తుంగభద్రలో మారీచ్లపై నిఘా
గత నాలుగేళ్లుగా తుంగభద్రలో ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టారు.. ఇసుకాసురులు పెద్ద ఎత్తున ఇసుకను తరలించారు.. వారికి ‘అధికార’ పార్టీ అండదండలు ఉండటంతో నదిలో రాజ్యమేలారు.. అధికారులూ అటు వైపు వెళ్లలేదు..
రెండు రోజులుగా కలెక్టర్ తనిఖీ
కర్నూలు సచివాలయం, న్యూస్టుడే
సి.బెళగల్: కె.శింగవరంలో ఇసుక రీచ్లో పరిశీలిస్తున్న కలెక్టర్ డా.జి.సృజన
గత నాలుగేళ్లుగా తుంగభద్రలో ఇష్టానుసారంగా తవ్వకాలు చేపట్టారు.. ఇసుకాసురులు పెద్ద ఎత్తున ఇసుకను తరలించారు.. వారికి ‘అధికార’ పార్టీ అండదండలు ఉండటంతో నదిలో రాజ్యమేలారు.. అధికారులూ అటు వైపు వెళ్లలేదు.. తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో అధికారుల్లో కదలిక వచ్చింది.. తుంగభద్ర తీరంలో ఇసుక రీచ్లను గత రెండు రోజులుగా కలెక్టర్ డా.సృజన పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి ఇసుక అక్రమ రవాణా వివరాలు సేకరించారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు కలెక్టర్ డా.జి.సృజన గత రెండు రోజులుగా ఇసుక రీచ్లను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. కౌతాళం మండలంలోని గుడికంబాళి, మరళి గ్రామాల్లో ఆదివారం పరిశీలించారు. సి.బెళగల్ మండలంలోని కె.సింగవరం, ఈర్లదిన్నె, ముడుమాల, పల్దొడ్డి గ్రామాల్లోని ఇసుక రీచ్లను ఆమె సోమవారం తనిఖీ చేశారు. ఆయా ప్రాంత గ్రామస్థులు, గొర్రెల కాపరులతో మాట్లాడారు. ఎంతకాలం నుంచి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.. లారీలు, టిప్పర్లలో అక్రమ రవాణా జరుగుతోందా.. ప్రస్తుతం ఏమైనా తవ్వకాలు చేస్తున్నారా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇసుక తవ్వకాలు.. అక్రమంగా రవాణా చేసిన ఆనవాళ్లను గుర్తించారు. రీచ్ల్లో ఎంతమేర ఇసుక తవ్వకాలు జరిగాయో నివేదికలివ్వాలంటూ మైనింగ్ అధికారులను ఆదేశించారు. ఇసుక రీచ్లో టాటా ఇటాచీ ఎందుకుందని ఆరా తీశారు. పొక్లెయిన్లు తదితర వాహనాలను బయటకు పంపాలని ఆదేశించారు.
సీసీ కెమెరాలు తప్పనిసరి
- ఇసుక తవ్వకాలను ఎప్పటికప్పుడు అడ్డుకునేందుకు ఇసుక రీచ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. సదరు ప్రదేశంలో నిర్ణీత సమయంలోనే ఇసుక సేకరించాలి. లారీలు, టిప్పర్లు, పొక్లెయిన్లు వెళ్లే దారిలోనూ సీసీ కెమెరాలు ఉండాలి. నిబంధనలకు విరుద్దంగా లారీలో అధికంగా ఇసుక తరలించకూడదు. అలా తరలిస్తే సంబంధిత లారీలపై చర్యలు తీసుకొని జరిమానా విధించాల్సి ఉంటుంది.
- పోలీసు, రెవెన్యూ సిబ్బంది సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని.. నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి ఇసుక అక్రమ తవ్వకాలు జరిగినా కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
- పల్దొడ్డి గ్రామ నది తీరంలోని ఇసుక రీచ్లో మోటార్లు ఉండటాన్ని గమనించిన కలెక్టర్.. వాల్టా చట్టం ప్రకారం మోటార్ల ద్వారా నీటిని తోడేయడం చట్ట విరుద్ధమన్నారు. వెంటనే మోటార్లను తొలగించాలని సి.బెళగల్ తహసీల్దారును ఆదేశించారు.
సుప్రీంకోర్టు ఆగ్రహంతో కదలిక
ఇసుక అక్రమ తవ్వకాలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము ఆదేశించినా చర్యలు తీసుకోకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలెక్టర్ల నేతృత్వంలో పోలీసులు, మైనింగ్, రెవెన్యూ తదితర విభాగాల అధికారులతో కమిటీలు ఏర్పాటుచేసి అక్రమ ఇసుక తవ్వకాలు ఆపేయాలని ఆదేశించింది. ఈ కమిటీలోని అధికారులు ప్రభుత్వ అధికారుల్లాకాక సుప్రీంకోర్టు నియమించిన అధికారుల్లా వ్యవహరించి ఇసుక అక్రమాలపై కఠినచర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం