అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్టకు చర్యలు
ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టినట్లు సెబ్ పర్యవేక్షణాధికారి రవికుమార్ తెలిపారు.
- సెబ్ పర్యవేక్షణాధికారి రవికుమార్
వివరాలు వెల్లడిస్తున్న సెబ్ పర్యవేక్షణాధికారి రవికుమార్, పక్కన సీఐలు రాజేంద్రప్రసాద్, నరసనాయుడు
కర్నూలు నేరవిభాగం, న్యూస్టుడే: ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టినట్లు సెబ్ పర్యవేక్షణాధికారి రవికుమార్ తెలిపారు. బుధవారం కర్నూలు సెబ్ కార్యాలయంలో ఆయన కర్నూలు స్టేషన్ సీఐ రాజేంద్రప్రసాద్, డీటీఎఫ్ సీఐ నరసనాయుడు, ఎస్సై వీరస్వామిలతో కలిసి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తుంగభద్రనది నుంచి ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు. కర్నూలు స్టేషన్ పరిధిలో మునగాలపాడు, జొహరాపురం పరిధిలో దాడులు నిర్వహించి 8 ట్రాక్టర్లను సీజ్ చేసి 8 మందిపై కేసులు నమోదు చేసి 32 మెట్రిక్ టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నామన్నారు. రూ.90 వేలు అపరాధ రుసుము వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేశామన్నారు. ఆదోనిలో రెండు ఇసుక ట్రాక్టర్లు, పత్తికొండ పరిధిలో రెండు ట్రాక్టర్లు సీజ్ చేసి 20 మెట్రిక్ టన్నులు సీజ్ చేశామన్నారు. నదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. కర్నూలు, ఆదోని, గుడికంబాలి, కౌతాళంలో ఇసుక డిపోలున్నాయని, ఇసుక అవసరార్థులు అక్రమంగా ఇసుక కొనుగోలు చేయకుండా దరఖాస్తు చేసుకుని కొనుగోలు చేయాలన్నారు. అక్రమ ఇసుకను కొని ప్రోత్సహించవద్దన్నారు. ఇసుక అక్రమ రవాణా సమాచారం తెలిసినవారు తనకు (8008828467) ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. 2023 ఏడాదిలో ఇసుకకు సంబంధించి 137 కేసులు నమోదైతే ఈ ఏడాది ఫిబ్రవరి 1 నుంచి ఇప్పటి వరకు వరకు 187 కేసులు నమోదు చేసి 719 మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేశామన్నారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోనే అత్యధికంగా కర్నూలు జిల్లాలో 17,839 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకుని 319 కేసులు నమోదు చేసి 387 మంది నిందితులను అరెస్టు చేసి 216 వాహనాలు సీజ్ చేశామన్నారు. సారాకు సంబంధించి ఎర్రకత్వతాండా, ఎంఎం తాండా, రోళ్లపాడు తాండా, ఆదోని హిల్స్లు దాడులు చేసి భారీ మోతాదులో బెల్లం ఊటలను ధ్వంసం చేశామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీ జాగా.. కేటుగాళ్ల పాగా
[ 27-07-2024]
గత ఐదేళ్ల పాలనలో వైకాపా నేతలు కన్పించిందల్లా కాజేశారు. గుట్టలు మింగారు.. కంకర నమిలారు.. కాల్వలు ఖతం చేశారు. -
తుంగా తరంగాలు
[ 27-07-2024]
తుంగభద్ర నదికి వరద పోటెత్తింది.. ఎగువ నుంచి భారీగా వస్తోంది.. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయాలు నిండిపోవడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. -
రామోజీ ఫిల్మ్సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
జల సవ్వడి
[ 27-07-2024]
తుంగభద్ర జలాశయం నుంచి నీరు విడుదల చేయడంతో దిగువకు నీటి ప్రవాహం పెరిగింది. కర్నూలు గ్రామీణ మండలంలోని సుంకేసుల జలాశయానికి నీటి ప్రవాహం పెరిగింది. -
ప్రాణాలు పణం.. దక్కేనా మీనం
[ 27-07-2024]
కర్ణాటక తుంగభద్ర జలాశయం నుంచి దిగువకు సుమారు 1.20 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. దీంతో నదీ పరివాహక ప్రాంతవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. -
ప్రాజెక్టుల పేరుతో రూ.కోట్లు దండుకున్నారు
[ 27-07-2024]
ప్రాజెక్టుల పేరుతో వైకాపా నాయకులు రూ.కోట్లు దండుకున్నారని నియోజకవర్గ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్రెడ్డి అన్నారు. శాసన సభ సమావేశంలో శుక్రవారం బీవీ సభను ఉద్ధేశించి మాట్లాడారు. -
భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలి
[ 27-07-2024]
పాణ్యం నియోజకవర్గంలోని ఓర్వకల్లు, కల్లూరు మండలాల్లో గత వైకాపా పాలకులు చేసిన భూకబ్జాలపై విచారణ కమిటీ వేయాలని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావించారు. -
తీర్థలా నెలవు.. కోనీరు కరవు
[ 27-07-2024]
శ్రీశైలంలో మల్లన్నదర్శనానికి వచ్చే భక్తులకు పుణ్య స్నానాలు కరవయ్యాయి. పాతాళగంగ, కళ్యాణకట్ట వద్ద గంగాభవాని స్నానాల ఘాట్ల వద్ద అపరిశుభ్రత నెలకొంది. -
చుట్టుముట్టిన కష్టాలు.. చేయూతకు వేడుకోలు!
[ 27-07-2024]
పుట్టుకతోనే దివ్యాంగురాలైన చిన్నారి పోషణ, వైద్యానికి చేయూతనివ్వాలని ఒకరు.. ప్రమాదంలో వెన్నువిరిగి మంచానికే పరిమితమయ్యాను.. సాయం చేయాలని మరొకరు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. -
భవితకు బాసట
[ 27-07-2024]
మానసిక, శారీరక వైకల్యంతో బాధపడే బాలలకు భవిత కేంద్రాలు బాసటగా నిలుస్తున్నాయి. వివిధ పద్ధతుల్లో విద్యను అందిస్తూ సాధారణ విద్యార్థులుగా వారిని తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాయి. -
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు సన్నాహాలు
[ 27-07-2024]
శ్రీశైలం జలాశయానికి కృష్ణా జలాలు భారీగా చేరుతుండటంతో శుక్రవారం నాటికి 862 అడుగుల చేరి, 110 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జలాశయానికి రోజుకు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. -
కర్నూలు సబ్ రిజిస్ట్రార్పై సస్పెన్షన్ వేటు
[ 27-07-2024]
కర్నూలు జాయింట్-1 సబ్ రిజిస్ట్రార్ బి.ప్రవీణ్కుమార్పై సస్పెన్షన్ వేటు పడింది. కర్నూలు పరిధిలోని జొహరాపురం రోడ్డులోని 154 సర్వే నంబరుకు సంబంధించిన 12.59 ఎకరాల వక్ఫ్ బోర్డు స్థలాన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట