logo

నృసింహస్వామి జయంతి బ్రహ్మోత్సవాలు

వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో నరహరుడు అహోబిలం లక్ష్మీనృసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకరణలో శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిపై కొలువుదీర్చి ఆలయ తిరువీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు.

Published : 19 May 2024 04:41 IST

స్వామి వారి ఉత్సవంలో భక్తులు  

అహోబిలం (ఆళ్లగడ్డ గ్రామీణం), న్యూస్‌టుడే: వైశాఖ మాస నృసింహ జయంతి బ్రహ్మోత్సవాల్లో నరహరుడు అహోబిలం లక్ష్మీనృసింహస్వామి వేణుగోపాల స్వామి అలంకరణలో శనివారం భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారు శ్రీదేవి, భూదేవి సమేతంగా పల్లకిపై కొలువుదీర్చి ఆలయ తిరువీధుల్లో మేళతాళాలతో ఊరేగించారు. మధ్యాహ్నం స్వామి, అమ్మవార్లకు పంచామృతాభిషేకం చేసి మహామంగళహారతి సమర్పించారు. సాయంత్రం జ్వాలామూర్తి పొన్న చెట్టు వాహనంపై విహరించారు. దిగువ అహోబిలంలో ఉదయం ప్రహ్లాద వరదస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పంచామృతాలతో అభిషేకం చేసి పల్లకిపై ఆలయ పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయ ప్రధానార్చకుడు కిడాంబి వేణుగోపాలన్, మణియార్‌ సౌమ్యనారాయణన్‌ ఆధ్వర్యంలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని