గేట్లు ఎత్తలేరు.. తాళ్లు బిగించలేరు
7.10 లక్షల ఎకరాలకు సాగునీరు.. వేలాది పల్లెలకు మంచినీరు అందించే సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణ అటకెక్కింది.. గత కొంతకాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు.
కాసులు ఇవ్వని ప్రభుత్వం
అధ్వానంగా జలాశయాల నిర్వహణ
కర్నూలు జలమండలి, న్యూస్టుడే : 7.10 లక్షల ఎకరాలకు సాగునీరు.. వేలాది పల్లెలకు మంచినీరు అందించే సాగు నీటి ప్రాజెక్టుల నిర్వహణ అటకెక్కింది.. గత కొంతకాలంగా ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు.. గేట్లకు రబ్బరు సీళ్లు అమర్చలేని పరిస్థితి నెలకొంది.. నీరంతా లీకేజీ అవుతోంది.. భారీగా వరదొస్తే కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.. నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.. ప్రభుత్వానికి నివేదికలు సమర్పిస్తున్నా.. అవన్నీ బుట్టదాఖలే అవుతున్నాయి. పోతిరెడ్డిపాడు, బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, సుంకేసుల బ్యారేజి, వెలుగోడు సమతుల జలాశయం, గాజులదిన్నె ప్రాజెక్టు, అవుకు, గోరుకల్లు జలాశయాల గేట్లు తుప్పు పట్టిపోయాయి.. రోప్స్ (తాళ్లు) తెగిపోయేందుకు సిద్ధంగా ఉన్నాయి..అయినా ప్రభుత్వం స్పందించడం లేదు.
వెలుగోడు వినేదెవరు
వెలుగోడు జలాశయం ద్వారా కర్నూలు, వైఎస్సార్ జిల్లాలో 2.60 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు వెళ్తోంది. ఇందులో 16.950 టీఎంసీల నీటిని నిల్వ చేసి తెలుగుగంగ కాల్వ ద్వారా తరలిస్తారు. జలాశయానికి సంబంధించి మూడు గేట్లకు రెగ్యులర్గా గ్రీజ్, గేర్ ఆయిల్ సమకూర్చకపోవడంతో మొండికేస్తున్నాయి. ఏటా కనీసం రూ.22 లక్షలు కేటాయిస్తే జలాశయం నిర్వహణ చేసేందుకు అవకాశముంటుందని నిపుణులు చెబుతున్నారు.
సుంకేసుల విలవిల
సుంకేసుల జలాశయం ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ జిల్లాలో 2.75 లక్షల ఎకరాలకు సాగు నీరు, కాల్వ వెంట పలు గ్రామాల దాహార్తి తీర్చుతోంది.. కీలకమైన ప్రాజెక్టుపై ప్రభుత్వం శీతకన్నేసింది.. నిర్వహణకు సంబంధించి రూ.72 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. మూడేళ్లుగా విడుదల చేయడం లేదు. రూ.1.65 కోట్ల వరకు విద్యుత్తు బిల్లుల బకాయి ఉంది. నిధుల విడుదల లేకపోవడంతో మరమ్మతులు చేసేందుకు గుత్తేదారులు ముందుకు రావడం లేదు. ఈ ఏడాది జలాశయానికి అవసరమైన రోప్స్ ఏర్పాటు చేసేందుకు అధికారులు గుత్తేదారుడిని ప్రాధేయపడి రూ.2.50 లక్షలతో ఏర్పాటు చేశారు. 1.200 టీఎంసీల సామర్థ్యమున్న బ్యారేజీకి 30 ద్వారాలున్నాయి. ఏళ్ల కిందట ఏర్పాటుచేసిన విద్యుత్తు కేబుళ్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాల్సి ఉంది. నిరంతరం గ్రీజ్, ఆయిల్ మార్చుతూ ఉండాలి. ఇక్కడ సీల్ రబ్బర్లు సరిగా లేకపోవడంతో గేట్ల నుంచి నిరంతరం నీరు లీకేజీ అవుతోంది. ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వకపోవడంతో ఇంజినీర్లు తమ జేబు నుంచి ఖర్చు చేసే పరిస్థితి నెలకొంది.
ఘోరకల్లు
12.440 టీఎంసీల సామర్థ్యం కలిగిన గోరుకల్లుకు మూడు గేట్లు ఉన్నాయి. వీటిలో రెండే పనిచేస్తుండగా ఒకటి నిర్మాణ దశలోనే నిలిచింది. కొత్త గేటు ఏర్పాటు చేయలేదు.. గత నాలుగేళ్లుగా జలాశయంలో నీటిని నిల్వ చేస్తున్నప్పటికీ నిర్వహణ నిధుల విడుదల కావడం లేదు.
పోతిరెడ్డిపాడైంది
పోతిరెడ్డిపాడు గేట్లకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయకపోవడంతో ఒక గేట్ను పైకిఎత్తలేని పరిస్థితి నెలకొంది.
రాయలసీమ జిల్లాలకు పోతిరెడ్డిపాడు నియంత్రణ వ్యవస్థ ద్వారా కృష్ణా జలాలు తరలిస్తారు. ఇక్కడ 10 గేట్లు ఉన్నాయి. నిత్యం 44 వేల క్యూసెక్కుల వరద జలాలు దిగువకు వెళ్తాయి. బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్, వెలుగోడు జలాశయానికి ఎస్సార్బీసీ ఎస్కేప్ ఛానల్ ద్వారా నీరు వెళ్తుంది. ఎస్కేప్ ఛానల్ వద్ద ఏర్పాటుచేసిన గేట్లలో రెండు సరిగా పనిచేయడం లేదు. నిర్వహణ నిధులు రాకపోవడంతో మరమ్మతులు చేయలేని పరిస్థితి. దీంతో నీటి లీకేజీని అరికట్టలేకపోతున్నారు. ఐదు పాత గేట్లకు మరమ్మతులు చేయకపోవడంతో లీకేజీ ఏటేటా పెరుగుతోంది. ఇంజినీర్ల బృందం ఏటా తనిఖీలు నిర్వహించి నివేదికలు అందిస్తోంది. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పోతిరెడ్డిపాడు గేట్ల నిర్వహణకు సంబంధించి గతంలో చేసిన పనులకు రూ.52 లక్షల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పాత బిల్లులు చెల్లిస్తే తప్ప కొత్తగా పనులు చేసేందుకు గుత్తేదారులు ముందుకొచ్చే పరిస్థితి లేదు.
అవుకు అధోగతి
నిర్వహణలేకపోవడంతో తుప్పుపట్టిన అవుకు జలాశయం గేట్లు
4.150 టీఎంసీల సామర్థ్యం కలిగిన అవుకు జలాశయానికి ఏర్పాటు చేసిన ఆరు గేట్లలో రెండు నాలుగున్నర ఏళ్లుగా పనిచేయడం లేదు. వీటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసేందుకు రూ.1.60 కోట్లతో చేపట్టిన నిర్వహణ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఈ జలాశయం ద్వారా 3,200 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. అవుకు జలాశయం నిర్వహణకు ఏళ్ల తరబడి నిధులు విడుదల కావడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!