ఉచిత శిక్షణ.. క్రికెట్కు నిచ్చెన
బేతంచెర్లలో నిర్వహిసున్న ఉచిత శిక్షణను క్రికెట్పై ఆసక్తితో విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి చిన్నారులు శిక్షణ శిబిరాలకు హాజరై బౌలింగ్, బ్యాటింగ్లలో తర్ఫీదు పొందుతున్నారు.
సాధన చేస్తున్న విద్యార్థులు
బేతంచెర్ల, న్యూస్టుడే: బేతంచెర్లలో నిర్వహిసున్న ఉచిత శిక్షణను క్రికెట్పై ఆసక్తితో విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి చిన్నారులు శిక్షణ శిబిరాలకు హాజరై బౌలింగ్, బ్యాటింగ్లలో తర్ఫీదు పొందుతున్నారు. బేతంచెర్ల పట్టణంలోని శేషారెడ్డి ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో క్రమం తప్పకుండా విద్యార్థులు సాధన చేస్తున్నారు. చిన్నారులు వచ్చిన వెంటనే వారికి సీనియర్ ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్ ఎలా చేయాలో నేర్పిస్తున్నారు. క్రీడాకారులు ఫిట్గా ఉన్నారా లేదా అనే విషయాన్ని శిక్షకులు పరిశీలించి ఆ మేరకు వివిధ రకాల ఎక్సర్సైజ్లు చేయిస్తున్నారు. చిన్నారులు, శిక్షకులతో ఇక్కడి మైదానం ఎప్పుడూ కళకళలాడుతూనే ఉంటోంది.తొలుత శిక్షకులు ఆటలో పాటించాల్సిన విధానాలు వివరిస్తున్నారు. అందరికీ అవగాహన కల్పించాక శిక్షణ ఇస్తున్నారు. షార్ట్ పిచ్, యార్కర్, పుల్టాస్, స్పిన్ బంతులను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తున్నారు. బౌలింగ్లో బ్యాట్స్మెన్ ఆడే తీరును బట్టి బంతిని ఎదుర్కొనే విధానాలను నేర్పిస్తున్నారు. వాటితో పాటు ఫీల్డింగ్లో కూడా పలు అంశాలపై విద్యార్థులకు చెబుతున్నారు. ఎలా ఆడాలో సీనియర్లు మెలకువలు నేర్పిస్తుండటంతో మైదానం ఎప్పుడూ సందడిగా ఉంటోంది.
ఆటపై ఇష్టంతోనే సాధన
- మహమ్మద్ కైఫ్, ఇంటర్
క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఐపీఎల్ చూడటంతో ప్రభావితమయ్యాను. ఆట నేర్చుకోవాలనే పట్టుదలతో ముంబయిలో దిలీప్ వెంగ్ సర్కార్ క్రికెట్ అకాడమీలో అండర్ 17, 19 విభాగంలో ఆడాను. ఆల్ రౌండర్గా రాణిస్తూ పతకాలు సాధించాను. క్రికెట్లో మెలకువలు నేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ సారి వేసవిశిక్షణ శిబిరానికి హాజరయ్యాను. ఇక్కడ బ్యాటింగ్, బౌలింగ్ అంశాల్లో చక్కటి శిక్షణ ఇస్తున్నారు. వేసవి తర్వాత సాధన కొనసాగించి మంచి ఆటగాడిగా రాణించాలనే లక్ష్యంతో సాధన చేస్తున్నాను.
జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొన్నా
- ఎస్ఎండీ సమీర్, బేతంచెర్ల
రెండు సంవత్సరాల నుంచి వేసవి శిక్షణ తీసుకుంటున్నా. శిక్షణ తీసుకున్న తర్వాత జిల్లాస్థాయిలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో జట్టుకు ప్రాతినిధ్యం వహించాను. కర్నూలులో జరిగిన అండర్-14 సబ్ జూనియర్ క్రికెట్ టోర్నమెంట్ పోటీల్లో పాల్గొని జట్టు విజయానికి కృషి చేశా. సిమెంట్నగర్, బేతంచెర్లలో వేసవి శిక్షణ శిబిరంలో నిర్వహించిన జిల్లాస్థాయి క్రికెట్ జట్టులో ఆడి పతకం సాధించాను. బ్యాటింగ్లో పట్టు సాధించడం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాం. వేసవి శిక్షణ శిబిరంలో మెలకువలు నేర్చుకున్నాను.
ఆసక్తి పెరిగింది
- శ్రీనివాసులు, శిక్షకుడు
ప్రస్తుత రోజుల్లో క్రికెట్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండేళ్ల నుంచి విద్యార్థులకు ఉచితంగా వేసవిలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నాం. విద్యార్థుల్లో ఆసక్తి పెరిగింది. బేతంచెర్ల, సిమెంట్నగర్ గ్రామాల్లో జిల్లాస్థాయిలో నిర్వహించిన క్రికెట్ పోటీలకు ఎంపిక లు చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లన్న సేవలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి
[ 27-07-2024]
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని శనివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ దర్శించుకున్నారు. -
తుంగభద్ర జలాశయానికి భారీగా వరద..
[ 27-07-2024]
జిల్లా పశ్చిమ ప్రాంతాలకు తాగు, సాగు నీరు అందించే జీవనాడి తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరిగిందని డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
సుంకేసుల జలాశయంకు భారీగా వరద ప్రవాహం
[ 27-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు సుంకేసుల జలాశయానికి భారీగా వరద ఉద్ధృతి పెరుగుతోంది. -
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల