ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం
సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (పీవో, ఏపీవో), ఇతర పోలింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన పారితోషికాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఉద్యోగులు మండిపడుతున్నారు.
న్యూస్టుడే, నంద్యాల పట్టణం: సార్వత్రిక ఎన్నికల విధులు నిర్వహించిన ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు (పీవో, ఏపీవో), ఇతర పోలింగ్ సిబ్బందికి ఇవ్వాల్సిన పారితోషికాల్లో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారని ఉద్యోగులు మండిపడుతున్నారు. కర్నూలు జిల్లాలో 2,204 పోలింగ్ కేంద్రాలు, నంద్యాలలో 1,983 ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నిధులను జిల్లా ఎన్నికల అధికారులు నియోజకవర్గాల ఎన్నికల రిటర్నింగ్ అధికారుల(ఆర్వో)కు మంజూరు చేశారు. ఆయా కేంద్రాల్లో విధుల నిర్వహించిన సిబ్బందికి ఇవ్వాల్సిన పైకంలో ఆర్వోలు కోత పెట్టారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రుసుముల చెల్లింపుల్లో నియోజకవర్గాలవారీగా వ్యత్యాసాలు ఉండటంతో పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చే అరకొర మొత్తంలోనూ కోత పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు.
ఒక్కోచోట.. ఒక్కోలా
ఎన్నికల కమిషన్ ఆదేశాలమేరకు ప్రిసైడింగ్ అధికారి, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారికి నిత్యం రూ.350 చొప్పున, ఇతర పోలింగ్ అధికారికి రోజుకు రూ.250 చొప్పున ఇవ్వాల్సి ఉంది. పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎన్నికల విధులు నిర్వహించిన పీవోలు, ఏపీవోలకు రూ.3,150, ఓపీవోలకు రూ.1,500 ప్రకారం పారితోషికం ఇచ్చారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో పీవోలు, ఏపీవోలకు రూ.2,050, ఓపీవోలకు రూ.1,050, వైఎస్సార్ జిల్లా బద్వేల్లో పీవోలకు రూ.1,800, ఓపీవోలకు రూ.800 ప్రకారం అందజేశారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పీవోలు, ఏపీవోలకు రూ.2,500, ఓపీవోలకు రూ.800 అందించారు.
ఆడిట్ లేకపోవడంతోనే
ఎన్నికల ఖర్చులకు ఆడిట్ ఉండదు. ఉన్నతాధికారులు రాసిందే ‘లెక్క’గా ఉంటుంది. దీంతో ఎన్నికల సంఘం నిర్దేశించిన ప్రకారం చెల్లించలేదనే విమర్శలున్నాయి. ఎన్నికల విధులు అంటేనే ఉద్యోగులకు చాలా కీలకం. ఏమాత్రం అలసత్వం వహించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కొంతమంది అధికారులు, ఉద్యోగులు భోజనాలు చేయకుండా విధులు నిర్వహించారు. ఇలాంటి పరిస్థితుల్లో తమకు ఇచ్చే కొద్దిపాటి రుసుముల్లో వ్యత్యాసాలు ఉండటం సబబు కాదని పలువురు పేర్కొన్నారు.
అందని విధి నిర్వహణ పత్రాలు
ఎన్నికల విధులు నిర్వహించిన నేపథ్యంలో ఉద్యోగులకు డ్యూటీ సర్టిఫికెట్లు అందజేస్తారు. కర్నూలు, నంద్యాల జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో వాటిని ఇవ్వలేదు. ఎన్నికల విధులు నిర్వహించినట్లు ధ్రువపత్రం ఉంటేనే సంబంధిత రోజులకు ఈఎల్స్ ఇస్తారు. కొన్నిచోట్ల మాత్రమే రిటర్నింగ్ అధికారులు డ్యూటీ సర్టిఫికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచారు. వెంటనే వాటిని ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.
భారీగా కోత పెట్టారు
- నంద్యాల జిల్లాలో పీవోలు, ఏపీవోలకు కొన్ని నియోజకవర్గాల్లో రోజుకు రూ.300, మరికొన్ని చోట్ల రూ.350, కొన్నిచోట్ల రూ.291 ప్రకారం పంపిణీ చేశారు.
- కర్నూలు జిల్లా వ్యాప్తంగా పీవోలు, ఏపీవోలు పనిచేసిన ఆరు రోజులకు సంబంధించి రోజుకు రూ.350 చొప్పున లెక్కకట్టి రూ.2,100 ఇచ్చారు. ఓపీవోలకు రోజుకు రూ.250 చొప్పున మూడు రోజులకు రూ.750 ఇచ్చారు.
- నంద్యాల జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో పీవోలు, ఏపీవోలకు ఆరు రోజులకుగాను రూ.1,800 చెల్లించగా, నంద్యాల నియోజకవర్గంలో రూ.2,100 ప్రకారం ఇచ్చారు.
- ఆళ్లగడ్డ నియోజకవర్గంలో రూ.1,750 ప్రకారం చెల్లిస్తే, శ్రీశైలం నియోజకవర్గంలో రూ.1,800 ప్రకారం ఇచ్చారు.
- నంద్యాల జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో పీవోలు, ఏపీవోలు, ఓపీవోలకు ఇష్టానుసారంగా పైకం చెల్లించారు. ఓపీవోలకు నాలుగు రోజుల పనిదినాలుగా లెక్కించి రూ.1,000 ఇవ్వడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి