ఆర్యూ.. అక్రమాల పుట్ట
రాయలసీమ విశ్వవిద్యాలయంలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.. విచారణ సమగ్రంగా కొనసాగడం లేదు.. కొన్ని ఘటనల్లో విచారణలు పూర్తైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
ధ్రువపత్రాల్లో తప్పిదాల పేరుతో వసూళ్లు
తాజాగా వెలుగుచూసిన వైనం
ఈనాడు, కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో అక్రమాలు వెలుగులోకి వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.. విచారణ సమగ్రంగా కొనసాగడం లేదు.. కొన్ని ఘటనల్లో విచారణలు పూర్తైనా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. విశ్వవిద్యాలయ పరీక్షల విభాగం ఉద్యోగుల సహాయ సహకారాలతో కొందరు ఉత్తీర్ణత సాధించారని రెండు నెలల కిందట వెలుగుచూసింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ప్రత్యేకంగా ఒక విచారణ కమిటీని ఏర్పాటుచేశారు. అక్రమాలు వెలుగులోకి వచ్చి రెండు నెలలు దాటినా నేటికీ అక్రమాలకు పాల్పడినవారెవరు? సూత్రధారులెవరు? ఎంత సొమ్ము చేతులు మారింది? తదితర వివరాలేవీ బయటకు రాలేదు. కమిటీ విచారణ పూర్తిచేసి నివేదిక ఎప్పుడు ఇస్తుందన్నదీ ప్రశ్నార్థకంగానే మారింది. ఇందులో విశ్వవిద్యాలయంలోని కీలక స్థానాల్లో ఉన్నవారి ప్రమేయం, ప్రోత్సాహం ఉండడంతోనే విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపై కొందరు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ హేమచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆయన వీసీని ఆదేశించారు.
విజిలెన్స్ నిగ్గు తేల్చినా..
విశ్వవిద్యాలయంలో గతంలో నిధుల దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనలపై విజిలెన్స్ విచారణ సైతం జరిగింది. విశ్వవిద్యాలయ పరిధిలో నిధుల దుర్వినియోగం ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని విజిలెన్స్ అధికారులు ఉదాహరణలతో సహా నిగ్గు తేల్చారు. అధికారులు తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో విశ్వవిద్యాలయం ఏ అంశంలో ఎంత నష్టపోయిందన్న విషయాన్నీ నిర్ధారించారు. ఏళ్లు గడుస్తున్నా బాధ్యులపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు. కుంభకోణాలకు బాధ్యులైన వారిపై ఎప్పటికి చర్యలు తీసుకుంటారన్న విషయం పెద్ద మిస్టరీలా మారింది.
తప్పులతడకగా ప్రొవిజినల్ పత్రాలు
విశ్వవిద్యాలయ పరిధిలోని వివిధ కళాశాలల్లో పలు కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు విశ్వవిద్యాలయ అధికారులు ‘ప్రొవిజినల్ సర్టిఫికెట్లు’ జారీ చేస్తారు. అలాంటి కీలక ధ్రువపత్రాలను సైతం విశ్వవిద్యాలయ అధికారులు తప్పులతడకగా ఇస్తున్నారు. ఆయా పత్రాల పీడీఎఫ్ ప్రతులను విద్యార్థులకు పంపుతున్నారు. వీటిల్లో తప్పిదాలను గుర్తించిన విద్యార్థులు ప్రశ్నిస్తే వేరే విభాగం వారు చేసిన తప్పిదమని, తమకు సంబంధం లేదని.. విశ్వవిద్యాలయానికి వచ్చి మాట్లాడుకోవాలని చెబుతున్నారు. తీరా విశ్వవిద్యాలయానికి వచ్చాన తర్వాత వారితో బేరసారాలకు దిగుతుండడంతో విద్యార్థులు విస్తుపోతున్నారు. వంద శాతం కచ్చితత్వంతో చేయాల్సిన పనిని తప్పుగా చేయడమేకాక ఆయా తప్పిదాలను సవరించేందుకు రూ.వేలు వసూలు చేస్తుండడంతో విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఫిర్యాదుల వెల్లువ
విశ్వవిద్యాలయ పరిధిలోని కళాశాలలో చదువుకున్న ఓ విద్యార్థిని ప్రొవిజినల్ పత్రంలోని తప్పిదాలను సవరించేందుకు విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఏకంగా రూ.30 వేలు డిమాండు చేశారు. దీంతో ఆ విద్యార్థిని వీసీ సుధీర్ ప్రేమ్కుమార్ను కలిసి ఫిర్యాదు చేయడంతో తీగలాగితే డొంక కదిలినట్లైంది. ప్రొవిజినల్ ధ్రువపత్రాలను తప్పుగా ముద్రించి వాటిని సవరించే పేరుతో చాలామంది విద్యార్థుల నుంచి వసూళ్లకు పాల్పడ్డట్లు సమాచారం. ప్రొవిజినల్ పత్రాల ముద్రణ ప్రక్రియను కూడా అక్రమార్జనకు ఉపయోగించుకున్నారన్న విషయం ప్రస్తుతం విశ్వవిద్యాలయంలో కలకలంగా మారింది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిందితులకు కొమ్ముకాసేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలు ఫిర్యాదు చేసిన విషయం బయటకు పొక్కడంతో ఆమె దగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండా సవరించి కొత్తవి ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!