ఇంటర్ విద్య.. భావిజీవిత మలుపు
విద్యార్థి జీవితం మలుపు తిరిగే ప్రధాన వేదిక ఇంటర్ విద్య. పదో తరగతి తర్వాత దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.
ప్రారంభమైన ప్రవేశాలు
దేవనకొండ జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి పూర్తయిన విద్యార్థులకు ఇంటర్ విద్యపై అవగాహన కల్పిస్తున్న అధ్యాపకులు
కర్నూలు విద్య, న్యూస్టుడే: విద్యార్థి జీవితం మలుపు తిరిగే ప్రధాన వేదిక ఇంటర్ విద్య. పదో తరగతి తర్వాత దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. గ్రూప్ ఎంపికలో విద్యా నిపుణులతో చర్చించడం, భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడేందుకు దోహదం చేసే అంశాలు తదితర వాటిపై విద్యార్థులు ఒకటి రెండుసార్లు విశ్లేషించుకున్న తర్వాతే ఇంటర్లో తమకిష్టమైన గ్రూప్ తీసుకుని ముందడుగు వేస్తారు. 2024-25 విద్యా సంవత్సరానికిగాను ఇంటర్మీడియేట్ ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా ఇంటర్ శాఖ విద్యాధికారులు తమ అధ్యాపకులతో కార్యాచరణ మొదలుపెట్టారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, పదో తరగతి పూర్తయిన విద్యార్థుల ఇళ్ల వద్దకెళ్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అందుతున్న విద్య, వసతులపై అవగాహన కల్పించడంతోపాటు ప్రవేశాలు చేపడుతున్నారు. ప్రైవేటు జూనియర్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు కృషి చేస్తున్నట్లు ఆర్ఐవో గురువయ్య శెట్టి తెలిపారు.
విద్యా, వసతులపై విశ్లేషణ
ఉమ్మడి కర్నూలు జిల్లాలో 43 ప్రభుత్వ, 140 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటితోపాటు మొత్తం 54 కేజీబీవీల్లో 2,120 ఇంటర్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 60 శాతం సీట్లు భర్తీ అయినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని 32 ఆదర్శ పాఠశాలల్లో కూడా ఇంటర్మీడియట్ చదువుకోవడానికి అవకాశముంది. కేజీబీవీల్లో బాలికల చదువుతోపాటు సంరక్షణ, ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోని ఒక్కో గ్రూప్నకు 120 సీట్లు అందుబాటులో ఉన్నాయంటూ అధ్యాపకులు ఇంటింటికి వెళ్లి విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘12th ఫెయిల్’కు జాతీయ అవార్డు.. ప్రచారంపై స్పందించిన నటుడు
-
అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలాహారిస్ ఖరారు
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం