ఉద్యోగుల భవన్ అమ్మేశారు.. నాలుగో తరగతి వేతనజీవుల ఆందోళన
ఉద్యోగుల సంక్షేమం నిమిత్తం 40 ఏళ్ల కిందట మూడు సెంట్లు కేటాయించారు. అక్కడ నాలుగో తరగతి ఉద్యోగులు భవనం నిర్మించారు. ఏళ్లుగా అక్కడే సభలు, సమావేశాలు నిర్వహించుకొంటున్నారు.
భవనాన్ని కూల్చివేస్తున్న జేసీబీ
నంద్యాల పట్టణం, న్యూస్టుడే : ఉద్యోగుల సంక్షేమం నిమిత్తం 40 ఏళ్ల కిందట మూడు సెంట్లు కేటాయించారు. అక్కడ నాలుగో తరగతి ఉద్యోగులు భవనం నిర్మించారు. ఏళ్లుగా అక్కడే సభలు, సమావేశాలు నిర్వహించుకొంటున్నారు. స్థిరాస్తి వ్యాపారులకు మేలు చేసేందుకు భవనాన్ని అమ్మేశారు.. రూ.1.5 కోట్ల విలువైన డీపట్టా స్థలం విక్రయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఉద్యోగుల సంఘం అవసరాల నిమిత్తం ప్రభుత్వం స్థలం కేటాయిస్తే స్వప్రయోజనాల కోసం కొందరు ఉద్యోగులు ఇతరులకు విక్రయించడం వివాదాస్పదంగా మారింది.
రూ.80 లక్షలకు బేరం
నంద్యాల పట్టణం టెక్కె ప్రాంతంలో ప్రస్తుతం సెంటు స్థలం రూ.50 లక్షలు పలుకుతోంది. తహసీల్దారు కార్యాలయం ప్రాంతంలో ఉన్న ఉద్యోగుల భవన్ వెనుక ప్రైవేటు వ్యక్తులకు స్థలం ఉంది. దానికి విలువ రావాలన్నా.. అందులో ఏవైనా నిర్మాణాలు చేపట్టాలన్నా ఉద్యోగుల భవనం అడ్డుగా ఉంది. దాన్ని తొలగించుకోవడానికి ప్రైవేటు స్థలం వ్యక్తులు చాలా కాలం నుంచి యత్నించారు. భవనాన్ని ఖాళీ చేస్తే మరో చోట స్థలం కేటాయిస్తామని మొదట చెప్పారు.. ఆ ప్రయత్నాలు ఫలించలేదు.. చివరకు నూతన కార్యవర్గం ఏర్పాటైన తర్వాత ఏకంగా భవనంతో సహా ఈ స్థలాన్ని అమ్మేశారు. రూ.80 లక్షల వరకు చేతులు మారినట్లు తెలుస్తోంది. కొనుగోలు చేసిన వ్యక్తులు భవనం కూల్చివేస్తున్నారు. పని పూర్తికాగానే వెనుకున్న స్థలానికి రహదారి ఏర్పాటు చేసుకుని ఇందులో పెద్ద వాణిజ్య సముదాయాన్ని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
దుకాణందారుల ఆందోళన
నంద్యాల పట్టణంలో 2017లో రహదారుల విస్తరణ చేపట్టారు. అప్పట్లో భవనాన్ని కొంతమేర కూల్చారు. అందుకు నష్ట పరిహారం కింద ప్రభుత్వం రూ.18 లక్షల పరిహారం ఇచ్చింది. ఆ మొత్తాన్ని ఉద్యోగుల సంఘానికి అందజేశారు. ఆ తర్వాత భవనాన్ని ఆధునికీకరించారు. కింద దుకాణ గదులు నిర్మించి పైఅంతస్తులో జిల్లా ఉద్యోగుల భవన్ను ఏర్పాటు చేశారు. దుకాణాలను అద్దెకు ఇచ్చారు. మూడేళ్ల పాటు ఒప్పందం కుదుర్చుకున్నాం.. ప్రస్తుతం కూల్చి వేస్తున్నారు.. తమ పరిస్థితేంటని దుకాణదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ముగ్గురు ముందుండి నడిపారు
ఉద్యోగుల భవన్ విక్రయం వెనుక కొంత మంది వ్యూహాత్మకంగా వ్యవహరించారు. ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ముందుగానే కార్యవర్గంతో సంతకాలు చేయించుకున్నారు. ఇందులో ముగ్గురు ఉద్యోగులు కీలకపాత్ర పోషించారు. 40 ఏళ్ల కిందట స్థలాన్ని కేటాయించే సమయంలో ప్రభుత్వం నుంచి ఉచితంగా భూమిని తీసుకోలేదని.. అప్పటి మార్కెట్ విలువ ప్రకారం కొనుగోలు చేశామనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై కార్యవర్గానికి సర్వహక్కులు ఉన్నాయని, కమిటీ సభ్యుల అంగీకారంతోనే విక్రయించినట్లు దస్త్రాలు తయారు చేశారు. ఆ తర్వాత విక్రయించారు. క్రయవిక్రయాలన్నీ కొంతమంది వ్యాపారుల కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్