లక్ష్య సాధనలోగెలుపు సందేశం
తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కష్టపడి చదవడం.. అనుకున్న లక్ష్యం చేరుకోవాలన్న కసి.. వెరసి ఆ విద్యార్థిని విజయం వైపు నడిపించాయి. పదో తరగతిలో పదికి పది.. ఇంటర్లో ఉత్తమ ఫలితాలతో ప్రశంసలు అందుకున్నాడు.
సీమ కుర్రోడికి తెలంగాణ ఎంసెట్లో నాలుగో ర్యాంకు
ముంబయి ఐఐటీ ప్రవేశంపై గురి
తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో విద్యార్థి బి.సందేశ్
తల్లిదండ్రుల ప్రోత్సాహం.. కష్టపడి చదవడం.. అనుకున్న లక్ష్యం చేరుకోవాలన్న కసి.. వెరసి ఆ విద్యార్థిని విజయం వైపు నడిపించాయి. పదో తరగతిలో పదికి పది.. ఇంటర్లో ఉత్తమ ఫలితాలతో ప్రశంసలు అందుకున్నాడు. శనివారం విడుదలైన తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించి తన ప్రత్యేకతను చాటాడు. ముంబయి ఐఐటీ కళాశాలలో అడుగు పెట్టాలని పట్టుదలతో చదివాడు.. ఉత్తమ ఫలితం సాధించాడు. ఆదోని పట్టణానికి చెందిన బి.సందేశ్ విజయగాథ తెలుసుకుందామా.
న్యూస్టుడే, ఆదోని విద్య
గురి చెదరకుండా..
ఆదోని పట్టణానికి చెందిన బి.రామసుబ్బారెడ్డి హొళగుంద జడ్పీ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా, వి.రాజేశ్వరి అరేకల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయినిగా విధులు నిర్వహిస్తున్నారు. వారి కుమారుడు బి.సందేశ్ హైదరాబాద్లో చదువుతున్నాడు. పదో తరగతిలో పదికి పది పాయింట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. ఓ ప్రైవేటు కళాశాలలో ఎంపీసీ ఇంటర్మీడియేట్లో వెయ్యికి 987 మార్కులు సాధించి ఉత్తమ ఫలితం సాధించాడు. ఆ తర్వాత జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో 99.99 శాతం మార్కులు సాధించి ఆల్ ఇండియాలో 252 మార్కులు సాధించాడు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎంసెట్ పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలోనే 4వ ర్యాంకు సాధించి చరిత్ర సృష్టించాడు. విద్యార్థి బి.సందేశ్ ఉత్తమ ప్రతిభ సాధించడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు అభినందనలు తెలిపారు.
రోజుకు 12 గంటల సాధన
ముంబయి నగరంలోని ఐఐటీ ముంబయి కళాశాలలో కంప్యూటర్ సైన్స్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా. అందుకు తగినట్లుగా రోజూ 10 నుంచి 12 గంటల పాటు కష్టపడి చదువుతున్నా. తల్లిదండ్రుల ప్రోత్సాహం.. అధ్యాపకులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినడం, సందేహాలు నివృత్తి చేసుకోవడంతో రాష్ట్ర స్థాయిలో నాలుగో ర్యాంకు సాధించగలిగా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో 99.99 శాతం మార్కులు సాధించి ఆల్ ఇండియాలో 252 ర్యాంకు సాధించా. ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల కోసం సిద్ధమవుతున్నా. ముంబయి ఐఐటీ కళాశాలలో సీటు సాధించి సాఫ్ట్వేర్ ఇంజినీరుగా ప్రత్యేకతను చాటాలనేదే లక్ష్యం.
బి.సందేశ్, విద్యార్థి, ఆదోని
పరిశోధనలే లక్ష్యం
ఐటీ రంగానికి ఉపయుక్తంగా ఉండేలా ఓ సంస్థను స్థాపించి పరిశోధనలు చేసి వినూత్న ఆవిష్కరణలు చేయాలన్నదే నా లక్ష్యం. తెలంగాణ ఈఏపీ సెట్లో 5వ ర్యాంకు వచ్చినందుకు ఆనందంగా ఉంది. జేఈఈ మెయిన్స్లో వంద పర్సంటైల్ వచ్చింది. జాతీయస్థాయిలో 36వ ర్యాంకు సాధించా. ప్రస్తుతం అడ్వాన్స్డ్ పరీక్షకు సిద్ధమవుతున్నా. ముంబై ఐఐటీలో సీటు వస్తుందని భావిస్తున్నా. నా తండ్రి రామేశ్వరరెడ్డి వ్యాపార రంగంలో ఉన్నారు. తల్లి అరుణ గృహిణి. నేను ఆరో తరగతి నుంచి గుంటూరులోనే చదువుకుంటున్నా.
సాయి యశ్వంత్రెడ్డి, 5వ ర్యాంకు, కర్నూలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే