కత్తి దూస్తున్న కక్షలు
సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.. అనంతరం పల్లెల్లో కక్షలు కత్తి దూస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పార్టీల ఫిరాయింపులు మొదలుకొని ఇరువర్గాల మధ్య గొడవలు, ఘర్షణలతో రాజకీయ వైరం పెరిగింది.
పోలింగ్ అనంతరం పెరిగిన ఘటనలు
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే : సార్వత్రిక ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ముగిసింది.. అనంతరం పల్లెల్లో కక్షలు కత్తి దూస్తున్నాయి. ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో పార్టీల ఫిరాయింపులు మొదలుకొని ఇరువర్గాల మధ్య గొడవలు, ఘర్షణలతో రాజకీయ వైరం పెరిగింది. దీనికితోడు వ్యక్తిగత కక్షలు తీవ్రమయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజలు భయాందోళన గురవుతున్నారు. పోలీసులు బైండోవర్ నమోదు చేసి ముందస్తు చర్యలు తీసుకున్నా పలుచోట్ల ఘర్షణలు జరిగాయి. ఎన్నికల రోజున నంద్యాల పట్టణంలో వైకాపా, తెదేపా మధ్య గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. తెదేపా నాయకుడి వాహనంపై వైకాపా వర్గీయులు రాళ్లు రువ్వటంతో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వైకాపా అభ్యర్థి శిల్పా రవికిషోర్రెడ్డి, తెదేపా అభ్యర్థి ఫరూక్తోపాటు వారి వర్గీయులపైన పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. కర్నూలు జిల్లా కేంద్రంలో సిల్వర్జూబ్లీ కళాశాల వద్ద తెదేపా నగర అధ్యక్షుడు నాగరాజు డ్రైవర్ ఎరుకలి కావడి నాగరాజుపై వైకాపా వర్గీయులు దాడిచేసి గాయపరిచారు. ఈ ఘటనలో వైకాపా కర్నూలు జిల్లా అధ్యక్షురాలు సత్యనారాయణమ్మ, ఆమె భర్త గడ్డం రామకృష్ణ, కుమారుడు, మరో ఇద్దరు వైకాపా వర్గీయులపై కర్నూలు మూడో పట్టణ పోలీసుస్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. దీంతో ఒకే వార్డులో ఉండే తెదేపా నగర అధ్యక్షుడు, వైకాపా జిల్లా అధ్యక్షురాలి మధ్య రాజకీయ వైరం ముదిరినట్లైంది.
దౌర్జన్యాలకు పాల్పడి..
దొంగ ఓట్ల విషయంలో కర్నూలు పాతబస్తీ, శ్రీరామ్నగర్ కాలనీల్లో ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. పాతబస్తీలో ఉస్మానియా కళాశాల వద్ద జరిగిన ఘర్షణ ఉద్రిక్తతకు దారి తీసింది. కల్లూరు మండలం తడకనపల్లెకు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ప్రచారానికి వెళ్లిన సందర్భంలో జనసేన నాయకుడు ప్రశ్నించగా ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటనతో ఇరువర్గాల మధ్య వైరం ముదిరింది. ఎన్నికల రోజున కాటసాని కుమారుడు కల్లూరు పట్టణ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలో దౌర్జన్యానికి పాల్పడ్డారు. డోన్ నియోజకవర్గ పరిధిలో కోట్ల వర్గీయులకు, వైకాపా అభ్యర్థి బుగ్గనకు మధ్య రాజకీయ వైరం తీవ్రమైంది. సీమ సుధాకర్రెడ్డిని పోలీసులు అరెస్టు చేయటంతో బుగ్గనపై కోట్ల వర్గీయులు ఆగ్రహంతో ఉన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. తెదేపా అభ్యర్థి భూమా అఖిలప్రియ అనుచరుడిపై దాడి ఘటన ఉలిక్కిపాటుకు గురిచేసింది.
వైరం ముదిరి..
బనగానపల్లి నియోజకవర్గంలో కాటసాని, బీసీల మధ్య పరస్పర విమర్శలతో వారి మధ్య వైరం ముదిరి పాకానపడింది. శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డా, శిల్పాల మధ్య దూషణల పర్వం కొనసాగింది. పత్తికొండ మండలం జూటూరులోని పోలింగ్ కేంద్రంలో జరిగిన గొడవతో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య మనస్పర్థలొచ్చాయి. నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలోని ప్రాతకోటలో వైకాపా, తెదేపా వర్గీయులు ఘర్షణ పడటంతో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాల ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయోనన్న ఆందోళన ప్రజల్లో నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే