ధీమా ఇవ్వని బీమా
వన నిర్మాణ రంగంలోని కార్మికులు ఏ రోజుకారోజు కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. ఎక్కువ మంది ఈ రంగంలోనే ఉపాధిని పొందుతున్నారు. ఈ జీవనయానంలో ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యం వల్ల చనిపోయినా, ఇతర కారణాల వల్ల వైకల్యం పొందినా.
కార్మికులకు కానరాని అభయం
2020 నుంచి సాయం శూన్యం
కేవలం గుర్తింపు కార్డుగా మాత్రమే పనికి వస్తున్న సంక్షేమ బోర్డు కార్డు
ఆళ్లగడ్డ, న్యూస్టుడే: భవన నిర్మాణ రంగంలోని కార్మికులు ఏ రోజుకారోజు కష్టాన్నే నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. ఎక్కువ మంది ఈ రంగంలోనే ఉపాధిని పొందుతున్నారు. ఈ జీవనయానంలో ఏదైనా ప్రమాదం జరిగినా, అనారోగ్యం వల్ల చనిపోయినా, ఇతర కారణాల వల్ల వైకల్యం పొందినా..ఆ కుటుంబం రోడ్డున పడినట్లే. స్వేదాన్ని చిందించి సంపాదించిన డబ్బుతో కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా మారుతున్న నేడు ఏదైనా జరగరానిది జరిగి నష్టం కలిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం సకాలంలో స్పందించడం లేదు. భవన నిర్మాణ కార్మికుల శ్రేయస్సుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నాయి. వారి సంక్షేమానికి ప్రత్యేక బోర్డు కూడా ఏర్పాటు చేశారు. నాలుగేళ్లుగా ఈ బోర్డు కేవలం పేరుకే పరిమితమైంది తప్ప కార్మికుల సంక్షేమానికి ఉపయోగపడటం లేదు. 2020 నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు అందకపోవడంతో కార్మికులకు ఒక్క పైసా కూడా కష్టకాలంలో చెల్లించలేని దుస్థితి నెలకొంది.
1.40 లక్షల మంది సభ్యులున్నా.. సాయం సున్నా
భవన నిర్మాణ రంగంలోని మేస్త్రీలు, స్లాబ్ వర్కర్లు, వడ్రంగి, ఎలక్ట్రీషియన్లు, పాలిష్ కట్టింగ్ వర్కర్లు, పెయింటర్లు, పీవోవీ వర్కర్లు ఇలా 62 విభాగాలకు చెందిన వారు ఉమ్మడి జిల్లాలో 1.40 లక్షల మంది కార్మికులు కార్మిక సంఘంలో సభ్యులుగా ఉన్నారు. వారంతా రూ.110 చొప్పున బీమా చెల్లించి సభ్యులుగా చేరారు. వారు బీమా కోసం చెల్లించిన మొత్తమే రూ.15 కోట్ల వరకు ఉంది. బీమా చెల్లించిన కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5.20 లక్షలు, సాధారణ మరణానికి రూ.80 వేలు, శాశ్వత వైకల్యానికి రూ.5 లక్షలు, పిల్లల కాన్పులకు రూ.20వేలు (రెండు కాన్పులకు), వైకల్యం, అనారోగ్యం బారిన పడి పనిచేయలేని కార్మికులకు రోజుకు రూ.200 చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.3వేలు, చికిత్సకు రూ.9వేలు చెల్లించాలి. గత ప్రభుత్వ హయాంలో బీమా సొమ్ము సక్రమంగానే అందేది. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక విక్రయాల నిషేధంతో భవన నిర్మాణ రంగంలోని కార్మికులకు కష్టాలు మొదలయ్యాయి. ఉపాధికి దూరమయ్యారు. మరోవైపు 2020లో కొవిడ్ మహమ్మారి విజృంభణతో ఈ రంగం కుదేలైంది. ఇలాంటి సమయంలో కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కొందరు కొవిడ్తో మృతి చెందారు. కష్టాల్లో ఉన్న కార్మికులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న రూ.1950 కోట్ల బీమా సొమ్మును సొంత అవసరాలకు మళ్లించింది. కార్మికులు మరణించినా, గాయపడినా, రోగాలబారిన పడ్డా, పిల్లల వివాహాలకు, ప్రసవాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. వైఎస్ఆర్ బీమా కింద సాయం పొందని వారికి మాత్రమే తాము సాయం చేస్తామని సంక్షేమ బోర్డు అంటోంది.
రుద్రవరం మండలం నరసాపురానికి చెందిన ఇమామ్ 30 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు. ఆళ్లగడ్డకు చెందిన తాపీమేస్త్రీల సంఘం మృతుడి కుటుంబానికి సొంతంగా రూ.10 వేల ఆర్థికసాయం అందించింది. దాతలు స్పందించినా ప్రభుత్వం స్పందించలేదు.
ఈ ఏడాది మార్చి 30న తాపీమేస్త్రీ డి.రాజాహుస్సేన్(30) దొర్నిపాడులో భవన నిర్మాణంలో భాగంగా సెంట్రింగ్ పనులు చేస్తుండగా విద్యుత్తు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. ఆయనపై ఆధారపడిన కుటుంబం దిక్కులేనిదయ్యింది.
గతేడాది జూన్లో ఆళ్లగడ్డ మండలంలోని జి.జంబులదిన్నెకు చెందిన సయ్యద్ బాషా భవన నిర్మాణ పనులు చేస్తూ గోడపై నుంచి కింద పడి మృతి చెందారు. పెద్దదిక్కుగా ఉన్న ఆయన చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడింది. భవన నిర్మాణ కార్మికుడిగా 22 ఏళ్లుగా పనిచేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీసం మట్టిఖర్చులకు కూడా ఆర్థిక సాయం అందకపోవడం బాధాకరం.
మాకు మేమే సాయం చేసుకుంటున్నాం
-షాకీర్, విద్యుత్తు కార్మికుల సంఘం కార్యదర్శి
గత కొన్నేళ్లుగా మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు ఏదైనా సాయం అందుతుందన్న ఉద్దేశంతో ఆళ్లగడ్డలో మా సంఘం తరఫున 80 మందితో రూ.110 చెల్లించి బీమా చేయించాం. ఎలాంటి సాయం అందడం లేదు. మా సంఘంలోని సభ్యులు ఎవరైనా ప్రమాదానికి గురైతే మేమే తలా కొంత పోగు చేసుకుని బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం