అతిసారం.. కలవరం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్ 32, మైనర్ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.
భయపెడుతున్న వరుస ఘటనలు
రామతీర్థంలో మహిళ మృతి
ఇస్వీలో 30 మందికి అస్వస్థత
ఆదోని నేరవార్తలు, న్యూస్టుడే
ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇస్వీ గ్రామస్థులు
- బనగానపల్లి మండలం రామతీర్థానికి చెందిన విజయమ్మ (30) వాంతులు, విరేచనాలతో ఈ నెల 16న మృతి చెందారు.. ఆ గ్రామంలో అతిసారం ప్రబలడంతో 16 మంది అస్వస్థతకు గురయ్యారు.
- బండిఆత్మకూరు మండలం యర్రగుంట్లలో అతిసారం ప్రబలడంతో గురువారం 16 మంది వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు.
- తాజాగా ఆదోని మండలం ఇస్వీలో అతిసారం ప్రబలి పదుల సంఖ్యలో గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపునొప్పితో బాధపడుతున్నారు. ఆదోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.
- ఇలా వరుస ఘటనలు పల్లె జనాలను భయపెడుతున్నాయి.. ఆయా గ్రామాల్లో ప్రజలు కలుషిత జలాలు తాగడంతోనే అతిసారం ప్రబలుతున్నట్లు తేలింది.. ఎన్నికల విధుల్లో ఉన్నతాధికారులు ఉండటం.. కిందిస్థాయి సిబ్బంది పట్టించుకోకపోవడంతో క్లోరినేషన్ ప్రక్రియ అటకెక్కింది.. మంచినీటిని శుద్ధిచేయకుండా నేరుగా అందజేస్తున్నారు. లీకేజీలనూ సరి చేయడం లేదు.
కాసుల్లేక బ్లీచింగ్ చల్లక
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.. ఇందులో మేజర్ 32, మైనర్ 941 వరకు ఉన్నాయి. 2021లో జరిగిన ఎన్నికల్లో 159 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఆర్థిక సంఘం, సాధారణ, సీనరేజీ నిధులు పంచాయతీలకు ప్రధాన ఆదాయం. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధుల్ని దారి మళ్లించింది. మురుగు కాల్వలను శుభ్రం చేసేందుకు సొమ్ముల్లేవు.. మంచినీటి పైప్లైన్ల మరమ్మతులకు పైసల్లేవు.. ఆఖరికి బ్లీచింగ్, ఫాగింగులకూ డబ్బులను వెతుక్కోవాల్సిన దుస్థితిని కల్పించారు. ఏ పని చేయడానికి కూడా సర్పంచుల దగ్గర సరిపడా సొమ్ముల్లేకుండా చేశారు.
నీరు.. తాగలేని తీరు
ఆదోని మండలం ఇస్వీలో అతిసారం ప్రబలడంతో 30 మందికిపైగా అస్వస్థతకు గురయ్యారు. గ్రామానికి చెందిన మహబూబ్బీ, ఇమామ్బీ, మాబీ, పార్వతమ్మ, శారదమ్మ, శివ, శశికళ, అంజలి, దూద్బీ, ఉసేన్బీ, దస్తగిరిమ్మ, రుబీనా, రాజేశ్వరి, రాజు, రంగన్నతో పాటు మరికొందరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మంచినీరు శుద్ధిచేయకుండా సరఫరా చేస్తున్నారు.. రంగుమారిన నీరు తాగడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘ మా గ్రామంలో రెండు రోజుల కిందట రంగుమారిన తాగునీరు సరఫరా చేశారు. వాటిని తాగడంతోనే నాతో పాటు కుటుంబంలో ఐదుగురం అస్వస్థతకు గురయ్యామని’’ పార్వతమ్మ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం