బాక్సింగ్ కింగ్లు.. ఆదోని కుర్రాళ్లు
ఆ కుర్రాళ్లు కొట్టే దెబ్బలకు దవడలు అదిరిపోతాయి.. మెదడులోని నరాల్లో కదలికలు పుడతాయి.. రింగులోకి ప్రత్యర్థి రావాలంటేనే భయపడే పరిస్థితి.. పతకాలు మాత్రం వచ్చి వాలిపోతాయి.
జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ
న్యూస్టుడే, ఆదోని క్రీడలు
ఆ కుర్రాళ్లు కొట్టే దెబ్బలకు దవడలు అదిరిపోతాయి.. మెదడులోని నరాల్లో కదలికలు పుడతాయి.. రింగులోకి ప్రత్యర్థి రావాలంటేనే భయపడే పరిస్థితి.. పతకాలు మాత్రం వచ్చి వాలిపోతాయి. ఆదోని పట్టణానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారులు తమ ప్రత్యేకతను చాటుతున్నారు. కోచ్ కేశవ్ ఆధ్వర్యంలో బాక్సింగ్ క్రీడలో కఠిన సాధన చేస్తున్నారు.
గోవాలో జాతీయ స్థాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్-2024 పోటీల్లో ప్రతిభ చాటిన ఆదోని బాక్సర్లు
జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో ప్రత్యర్థులపై తమ పంచ్ పవర్ రుచి చూపించి పతకాల కైవసం చేసుకున్నారు. ఇటీవల గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ నేషనల్ ఛాంపియన్షిప్-2024 పోటీలో రాణించిన ఆదోని పట్టణానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారుల గురించి తెలుసుకుందామా..
విష్ణు విశ్వరూపం
ఆదోని పట్టణానికి చెందిన నాగరాజు దంపతుల కుమారుడు విష్ణువర్దన్ ఇంటర్మీడియేట్ చదువుతున్నాడు. రెండేళ్లుగా బాక్సింగ్ నేర్చుకుటున్నాడు. ముఖ్యంగా ఫేస్పంచ్, స్ట్రైట్ పంచ్, లోయర్ పంచ్ వంటి పంచ్లపై ప్రత్యేకంగా మెలకువలు నేర్చుకుంటున్నాడు. చురుకుదనంతో ప్రత్యర్థులపై తన పంచ్ల వర్షం కురిపిస్తూ.. అపజయాలు రుచిచూపిస్తున్నాడు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో అండర్-60 కేటగిరీ విభాగంలో బరిలో దిగి ప్రత్యర్థులను ఇంటిదారిపట్టించాడు. బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
రఘు పంచ్తంత్రం
ఆదోని మండలం విరుపాపురం గ్రామానికి చెందిన రైతు రాజు, సుజాత దంపతుల కుమారుడు యు.రఘు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. బాక్సింగ్ క్రీడపై మక్కువతో ఆదోని పట్టణంలోని మాస్టర్ కేశవ్ వద్ద శిక్షణ పొందుతున్నాడు. చదువుతూనే మరో వైపు ఉదయం, సాయంత్రం బాక్సింగ్ క్రీడలో సాధన చేస్తూ పట్టు సాధిస్తున్నాడు. ప్రత్యర్థులపై పంచ్ల వర్షం కురిపిస్తాడు. పంచ్ తప్పించుకోవడంలో మెలకువలు నేర్చుకుంటున్నాడు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో అండర్-45 కేటగిరీలో పాల్గొని తన క్రాస్ పంచ్ పవర్తో ప్రత్యర్థిపై విజయం సాధించి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. బాగా చదవడంతో పాటు బాక్సింగ్లో రాణించాలని ఉందని చెబుతున్నాడు రఘు.
రింగ్లో శివతాండవం
ఆదోని పట్టణం విక్టోరియాపేటకు చెందిన మల్లికార్జున, పార్వతి దంపతుల కుమారుడు బి.శివకుమార్ బీఏ డిగ్రీ చదువుతున్నాడు. రెండేళ్లుగా బాక్సింగ్ సాధన చేస్తున్నాడు. రోజూ బాక్సింగ్లో సాధన చేస్తూనే పౌష్టికాహారం తీసుకుంటూ.. అవసరమైన వ్యాయామం చేస్తున్నాడు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో శివకుమార్ అండర్-80 విభాగంలో ప్రాతినిధ్యం వహించి ఫైనల్స్ వరకు దూసుకెళ్లి వెండి పతకం కైవసం చేసుకున్నాడు. బాక్సింగ్ క్రీడలో రాణించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నానంటున్నాడు క్రీడాకారుడు శివకుమార్.
విజయాల చిరునామా
ఆదోని పట్టణం మహాత్మాగాంధీనగర్కు చెందిన వీరేశ్, పార్వతి దంపతుల కుమారుడు కె.విజయ్ పదో తరగతి చదువుతున్నాడు. చదువుతో పాటు బాక్సింగ్ క్రీడలో రాణిస్తున్నాడు. కోచ్ కేశవ్ వద్ద గత ఏడాది నుంచి బాక్సింగ్లో సాధన చేస్తున్నాడు. ప్రత్యర్థులపై పంచ్ల వర్షం కురిపించడంతో పాటు ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలి.. శక్తి ఎలా కూడగట్టుకోవాలి.. అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాడు. గోవాలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో ఫైనల్ పోటీ వరకు వెళ్లి వెండి పతకం సాధించి సత్తా చాటాడు. జాతీయ స్థాయిలో రాణించాలని లక్ష్యమని చెబుతున్నాడు క్రీడాకారుడు విజయ్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం