆధునిక పరికరాలు, సిబ్బంది ఉన్నా రసాయనాలు లేక చేయలేని పరిస్థితి నెలకొంది. గతేడాది ఉప విభాగంలోని 85 రైతుభరోసా కేంద్రాల్లో 962 మట్టి నమూనాలు సేకరించారు. వాటిని ల్యాబ్లో పరీక్షించి రైతులకు క్షేత్ర స్థాయిలో పూర్తిగా అందించలేకపోయారు.
ఎమ్మిగనూరు వ్యవసాయం
2019 నివేదికలే ప్రామాణికం
- ఉమ్మడి జిల్లాలో నల్లరేగడి 72, ఎర్రరేగడి 22, ఇతర భూములు 6 శాతం ఉన్నాయి. 2018 సెంట్రల్ స్కీం నివేదికలో ఉమ్మడి జిల్లాల నేలల్లో క్షార గుణం మధ్యస్తంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సేంద్రియ కర్భనం తక్కువగా ఉన్నట్లు తేల్చారు.
- ఉమ్మడి జిల్లాలో 2018- 19లో నిర్వహించిన భూసార పరీక్షల ఫలితాలే ఇప్పటికీ దిక్కయ్యాయి. భూసార పరీక్షా కేంద్రాల నివేదికల ప్రకారం భూముల్లో నత్రజని లోపించింది. 31 మండలాల్లో ఇనుము, 33 మండలాల్లో జింకు, 4 మండలాల్లో కాపర్, మాంగనీస్ లోపం ఉంది.
- పొటాషియం 14 మండలాల్లో తీవ్రస్థాయిలో, 13 మండలాల్లో మధ్యస్తంగా ఉంది. ఏడు మండలాల్లో సల్ఫర్ లోపం అధికంగా ఉంది. 13 మండలాల్లో మధ్యస్థంగా ఉంది. దీనివల్ల పంటల దిగుబడి తగ్గిపోతుంది.
- సమస్యలు అధిగమించాలంటే భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులు, అవసరమైన సూక్ష్మ పోషకాలు వినియోగించాల్సి ఉంది.
అక్కరకురాని అగ్రిల్యాబ్లు
- భూసార పరీక్షలు, విత్త, పురుగు మందుల నాణ్యత గుర్తించడం వంటి సేవలు అందించేందుకు ఉమ్మడి జిల్లా పరిధిలో 12 ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్లు నిర్మించారు. ఒక్కో ల్యాబ్కు భవన నిర్మాణం, పరికరాలు, సామగ్రి కోసం రూ.70 లక్షలు కేటాయించారు.
- కర్నూలు జిల్లాలోని కర్నూలు, మంత్రాలయం, ఆదోని, పత్తికొండలో మొదటి విడతలో ప్రారంభించి సేవలు అందుబాటులోకి తెచ్చారు. రెండో విడతలో మంజూరైన గూడూరు, పాణ్యం కేంద్రాల్లో సేవలు అందుబాటులోకి రావాల్సి ఉంది.
- నంద్యాల జిల్లాలోని నంద్యాల, ఆళ్లగడ్డలో అగ్రీల్యాబ్లు పనిచేస్తున్నాయి. ఆత్మకూరు, డోన్, నందికొట్కూరు, కోవెలకుంట్లలో సేవలు అందుబాటులోకి రాలేదు.
- కర్నూలు జిల్లాలో 466, నంద్యాల జిల్లాలో 411 ఆర్బీకేలు ఉన్నాయి. వీటి ద్వారా ఆయా గ్రామాల్లో మట్టి నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం అగ్రీల్యాబ్లకు పంపాల్సి ఉన్నా ఎక్కడా ఆ పని జరగడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?