నల్లమలను చూసొద్దాం రండి
ఈసారి వేసవి సెలవులు వచ్చినా.. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు.. మరోవైపు ఎన్నికల వేడి వల్ల చాలామంది విహార యాత్రలకు వెళ్లలేకపోయారు.
వినోదం.. విజ్ఞానం పంచే అందమైన పర్యాటక ప్రాంతం
మరిచిపోలేని అనుభూతులు మిగిల్చే జంగిల్ సఫారీ
ఆత్మకూరు, న్యూస్టుడే : ఈసారి వేసవి సెలవులు వచ్చినా.. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు.. మరోవైపు ఎన్నికల వేడి వల్ల చాలామంది విహార యాత్రలకు వెళ్లలేకపోయారు. దీంతో పిల్లలు నిరుత్సాహానికి గురయ్యారు. ఇటీవలే ఎన్నికలు ముగిశాయి.. ప్రస్తుతం వర్షాలతో వాతావరణం చల్లబడింది. దీంతో మిగిలిన కొద్ది రోజులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేందుకు జనం సన్నద్ధం అవుతున్నారు. విహార యాత్రలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అలాంటి వారు వ్యయ ప్రయాసలకోర్చి దూర ప్రాంతాలకు వెళ్లేకంటే.. మన చెంతనే ఉన్న నల్లమలను సందర్శిస్తే మంచి అనుభవం.. గుర్తుండిపోయే అనుభూతులు సొంతమవుతాయి. అడవంటే ఇంత అందంగా ఉంటుందా అనుకునేలా నల్లమల కనువిందు చేస్తుంది. ఇక్కడున్న జంగిల్ సఫారీ, ఎకోటూరిజం, జీవవైవిధ్య కేంద్రాలు పర్యాటకులకు వినోదంతో పాటు విజ్ఞానాన్ని పంచుతాయి.
ఆదిమానవుల జీవన విధానం
దేశంలోనే పెద్ద పులుల అభయారణ్యం
దేశంలోని పలుల అభయాణ్యాల్లో నల్లమల అతి పెద్దదిగా ఖ్యాతి గాంచింది. 2022 గణన ప్రకారం నల్లమలలో 75 పులులు ఉన్నట్లు ఎన్ఎస్టీఆర్ (నాగార్జున సాగర్- శ్రీశైలం టైగర్ రిజర్వ్) నిర్ధారించింది. జంగిల్ సఫారీకి వెళ్లే పర్యాటకులకు అప్పుడప్పుడు పులులు తారసపడుతుంటాయి.
పర్యాటకులకు ప్రత్యేక వసతులు
2017 నుంచి అటవీ శాఖ నల్లమల సందర్శనకు అవకాశం కల్పించింది. నల్లమలలోని బైర్లూటి, సిరివెళ్ల సమీపంలోని పచ్చర్ల వద్ద ఎకోటూరిజం జంగిల్ సఫారీ క్యాంప్లు నిర్మించింది. ఇక్కడ ఎడ్యుకేషనల్ హబ్లు ఏర్పాటు చేసి నల్లమల గురించి వివరిస్తున్నారు. పర్యాటకులు విడిది చేసే ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దారు. అడవిలో గడుపుతూ ప్రకృతిని ఆస్వాదించేలా ఏర్పాట్లు చేశారు. చిన్నారులకు వినోదంతో పాటు విజ్ఞానం అందించేందుకు ఎకోవాక్, హెరిటేజ్ వాక్, జంగిల్ సఫారీ, ట్రెక్కింగ్, బర్డ్స్, బటర్ఫ్లై పార్కులు ఏర్పాటు చేశారు. చిన్న పిల్లలు సరదాగా గడిపేందుకు అవసరమైన రకరకాల ఆటవస్తువులు ఏర్పాటు చేశారు.
బైర్లూటి ఎకో టూరిజం కేంద్రం
జీవ వైవిధ్యానికి నిలయం
కాలగమనంలో ఎన్నో జీవజాతులు అంతరించిపోతున్నాయి. అలాంటి వాటి గురించి భవిష్యత్తు తరాలకు పరిచయం చేసేందుకు 2001 డిసెంబరు 8న శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ కేంద్రంగా జీవ వైవిధ్య పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ అనేక జీవరాసుల నమూనాలు నిక్షిప్తం చేశారు. నల్లమలలో నివసించే జంతువులు, వాటి జీవన విధానాలు, అరుదైన జీవరాసులను గుర్తించి ప్రపంచానికి పరిచయం చేయడం వంటి పనులు ఈ కేంద్రంలో కొనసాగుతున్నాయి. ఇందులో 303 రకాల క్షీరదాలు, 80 రకాల పాములు, 102 రకాల సీతాకోక చిలుకలు. 55 రకాల చేపలు, 25 లాంబాలు, 18 జాతుల కప్పలు, 54 జాతుల సరీసృపాలు, 57 రకాల మాత్లు, 77 రకాల కీటకాల అవశేషాలు భద్రపరిచారు.
ఎన్నో ప్రత్యేకతలు
వైవిధ్య భరితమైన వాతావరణం కలిగిన నల్లమల పలు ప్రత్యేకతలను సంతరించుకుంది. వెతికే కొద్దీ కొత్త కొత్త అందాలు, అరుదైన జీవరాసులు కనిపిస్తూనే ఉన్నాయి. నల్లమల కొండలు తూర్పు కనుమల్లో విస్తరించి ఉన్నాయి. నల్లమల మొత్తం విస్తీర్ణం 5,947 చ.కి.మీలు. ఇందులో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 3,040.74 చ.కి.మీ పరిధిలో రాజీవ్గాంధీ (నాగార్జున సాగర్-శ్రీశైలం) జాతీయ పులుల అభయారణ్యం విస్తరించి ఉంది.
ఎకో టూరిజంలో కాటేజెస్
ఔషధాల ఖిల్లా
నల్లమల ఔషధాల ఖిల్లాగా పేరుగాంచింది. ఈ అడవి పరిధిలో వేలాది ఔషధ మొక్కలున్నాయి. సున్నిపెంట జీవ వైవిధ్య కేంద్రం పరిధిలో అరుదైన, ఔషధ గుణాలున్న 353 జాతులను గుర్తించారు. రోళ్లపెంట నుంచి పెచ్చెర్వు గూడేనికి వెళ్లే దారిలో వనమూలికల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకేచోట 70- 80 జాతుల ఔషధ మొక్కలు ఉండటం విశేషం.
ఎకలాజికల్ నాలెడ్జ్ పార్క్
సున్నిపెంట జీవ వైవిధ్య కేంద్రం ఎదురుగా 8 హెక్టార్లలో ఎకలాజికల్ నాలెజ్డ్ పార్క్ ఏర్పాటు చేశారు. డైనోసార్ల కాలం నుంచి భూమి పుట్టుక, జీవ పరిణామ క్రమాన్ని వివరించే చిత్రాలు, బొమ్మలను ఇక్కడ ఏర్పాటు చేశారు. సందర్శనకు వచ్చే పర్యాటకుల సౌకర్యార్థం నాలుగు ప్రాంతాల్లో భోజనం, విడిది, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు.
అంతర్జాలంలో బుక్ చేసుకోవచ్చు
నల్లమల విహారానికి వచ్చే పర్యాటకులు జంగిల్ క్యాంప్లో విడిది చేసేందుకు ఆన్లైన్లో ఎన్ఎస్టీఆర్.కో.ఇన్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
్య పర్యాటకుల సౌకర్యార్థం బైర్లూటిలో 4 కాటేజెస్, 6 టెంట్లు, పచ్చర్లలో 4 కాటేజెస్, 2 టెంట్లు ఏర్పాటు చేశారు. ఒక రోజు విడిదికి కాటేజెస్ ధర రూ.6 వేలు, టెంట్కు రూ.6,500 చెల్లించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి మరుసటి రోజు 12 గంటల వరకు ఇక్కడ ఉండవచ్చు. సఫారీ చేసే వారు వాహనానికి (10 మందికి) రూ.3 వేలు చెల్లించాలి. ఎన్ఎస్టీఆర్ వెబ్సైట్లో పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయి.
18 కి.మీ. ప్రయాణం
బైర్లూటి జంగిల్ క్యాంప్ నుంచి 15 కి.మీలు సఫారీ ఏర్పాటు చేశారు. తిరుగు ప్రయాణంలో 3 కి.మీలు కలిపి మొత్తం 18 కి.మీలు ప్రయాణం ఉంటుంది.
రుచులు పంచే రెస్టారెంట్లు
నల్లమల సందర్శనకు వచ్చే పర్యాటకులకు రుచికరమైన ఆహారం అందించేందుకు సుందరమైన రెస్టారెంట్ను నిర్మించారు. వీటిలో భోజనం, ఫలహారం అందుబాటులో ఉంటుంది. ప్యాకేజీలోనే పర్యాటకులు కోరిన విధంగా శాఖాహారం, మాంసాహారం అందిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి
[ 27-07-2024]
మాజీ మంత్రి బీవీ మోహన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. -
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..