కళలకు వేదిక..ప్రతిభా వీచిక
చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ కళల్ని నేర్చుకునేందుకు నంద్యాలలోని కళారాధన సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తోంది.
కళారాధనలో ఉచిత శిక్షణలు
బొమ్మలు గీయడంలో తర్ఫీదు పొందుతున్న బాలలు
నంద్యాల గాంధీచౌక్, న్యూస్టుడే: చిన్నారుల అభిరుచులకు అనుగుణంగా వివిధ కళల్ని నేర్చుకునేందుకు నంద్యాలలోని కళారాధన సంస్థ ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఏటా వేసవిలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల చిన్నారులు వారికి ఇష్టమైన అంశాలను నేర్చుకునేలా వెన్నుదన్నుగా నిలుస్తోంది. వివిధ విభాగాల్లో చిన్నారులకు శిక్షణ ఇస్తోంది. శాసీˆ్త్రయ నృత్యం, ఆధునిక నృత్యం, శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, వాయిద్య సంగీతంలో గిటార్, కీబోర్డు, మిమిక్రి, వెంట్రిలాక్విజం, చిత్రలేఖనం, దస్తూరి, హస్తకళలు, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, పద్యపఠనం, సంస్కృత శ్లోకాలు, కవితాగానం, కవితారచన, చదరంగం, కరాటే, తైక్వాండో, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాలలో నిపుణులతో తర్ఫీదు ఇస్తోంది. కొన్ని ఏళ్లుగా పిల్లలు ఇక్కడ శిక్షణ పొంది వివిధ వేదికలపై ప్రదర్శనలు ఇచ్చి శభాష్ అనిపించుకుంటున్నారు. కొంత మంది ఇక్కడే శిక్షణ పొంది ప్రస్తుతం కోచ్లుగా వ్యవహరిస్తున్నారు.
ఆనందంగా ఉంది
ప్రస్తుతం 22వ కళారాధన శిబిరాన్ని మే 26 వరకు నిర్వహిస్తున్నందుకు ఆనందంగా ఉంది. రెండు దశాబ్దాలుగా వివిధ రంగాల్లో విద్యార్థులను తీర్చిదిద్దడం మరువలేనిది. విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీస్తున్నాం. ఎంతోమంది విద్యార్థులు వివిధ విభాగాలలో శిక్షణ పొంది ఉన్నత స్థాయిలోకి వెళ్లడం హర్షనీయం. ఈ సారి వేసవి శిక్షణశిబిరాలు నిర్వహిస్తాం. 25 మంది శిక్షకులతో తర్ఫీదు ఇస్తున్నాం.
డాక్టర్ మధుసూదన్రావు, కళారాధన అధ్యక్షుడు
సేవలు అందిస్తున్నాం
కరోనా సమయంలో మినహా మిగతా అన్ని సంవత్సరాలు వేసవిలో లలితకళల ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. వేసవిలో విద్యార్థులకు అదనంగా ఉపయోగపడే కళానైపుణ్యాలు అందిస్తున్నాం. ప్రతి ఏటా 20 విభాగాల్లో 400 మంది విద్యార్థులకు ప్రత్యేక శిక్షణలు ఉచితంగా ఇస్తున్నాం. ఇక్కడే శిక్షణ పొందిన విద్యార్థులు నేడు కోచ్లుగా వ్యవహరించడం అభినందనీయం. ఒకేసారి 20 విభాగాలలో అందిస్తున్నాం. శిక్షణ తరగతుల ముగింపు రోజున విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు నిర్వహించి ప్రశంసాపత్రాలు అందించనున్నాం.
డాక్టర్ రవికృష్ణ, కళారాధన ప్రధాన కార్యదర్శి
శిక్షకుడిగా చేయడం సంతోషకరం
నంద్యాల కళారాధన ప్రారంభమైన 2000 సంవత్సరం నుంచి నేను డ్యాన్స్లో శిక్షణ పొందాను. కొన్ని సంవత్సరాల పాటు తర్ఫీదు పొందిన అనంతరం ఇక్కడే శిక్షకుడిగా సేవలు అందించడం గర్వకారణం. ఎంతోమంది విద్యార్థులు వేసవిలో ఉచితంగా డ్యాన్స్ను నేర్చుకుంటున్నారు.
సతీష్, డ్యాన్స్మాస్టర్, నంద్యాల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం