పట్టణాలను ముంచెత్తుతోంది
మున్సిపాలిటీల్లో ప్రజల ముక్కుపిండి రూ.11.71 కోట్ల మేర చెత్త పన్ను వసూలు చేశారు.. ఆస్తి, నీటి తదితర పన్నుల రూపంలో రూ.120- రూ.150 కోట్ల మేర ఆదాయం వస్తోంది.. ప్రజల ఆరోగ్యాన్ని ‘చెత్త’లో వదిలేశారు.
కానరాని శుద్ధి ప్రక్రియ
ఎన్జీటీ ఆదేశాలు బేఖాతర్
ఆదోని, నంద్యాల పురపాలకం, కర్నూలు నగరపాలక, న్యూస్టుడే
ఆదోని కంపోస్టుయార్డులో గుట్టలుగా పేరుకుపోయిన చెత్త
మున్సిపాలిటీల్లో ప్రజల ముక్కుపిండి రూ.11.71 కోట్ల మేర చెత్త పన్ను వసూలు చేశారు.. ఆస్తి, నీటి తదితర పన్నుల రూపంలో రూ.120- రూ.150 కోట్ల మేర ఆదాయం వస్తోంది.. ప్రజల ఆరోగ్యాన్ని ‘చెత్త’లో వదిలేశారు. టన్నుల్లో చెత్త పోగవుతోంది.. శుద్ధి పనులు చేపట్టాలి.. డంపింగ్ యార్డులు ఖాళీ చేయాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆదేశించింది.. ఏకంగా కర్నూలు నగరపాలక సంస్థకు జరిమానా విధించింది.. అయినా పుర అధికారుల్లో కదలికలేదు.. గుట్టలుగా పేరుకుపోయిన చెత్త ప్రజల ప్రాణానికి కుంపటిలా మారింది.
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని తొమ్మిది మున్సిపాలిటీల పరిధిలో నిత్యం 500 మెట్రిక్ టన్నుల మేర చెత్త పోగవుతోంది. టన్నుల మేర పోగవడంతో పరిసర ప్రాంతాలు కాలుష్యంబారిన పడుతున్నాయి. వీటిని శుద్ధి చేయాలని ఎన్జీటీ హెచ్చరించింది. ఎన్జీటీ ఆదేశాల మేరకు డంపింగ్ యార్డులో చెత్తనంతా శుద్ధి చేయాలి.. అక్కడున్న మట్టిని తొలగించి కొత్తది వేసి మొక్కలు నాటాల్సి ఉంటుంది.
అందుకు నిధుల్లేవని పురపాలక సంఘాలు ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. కేంద్రం ముందుకొచ్చి 15వ ఆర్థిక సంఘం నిధుల్లోంచి 35 శాతం మేర వెచ్చించి పనులు చేపట్టాలని సూచించింది. యూఎల్బీ (పురపాలికల) వాటా చెల్లించకపోవడంతో పనులు నత్తను తలపిస్తున్నాయి. గతంలో 13వ ఆర్థిక సంఘం నిధులతో చెత్త శుద్ధికి సంబంధించిన నిర్మాణాలు, ఏర్పాట్లు చేసుకోవాలని.. అందుకు నిధులు పూర్తిగా వినియోగించుకోవాలని సూచించారు. నాడు చాలా పురపాలికల్లో వీటిపై వెచ్చించిన నిధులు వృథా అయ్యాయి.
ప్రజల ఆరోగ్యంపై ప్రభావం
ఏళ్ల తరబడి చెత్త పోగవడంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. డంపింగ్ యార్డుల చుట్టూ కి.మీ. మేర నీరు కలుషితమవుతోంది. డంపింగ్ యార్డుకు సమీపంలో బోరుబావులు తవ్విస్తే రంగు మారిన నీరు వస్తోంది.
గడువు గడబిడ
ఆదోని పట్టణ శివారులోని జాతీయ రహదారికి సమీపంలో డంపింగ్ యార్డులో 40 వేల మెట్రిక్ టన్నుల చెత్త పోగైంది. శుద్ధి చేసేందుకు మహారాష్ట్రకు చెందిన ఓ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు. ఇందుకు రూ.2.25 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఐదారు నెలల్లో పనులు పూర్తిచేసేలా 2022లో ఒప్పందం చేసుకొన్నారు. నేటికీ 30 శాతం చెత్తను మాత్రమే శుద్ధి చేశారు. ప్రస్తుతం పనులు నిలిచిపోయాయి. జూన్ లోపు పూర్తి చేయాలని గడువు విధించారు.
కుందూ కలుషితం
నంద్యాల పట్టణం భీమవరం రహదారిలోని డంపింగ్ యార్డులో 66 వేల మెట్రిక్ టన్నుల చెత్త పోగైంది. 2022 జనవరిలో చెత్త శుద్ధి పనులు చేపట్టారు. మూడు నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యం నిర్దేశించారు. ఇందుకు రూ.5 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 30 శాతం చెత్త శుద్ధి చేసినట్లు అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఎక్కడపడితే అక్కడ చెత్త పారబోస్తున్నారు. కుందూ నది తీర ప్రాంతంలో 1,500 లారీల చెత్త వేశారు.. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నదిలోకి నీరంతా వెళ్లి కలుషితం అవుతోంది.
నగరం.. నరకం
కర్నూలు నగరంలో నిత్యం 181 టన్నుల చెత్త ఉత్పత్తవుతోంది. నగర శివారులో గార్గేయపురం గ్రామ సమీపంలో చెత్త తెచ్చి పారబోస్తున్నారు. ఇప్పటి వరకు శుద్ధి ప్రక్రియ ఊసే లేకుండాపోయింది. ఇక్కడ లక్ష మెట్రిక్ టన్నులకుపైగా చెత్త పోగైంది. గుట్టలుగా చెత్త పోగవడంతో కాలుష్యం బారిన పడుతున్నామని గ్రామస్థులు పలుమార్లు ఆందోళన చేపట్టారు. అయినా అధికారులు మేల్కొనడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల