అభిషేకం.. ఆంక్షలు
శ్రీశైల ఆలయ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.. మల్లన్న అభిషేకానికి వచ్చిన భక్తులపై అదనపు భారం మోపారు. ఒక్కో భక్తుడు రూ.300 టికెట్లను రెండేసి కొనుగోలు చేస్తేనే మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం ఉంటుందని చెప్పడం వివాదాస్పదమైంది.
మల్లన్న భక్తులపై బాదుడు
వెబ్సైట్లో టికెట్ల నిలిపివేత
రూ.300 టికెట్లు రెండేసి తీసుకోవాలని సేవాకర్తల పిల్లలు, కుటుంబ సభ్యులను క్యూలైన్ నుంచి బయటకు పంపిస్తున్న సిబ్బంది
ఈనాడు, కర్నూలు శ్రీశైలం ఆలయం, న్యూస్టుడే: శ్రీశైల ఆలయ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.. మల్లన్న అభిషేకానికి వచ్చిన భక్తులపై అదనపు భారం మోపారు. ఒక్కో భక్తుడు రూ.300 టికెట్లను రెండేసి కొనుగోలు చేస్తేనే మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం ఉంటుందని చెప్పడం వివాదాస్పదమైంది. స్వామి అభిషేకం కోసం రూ.1,500 టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.. ఇందుకు అనుసంధానంగా రూ.500 టికెట్ తీసుకోవాలి.. అభిషేకానంతర దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఎనిమిదేళ్ల నుంచి అమల్లో ఉన్న ఈ విధానం వల్ల దంపతులు అభిషేకం టికెట్లు కొనుగోలు చేసి తమ ఇద్దరు పిల్లలు లేదా కుటుంబ సభ్యుల్లో ఇద్దరిని స్వామివారి స్పర్శ దర్శనానికి తీసుకెళ్లేవారు. గత రెండు రోజుల నుంచి శ్రీశైల దేవస్థానం అధికారులు అధికారిక వెబ్సైట్లో కొన్ని మార్పులను తీసుకొచ్చారు. ఆదివారం రాత్రి నుంచి దేవస్థానం వెబ్సైట్లో రూ.500 అభిషేకానంతర దర్శనం ఆప్షన్ను తొలగించారు. దీంతో అభిషేకానికి వచ్చిన సేవాకర్తలు తమ పిల్లలు, కుటుంబ సభ్యులకు అభిషేకానంతర దర్శనం టిక్కెట్లు పొందలేకపోయారు.
దోపిడీకి అడ్డుకట్ట వేస్తున్నామంటూ
కొన్ని ఇంటర్నెట్ సెంటర్ల యాజమాన్యాలు ‘అభిషేక అనంతర దర్శనం’ టికెట్లను బుక్ చేసి అక్రమాలకు తెర తీశారని తెలుసుకున్న అధికారులు వెంటనే సరిదిద్దే చర్యలకు ఉపక్రమించారనే ప్రచారం జరుగుతోంది. ఇంటర్నెట్ కేంద్రాల నిర్వాహకులు అభిషేక అనంతరం దర్శన టికెట్లు ఆన్లైన్లో బుక్ చేసి ఎక్కువ ధరలకు ఇతరులకు విక్రయించి దోపిడీలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు ప్రత్యామ్నాయ పద్ధతులకు తెరలేపారంటున్నారు.శ్రీశైలంలో సేవల టికెట్లు రోజుకు ఒక లాగిన్ ఐ.డి. నుంచి రెండు మాత్రమే ఇచ్చేలా చర్యలు చేపట్టారు. ఫలితంగా ఒకే లాగిన్ ఐ.డి. నుంచి వందలాది టికెట్లు బుక్ చేసే నెట్ సెంటర్ల నిర్వాహకుల ధన దాహానికి అడ్డుకట్ట పడినట్లవుతుందని భావిస్తున్నారు.
అధికారుల ఏకపక్ష నిర్ణయం
శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తులకు అవసరమైన ఆన్లైన్ సేవల్ని తాము ఉచితంగా అందిస్తామని 2021లో ఓ ప్రైవేటు సంస్థ ముందుకు వచ్చింది. సుమారు రూ.40 లక్షల వరకు వ్యయమయ్యే అంతర్జాల చిరునామా రూపకల్పనను ఉచితంగా చేస్తామని చెప్పడంతో ఆ సంస్థకే సేవల టికెట్ల జారీ, అంతర్జాల చిరునామా నిర్వహణ బాధ్యతలను అప్పగించారు. ఆమేరకు అధికారిక ఒప్పందం చేసుకున్నారు. దేవస్థానం అధికారులు ఎలాంటి టెండర్ల ప్రక్రియ నిర్వహించకుండా ఏకపక్షంగా ఆ ఒప్పందం చేసుకోవడం గమనార్హం. ఓ మంత్రి సిఫార్సులు, అండదండలు పుష్కలంగా ఉండటంతో ఆ సంస్థ ప్రతినిధులదే ఇష్టారాజ్యమన్నట్లుగా మారిందనే ప్రచారం జరుగుతోంది. ఆ మంత్రి ఒత్తిడి కారణంగానే దేవస్థానం అధికారులు కూడా ఆ ప్రైవేటు సంస్థతో సేవల టికెట్ల విక్రయాలకు సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
సాంకేతిక లోపమంటూ దాటవేసే ప్రయత్నం
వెబ్సైట్లో అభిషేకానంతర దర్శనం టికెట్లు లేకపోతే తమను బాధ్యుల్ని చేస్తారా..? అని కొందరు భక్తులు మండిపడ్డారు. దేవస్థానం అధికారులు రోజుకో నిబంధన అమలు చేస్తూ భక్తుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహ వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా, దేవస్థానం అధికారులు కొత్త నిర్ణయాలు తీసుకోవడం విమర్శలకు దారితీస్తోంది. వెబ్సైట్ నిర్వహణ వల్ల భక్తులకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ దేవస్థానం అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. సాంకేతిక లోపం వల్లే రూ.500 అభిషేకానంతర టిక్కెట్లు వెబ్సైట్లో భక్తులకు లభించలేదని దేవస్థానానికి చెందిన ఐటీ విభాగం సిబ్బంది ఒకరు ‘న్యూస్టుడే’కు తెలిపారు. సోమవారం సాయంత్రానికి కూడా దేవస్థానం వెబ్సైట్లో రూ.500 అభిషేకానంతర టికెట్లు అందుబాటులోకి రాలేదు. వెబ్సైట్లో నెలకొన్న సమస్య వల్ల అభిషేకం నిర్వహించుకోవాలనుకునే సేవాకర్తలకు ఇబ్బందులు తప్పేటట్లు లేవు.
భక్తుల ఆగ్రహం
స్వామి దర్శనానికి తమ కుమారుడికి రూ.300 టికెట్లు రెండు కొన్నానని చెబుతున్న భక్తులు
మల్లన్న దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు. చాలా మంది దంపతులు రూ.1500 అభిషేకం టికెట్లు కొని ఉదయం ఆలయ క్యూలైన్ల వద్దకు చేరుకున్నారు. అభిషేకానంతర టికెట్లు లేని పక్షంలో, అందుకు ప్రత్యామ్నాయంగా ఒక్కొక్కరికీ రూ.300 టిక్కెట్లు రెండేసి చొప్పున కొనుగోలు చేస్తేనే స్పర్శ దర్శనానికి అనుమతిస్తామని సిబ్బంది చెప్పడంతో భక్తులు కంగుతిన్నారు. రూ.300 టికెట్లను సమీపంలోని కౌంటర్ల వద్ద తెచ్చుకోవాలని భక్తులను బయటకు పంపించారు. చేసేది లేక అదనంగా రెండేసి కొనుగోలు చేసి పిల్లలు, బంధువులతో కలిసి స్వామి దర్శనానికి వెళ్లారు. రూ.300 టిక్కెట్లను రెండేసి చొప్పున కొనుగోలు చేయడం వల్ల ఒక్కో భక్తుడిపై అదనంగా రూ.100 భారం పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం