బీఎల్వోలకు అందని భృతి
ఎన్నికల విధులకు సంబంధించి బీఎల్వోలు నిరంతరం కష్టపడ్డారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు.. ఓటర్ల మార్పులు, చేర్పుల్లో కీలకపాత్ర పోషించారు. పైసా పారితోషికం అందడం లేదు.
రెండేళ్లుగా ఎగవేత
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే : ఎన్నికల విధులకు సంబంధించి బీఎల్వోలు నిరంతరం కష్టపడ్డారు. క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించారు.. ఓటర్ల మార్పులు, చేర్పుల్లో కీలకపాత్ర పోషించారు. పైసా పారితోషికం అందడం లేదు. గతేడాది జులై 21వ తేదీ నుంచి ఇంటింటి ఓటరు సర్వే.. ఆ తర్వాత ముసాయిదా ఓటర్ల జాబితా, సవరణ, పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పన, ఓటరు చీటీల పంపిణీతోపాటు ఎన్నికల పోలింగ్ ప్రక్రియలోనూ కీలకపాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో బీఎల్వోలకు నిర్దేశిత మొత్తం చెల్లించాలని ఎన్నికల సంఘం ఆదేశించినా అధికారులు పట్టించుకోలేదు.
14 నియోజకవర్గాలు.. 4,187 మంది విధులు
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 4,187 మంది బీఎల్వోలు పనిచేస్తున్నారు. వీరిలో 2,500 మందికిపైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఉండగా.. మిగిలినవారు వీఆర్వోలు, వీఆర్ఏలు, పంచాయతీ కార్యదర్శులు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. అదనంగా బీఎల్వోలుగా పనిచేస్తున్నారు. ఏటా ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్ఎస్ఆర్) జరుగుతుంది. మధ్యలో ఎన్నికలు వస్తే అదనపు భారమే. గతేడాది ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. తాజాగా సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రతి బీఎల్వోకు ఆరు నెలలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.3 వేల గౌరవ భృతి చెల్లించాల్సి ఉంది.
రూ.1.25 కోట్ల మేర బకాయిలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలో గత రెండేళ్లుగా బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వో)లుగా విధులు నిర్వర్తిస్తున్న సచివాలయ, ఇతర ఉద్యోగులకు గౌరవ భృతిని ఎన్నికల అధికారులు ఇవ్వడం లేదు. ఎన్నికలకు ముందు బడ్జెట్ రాలేదని చెప్పుకొచ్చారు. వీరికి మొత్తం రూ.1.25 కోట్లు చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు బడ్జెట్ విడుదలైంది. ఎన్నికల పోలింగ్ విధులు నిర్వహించిన అధికారులు, ఉద్యోగులకు పైకం చెల్లించారు. పోలింగ్ సమయంలోనూ విధులు నిర్వహించిన బీఎల్వోలకు మాత్రం పైసా ఇవ్వకపోవడం గమనార్హం.
ఒక్క పైసా చెల్లిస్తే ఒట్టు
కర్నూలు నియోజకవర్గ పరిధిలోని 257 పోలింగ్ కేంద్రాల్లో సచివాలయ కార్యదర్శులు, వీఆర్వోలు గత నాలుగేళ్లుగా బూత్ లెవెల్ అధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. వీరు రాకముందు నగరపాలక సంస్థకు చెందిన నాలుగో తరగతి ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు ఈ బాధ్యతలు చూసేవారు. సచివాలయ వ్యవస్థ అందుబాటులోకి వచ్చాక ఇందులోని కార్యదర్శులకు బీఎల్వో బాధ్యతలు అప్పగించారు. వీరు ఈ అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతి ఆరు నెలలకు రూ.1500 చొప్పున వారి ఖాతాలో జమ చేసేవారు. గత రెండేళ్లుగా ఈ మొత్తం నిలిచిపోయింది. దీనిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా.. సీఎఫ్ఎంఎస్కు బిల్లులు పంపుతున్నామని, అవి తిరస్కరణకు గురవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట