దాచిన సొమ్ము దోచుకున్నారు
పేద, మధ్యతరగతి ప్రజలు పైసా..పైసా కూడబెట్టి పోస్టాఫీసుల్లో డబ్బును దాచుకుందామంటే కొందరు సిబ్బంది అప్పనంగా సొంతానికి వాడేస్తున్నారు.
మోసాలకు పాల్పడుతున్న తపాలా ఉద్యోగులు
శ్రీరంగాపురం తపాలా కార్యాలయం
ఆళ్లగడ్డ, రుద్రవరం, న్యూస్టుడే: పేద, మధ్యతరగతి ప్రజలు పైసా..పైసా కూడబెట్టి పోస్టాఫీసుల్లో డబ్బును దాచుకుందామంటే కొందరు సిబ్బంది అప్పనంగా సొంతానికి వాడేస్తున్నారు. ఎన్నో ఆశలతో కూడబెట్టుకున్న పేదోళ్ల సొమ్ముపై రాబందుల్లా పడి దోచేస్తున్నారు. దాచుకుంటే సొమ్ముకు భద్రత ఉందనుకునే వారి నమ్మకాలను వమ్ము చేస్తున్నారు. పోస్టాఫీసులు ప్రజల నమ్మకాన్ని కోల్పోకుండా కాపాడాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపైన ఉంది. మరి వారెలా స్పందిస్తారో చూడాల్సిందే. తాజాగా రుద్రవరం మండలం శ్రీ రంగాపురంలో బీబీఎంగా పనిచేస్తున్న శరత్నాయక్ ప్రజలకు చెందిన ఆర్డీ, పోస్టల్ సేవింగ్స్కు సంబంధించిన సొమ్మును వారి ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి పక్కదారి పట్టించారని స్థానికులు గగ్గోలుపెడుతున్నారు. బీబీఎంగా ఏడాది కిందటే విధుల్లో చేరిన ఆయన దాదాపు ఈ పోస్టాఫీసు పరిధిలో ఇప్పటివరకు 62 మంది ఖాతాదారులకు చెందిన రూ.3,48,211 పక్కదారి పట్టించినట్లు విచారణలో తేలింది.
బయటపడిందిలా
శ్రీ రంగాపురం బ్రాంచ్ పోస్టాఫీసు పరిధిలో శ్రీరంగాపురం, డి.కొట్టాల, టి.కొట్టాల గ్రామాలు వస్తాయి. టి.కొట్టాలకు సంబంధించిన ఒక ఖాతాదారు ఐదేళ్ల పాటు ఆర్డీ కట్టిన తర్వాత డబ్బులు తీసుకునేందుకు ప్రయత్నించారు. బీబీఎం శరత్ నాయక్ మాత్రం ఆర్డీ పుస్తకాలు ఖాతాదారుకు ఇవ్వకుండా వేధించారు. అనుమానం వచ్చిన ఖాతాదారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి విచారించగా ఏడాది నుంచి ఖాతాదారు అక్కౌంట్లో డబ్బులు జమ కావడం లేదని తేలింది. తాను నెల నెలా బీబీఎంకు డబ్బులు ఇస్తున్నానని ఆయన చెప్పారు. లోతుగా విచారించగా ఖాతాదారుల నుంచి డబ్బులు తీసుకుని పోస్టాఫీసులోని ఖాతాల్లో బీబీఎం జమ చేయకుండా పక్కదారి పట్టించినట్లు నిరూపణ అయ్యింది. ఇప్పటివరకు శ్రీ రంగాపురానికి చెందిన వారి నుంచి మాత్రమే వివరాలు సేకరించారు. ఇంకా ఎస్.కొట్టాల, టి.కొట్టాల గ్రామాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తే బాధితుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. తమ సొమ్ము పోస్టాఫీసులో అయితే భద్రంగా ఉంటుందని ఇక్కడ పొదుపు చేస్తే ఖాతాల్లో సిబ్బంది జమ చేయకపోవడంతో మోసపోయామని బాధితులు వాపోతున్నారు.
గతంలోనూ ఇలాంటి ఘటనలు
ఆళ్లగడ్డ పురపాలిక పరిధిలో పడకండ్ల గ్రామంలో ఒక బీబీఎం ఖాతాదారులకు చెందిన రూ.65 వేలను జమ చేయకుండా సొంతానికి ఉపయోగించుకున్నారు.
- ఆళ్లగడ్డ మండలంలోని ఆర్.కృష్ణాపురానికి చెందిన బీబీఎం ఒకరు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పే ఆర్డరు నకిలీ కాపీలను సృష్టించి డబ్బులను విత్డ్రా చేసుకున్న ఘటన జరిగింది.
- నందికొట్కూరు పరిధిలోని మల్యాల గ్రామ పోస్టాఫీసు పరిధిలో పొదుపు ఖాతాదారులకు చెందిన రూ.1.20 లక్షల సొమ్మును బీబీఎం పక్కదారి పట్టించారు.
కూడబెట్టిన సొమ్ము తినేశారు
నెలకు రూ.200 చొప్పున ఆర్డీ కట్టాను. ఎంతో కష్టపడి పొదుపు చేసిన సొమ్ము మరో నెలలో నా చేతికందుతుందని భావిస్తుంటే ఈ లోగా సొమ్మును ఖాతాలో వేయకుండానే పక్కదారి పట్టించారు. నేను చెల్లించిన సొమ్ముకు ఎవరు జవాబుదారీ వహిస్తారు. డబ్బుల్ని పూర్తిగా అధికారులు చెల్లించాలి.
వెంకటసుబ్బమ్మ, శ్రీరంగాపురం
నెలకు రూ.వెయ్యి చెల్లించాను
నెలకు రూ.1000 చొప్పున ఆర్డీ(రికరింగ్ డిపాజిట్)లో పొదుపు చేశాను. 9 నెలలుగా నా ఖాతాలో డబ్బు జమ కాలేదు. పోస్టాఫీసులో డబ్బు భద్రంగా ఉంటుందని భావించాను. కానీ ఇక్కడ కూడా ఇలా మోసం జరగడంతో మా వంటి పేద, మధ్య తరగతి వారు డబ్బులు ఎక్కడ పొదుపు చేయాలో అర్థం కాని స్థితి నెలకొంది.
వెంకటసుబ్బయ్య, శ్రీరంగాపురం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?