logo

అహోబిలంలో ఘనంగా నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వైశాఖమాస నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

Updated : 18 May 2024 19:10 IST

ఆళ్లగడ్డ గ్రామీణం: ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలంలో వైశాఖమాస నరసింహ స్వామి జయంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామి పలు వాహనాలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు. శనివారం ఎగువ అహోబిలంలో జ్వాలా నరసింహస్వామి, వేణుగోపాల స్వామి అలంకరణలో శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిపై కొలువుదిరి ఆలయ తిరువీధుల్లో ఊరేగారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అర్చకులు పంచామృతాలతో అభిషేకం చేశారు. రాత్రి స్వామివారు పొన్న చెట్టు వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలన్, మనియార్ సౌమ్యనారాయణన్ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు